భారతదేశంలో, హరిత విప్లవం కారకుడు ప్రధానంగా M.S. స్వామినాథన్. హరిత విప్లవం ఫలితంగా 20వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైన కొత్త, అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రవేశపెట్టడం వలన ఆహార ధాన్యాల (ముఖ్యంగా గోధుమ మరియు బియ్యం) ఉత్పత్తిలో గొప్ప పెరుగుదల ఏర్పడింది. హరిత విప్లవం వరి దిగుబడిలో వేగవంతమైన పెరుగుదలకు ఉపయోగించే ఎరువులు మరియు ఇతర రసాయనిక ఇన్పుట్ల విస్తృత వినియోగంతో కలిపి మెరుగైన రకాలు అందించబడింది మరియు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆదాయాలు మరియు ఆహార సరఫరాలపై ప్రభావాన్ని చూపింది. ఈ కధనంలో భారతదేశంలో హరిత విప్లవం పూర్తి వివరాలను అందిస్తున్నాము. భారతదేశంలో హరిత విప్లవం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కధనాన్ని చదవండి.
వ్యవసాయంలో మేలైన విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు, సాగునీరు, ధరలు, పరపతి లాంటి అంశాల ద్వారా ముఖ్యంగా అధిక ఉత్పత్తిని సాధించడాన్నే హరితవిప్లవం అంటారు.
హరిత విప్లవం అనేది 1960 లలో నార్మన్ బోర్లాగ్ ప్రారంభించిన ప్రయత్నం. అతను ప్రపంచంలో ‘హరిత విప్లవ పితామహుడు’ గా పిలువబడ్డాడు. ఇది గోధుమలను అధిక దిగుబడినిచ్చే (HYVs) అభివృద్ధిలో చేసిన కృషికి 1970 లో నోబెల్ శాంతి బహుమతిని తెచ్చి పెట్టింది.
Adda247 APP
భారత్లో మూడో పంచవర్ష ప్రణాళికా కాలం (1961 -66)లో వ్యవసాయ రంగంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి మూలంగా ఆహార కొరత ఏర్పడింది. పబ్లిక్ లా – 480 కింద అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకున్నాం.
హరిత విప్లవం అనే పదాన్ని 1968లో మొదటిసారి విలియం ఎస్. గాండ్ ఉపయోగించాడు. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహాయంతో మెక్సికన్ గోధుమ రకాన్ని అభివృద్ధి చేసిన నార్మన్ బోర్లాగ్ (అమెరికా)ను హరిత విప్లవ పితామహుడు అంటారు.
1. HYVP అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం (High Yielding Varieties Programme)
2. అల్ప ఫలదీకరణ కాలం గల పంటలను ప్రవేశపెట్టడం
3. ఆధునిక సాంకేతిక పద్ధతులు
నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను కింది అంశాల్లో ప్రవేశపెట్టారు.
1964 నుంచి మద్దతు ధరల విధానం ప్రారంభం అయింది. 1965 లో ఆహారధాన్యాల ధరలపై సలహాకు వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేసారు. 1965లో ఆహారధాన్య కొనుగోలుకు భారత ఆహార సంస్థ (ఎపీసీఐ)ని ఏర్పాటు చేసారు.
4. ప్రభుత్వ సంస్థలు ఉత్పాదకాల ప్యాకేజీ
పై అంశాల కలయిక ద్వారా వ్యవసాయరంగ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ ఫలితాన్నే హరిత విప్లవం అంటారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది. హరిత విప్లవం వరి, గోధుమల ఉత్పత్తిపై ఎక్కువ ప్రభావం చూపింది. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పప్పుధాన్యాల ఉత్పత్తి క్రమంగా తగ్గింది.
వాణిజ్య పంటల ఉత్పత్తి పెరిగింది. నూతన వ్యవసాయక వ్యూహ ప్రధాన లక్ష్యల వల్ల ఆహారధాన్యాలు పెరిగాయి. 1960 – 61 నుంచి 1973 – 74 వరకు వాణిజ్య పంటలపై హరిత విప్లవం ప్రభావం లేదు. దీన్ని డాక్టర్ ధరమ్ నారాయణ్ వాణిజ్య పంటల పక్షపాతంగా వర్ణించాడు. 1973 – 74 తర్వాత వాణిజ్య పంటల్లో పెరుగుదల కనిపించింది.
