Telangana Socio Economic Survey 2022 Key Highlights: The Government of Telangana publishes the Socio Economic Outlook (SEO) annually and tables it in the State Legislature during the budget session. It presents the socio-economic performance of the State across various sectors and recognizes the specific gaps and challenges to initiate appropriate action. It also presents the information on Government policies and flagship programs, and analyses their performance. SEO2022 highlights the major achievements of the State in relevant sections.
Telangana Socio-Economic Survey 2022 | |
Socio Economic survey year | 2022 |
Useful for | TSPSC Groups, SI, Constable |
TSPSC Groups, SI, Police Constable వంటి అన్ని పోటీ పరీక్షలకు తెలంగాణ సామాజిక ఆర్ధిక సర్వే ఎంతో ముఖ్యమైన అంశము. TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో ఈ అంశం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కావున ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొనే Telangana Socio-Economic Survey 2022 కి సంబంధించిన పూర్తి అంశాలను ముఖ్యమైన పాయింట్ల రూపంలో మీకు అందిస్తున్నాము.
2021 – 2022లో పన్నేతర రాబడి అంచనాలు చేరుకోకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,557 కోట్ల పన్నేతర రాబడిని అంచనా వేయగా జనవరి వరకు రూ.7 వేల కోట్లలోపు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర రాబడి అంచనాలను రూ.25,421 కోట్లుగా పేర్కొంది. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ.15,500 కోట్లను, గనుల శాఖ ద్వారా రూ.6,399 కోట్లను అంచనా వేయగా మిగిలిన మొత్తం ఇతర పన్నేతర రాబడిగా పేర్కొంది.
ఏ సంక్షోభాన్నైనా ఎదుర్కొని నిలబడగలదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మళ్లీ నిరూపించుకుంది. గత రెండేళ్లలో కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి వృద్ధి రేటులో తెలంగాణ మళ్లీ పూర్వపు దూకుడును అందుకుంది. స్థిర ధరల వద్ద 2021–22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు 8.9 శాతం కాగా, తెలంగాణ 11.2 శాతం సాధించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టిన “తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022” నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం… ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్రం 19.1 శాతం వృద్ధి రేటు సాధించగా, జాతీయ సగటు 19.4 శాతంగా నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) విలువ రూ.11.6 లక్షల కోట్లు.
ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశం/రాష్ట్రంలో ఉత్పత్తి అయిన తుది సరుకులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)/ రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) అంటారు. ఆర్థికాభివృద్ధికి సూచికలుగా జీడీపీ, జీఎస్డీపీలను పరిగణిస్తారు.
జాతీయ వృద్ధి రేటును అధిగమించి రాష్ట్రం సాధించిన ఆర్థికాభివృద్ధి
వ్యక్తిగత స్థాయిలో ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు సూచికైన తలసరి ఆదాయం వృద్ధిలో రాష్ట్రం దూకుడు కొనసాగిస్తోంది. 2021–22లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా, జాతీయ సగటు రూ.1,49,848 మాత్రమే. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 1.9 రెట్లు అధికంగా ఉంది. 2020–21లో రాష్ట్రం రూ.2,37,632 తలసరి ఆదాయంతో 14 పెద్ద రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.
జిల్లాల వారీగా తలసరి ఆదాయం |
రంగారెడ్డి | 6,58,757 |
హైదరాబాద్ | 2,51,331 |
మేడ్చల్ – మల్కాజ్గిరి | 2,40,008 |
మెదక్ | 2,29,833 |
మహబూబ్ నగర్ | 2,23,348 |
యాదాద్రి | 2,22,100 |
సిద్దిపేట | 2,19,292 |
జయశంకర్ భూపాలపల్లి | 2,13,735 |
సంగారెడ్డి | 2,04,692 |
నల్గొండ | 2,01,144 |
కరీంనగర్ | 1,91,205 |
సూర్యాపేట | 1,83,810 |
భద్రాద్రి | 1,83,386 |
ఖమ్మం | 1,83,318 |
నిర్మల్ | 1,79,169 |
వరంగల్ రూరల్ | 1,75,951 |
ఆదిలాబాద్ | 1,75,171 |
జనగాం | 1,74,636 |
పెద్దపల్లి | 1,73,981 |
ములుగు | 1,67,769 |
నిజామాబాదు | 1,66,766 |
నాగర్ కర్నూల్ | 1,63,462 |
రాజన్న సిరిసిల్ల | 1,56,150 |
కామారెడ్డి | 1,55,032 |
మంచిర్యాల | 1,54,955 |
మహబూబాబాద్ | 1,52,577 |
వనపర్తి | 1,51,458 |
జగిత్యాల | 1,50,048 |
జోగులాంబ గద్వాల | 1,49,606 |
నారాయణపేట | 1,43,428 |
వరంగల్ అర్బన్ | 1,38,387 |
కొమురం భీమ్ | 1,37,488 |
వికారాబాద్ | 1,37,479 |
Also read: Telangana Budget 2022-23
రాష్ట్రాల జీఎస్డీపీకి మూడు ప్రధాన రంగాలైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలు ఊతమిస్తాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్వీఏ)నకు సేవల రంగమే ప్రధాన చేయూత ఇస్తోంది. తర్వాతి స్థానంలో పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలున్నాయి. 2021–22లో జీఎస్వీఏలో 61.3 శాతం వాటా సేవల రంగానిదే కాగా, 20.4 శాతం వాటా పారిశ్రామిక, 18.3 శాతం వాటా వ్యవసాయ, అనుబంధ రంగాలది.