1960లో వరి ఉత్పాదకత 10 క్వింటాళ్లు. అది 2011 -12 నాటికి 23 క్వింటాళ్లకుపెరిగింది. ఇదే కాలానికి గోధుమ 8 క్వింటాళ్ల నుంచి 31 క్వింటాళ్లకు పెరిగింది.
నూతన వ్యవసాయక వ్యూహం/హరిత విప్లవం ద్వారా సాధించిన భారత వ్యవసాయ వృద్ధి, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత తగ్గింది.
ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు: నీటిపారుదల సౌకర్యాల కొరత, ఆధునిక సాంకేతిక విజ్ఞానం అల్ప వినియోగం, ఉత్పాదకాల వాడకంలో అల్ప వినియోగం, ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడం, పరపతి సౌకర్యాల కొరత మొదలైన కారణాల వల్ల వృద్ధి తగ్గింది.
8వ ప్రణాళిక కాలంలో వ్యవసాయంతోపాటు, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. భారత్లో మొదటి వ్యవసాయ విధానం ప్రకటన – 1993 లో చేసారు. నూతన వ్యవసాయ విధానం 2000లో ప్రకటించారు. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. దీన్ని 2000, జులై 28న ప్రకటించారు. ఇది 4% వ్యవసాయ వృద్ధి లక్ష్యంగా ఉంది.
శ్వేత విప్లవం (పాల ఉత్పత్తి/ Operation Flood) – 1970 లో ప్రారంభించారు
వర్గీస్ కురియన్ నేతృత్వంలో శ్వేత విప్లవం ప్రారంభమైంది. ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి చేసేదేశం భారత్. భారత్లో తలసరి పాల లభ్యత – 290 గ్రా. (2011 – 12)
రెయిన్బో విప్లవం: దీనిలో వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధికి చర్యలు చేపట్టారు
ప్రధానంగా చేపలు (Blue), మాంసం (Red), ఎరువులు (Grey), గుడ్లు (Silver), పండ్లు/ఆపిల్ (Golden). రొయ్యలు (shrimp), క్రూడ్ఆయిల్ (Black), ఆలుగడ్డలు (Round), సుగంధ ద్రవ్యాలు (Brown) మొదలైన వాటిని విప్లవాత్మకంగా ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు.
మొత్తంగా, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా భారతదేశానికి హరిత విప్లవం ఒక పెద్ద విజయం మరియు వారికి అపూర్వమైన జాతీయ ఆహార భద్రతను అందించింది. ఇది వ్యవసాయంలో పారిశ్రామిక దేశాలు ఇప్పటికే తమ కోసం స్వాధీనం చేసుకున్న శాస్త్రీయ విప్లవం యొక్క విజయవంతమైన అనుసరణ మరియు బదిలీ చేయటానికి సహాయ పడింది. ముందుకు సాగే మార్గంగా, విధాన కర్తలు కొత్త టెక్నాలజీల నుండి ఎక్కువ ప్రత్యక్ష ప్రయోజనాలను పొందేలా చూడటానికి పేదవారిని ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవాలి మరియు ఆ సాంకేతికతలు కూడా పర్యావరణ హితంగా ఉండాలి. అలాగే, గతం నుండి పాఠాలు నేర్చుకుంటూ, అటువంటి కార్యక్రమాలలో పరిమిత క్షేత్రానికి కట్టుబడి కాకుండా అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ లబ్ధిదారులందరూ ఉండేలా చూసుకోవాలి.
Green Revolution in India, Download PDF
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Wheat and Rice were the two most successful crops of the Green Revolution
Dr. MS Swaminathan is the father of the Indian Green Revolution.
The Green Revolution resulted in a significant increase in production of food grains (especially wheat and rice)
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…