2014–15లో 16.3 శాతం ఉన్న వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2021–22లో 18.3 శాతానికి పెరిగింది. 2014–15లో మైనస్ 0.66 శాతం రుణాత్మక వృద్ధి రేటు కలిగిన రాష్ట్ర వ్యవసాయ, అనుబంధాల రంగాలు.. 2021–22లో 9.09 శాతం వృద్ధి రేటును సాధించడం దీనికి నిదర్శనమని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ తెలంగాణకు వెన్నుముకగా ఉన్న వ్యవసాయం 48 శాతం జనాభాకు ఉపాధి కల్పిస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సాగు అభివృద్ధికి దోహదపడ్డాయి.
పెరిగిన పురుగు మందుల వినియోగం: తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల వినియోగం భారీగా పెరిగిందని తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22 వెల్లడించింది. రాష్ట్రంలో ఎరువుల వినియోగం 2018లో 28లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2020లో 39లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని తెలిపింది. సాగులో ఉన్న భూమి విస్తీర్ణం, పంట రకం, పంట విధానం, పంట తీవ్రత, నేల రకం, దాని పరిస్థితి, వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు, రైతుల సామర్థ్యం వంటి అనేక కారణాల వల్ల ఎరువులు, పురుగు మందుల వినియోగం నిర్ణయిస్తారు. నీటి పారుదల సౌకర్యం గణనీయంగా పెరగడంతో సాగు విస్తీర్ణం అధికమైంది. దీంతో ఎరువుల వినియోగం పెరిగిందని తెలిపింది.
2021–22 యాసంగిలో దాదాపు 63 లక్షల మంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందారు. వీరిలో 72.58 శాతం మంది సన్నకారు రైతులు. 18.30 శాతం మంది చిన్న రైతులు. మిగిలినవారు పెద్దరైతులు. రైతుబంధు కింద ఇప్పటివరకు ఎనిమిది సీజన్లలో కలిపి రూ.50,448 కోట్లు రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. 2021–22 యాసంగిలో మొత్తం 63 లక్షల మంది లబ్ధిదారులలో 53 శాతం మంది బీసీలున్నారు. 13 శాతం మంది ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారున్నారు. రైతుబంధు మొత్తం సొమ్ములో 48 శాతం బీసీలకు, 30 శాతం ఇతరులకు, 13 శాతం ఎస్టీలకు, 9 శాతం ఎస్సీలకు పంపిణీ చేశారు.
2018 నుండి తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఏ కారణం చేతనైనా రైతు ప్రాణాలు కోల్పోతే సంబంధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక ఉపశమనంగా రూ.5 లక్షల బీమా మొత్తం అందజేస్తుంది. ఈ ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 2018–19 నుండి ప్రభుత్వం రూ.3,763.80 కోట్ల మేరకు క్లెయిమ్లను పరిష్కరించింది. ఆ మొత్తాన్ని 75,276 పేద కుటుంబాలకు బదిలీ చేసింది. 2020–21సంవత్సరంలో రైతు బీమా కింద 32.7లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు.
49 శాతం సాగు భూమి: తెలంగాణ రాష్ట్రం 276.96లక్షల ఎకరాలకు పైగా భౌగోళిక విస్తీర్ణంతో భారతదేశంలో 11వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. మొత్తం విస్తీర్ణంలో 49.07 శాతం విస్తీర్ణం నికర సాగు ప్రాంతం. 24.07 శాతం అటవీ విస్తీర్ణంలో ఉంది. వ్యవసాయేతర ఉపయోగాలకు కింద భూమి దాదాపు 7.46 శాతం, బీడు భూములు 9.02 శాతం, బంజరు, సాగుకు యోగ్యత లేని భూమి 5.42 శాతం ఉంది. ఇతరత్రా సాధారణ భూములున్నాయి.
ముఖ్యమైన కేటాయింపులు (రూ. కోట్లలో)
అంశం | 2021-2022 | 2022-2023 |
వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రిల అభివృద్ధికి | 2.00 | 250. 00 |
జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిల్లో శస్త్ర చికిత్స వస్తువులకు | 13.57 | 75.00 |
వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిల్లో నిర్ధారణ పరీక్షలకు | 1.00 | 100.00 |
టీవీవీపీ ఆసుపత్రిల్లో పరికరాల కొనుగోలుకు | 1.00 | 200.00 |
బోధనఆసుపత్రిల్లో నిర్ధారణ పరీక్షల పరికరాలకు | .- | 250. 00 |
బోధనఆస్పత్త్రుల్లో డిస్పోసబుల్స్ | – | 150.00 |
ఔషధాలకు | 253.80 | 377.43 |
ప్రాధమిక వైద్యంలో నిర్ధారణ పరీక్షలకు | – | 50.00 |
పీహెచ్ సీ ల్లో పరికరాలకు | – | 50.00 |
104 వాహనాలకు | 36.82 | 15.00 |
108 వాహన సేవలకు | 52.94 | 30.00 |
102 వాహనాలకు(అమ్మఒడి ) | 15.00 | 5.00 |
Download Telangana Socio Economic Survey 2022 Key Highlights
********************************************************************************************
Also check: CUET 2022 Exam Pattern
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 01 May 2024 Addapedia AP and Telangana,…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…