Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Telangana Budget 2022-23

Telangana Budget 2022-23 Highlights, తెలంగాణ బడ్జెట్ 2022-23 ముఖ్యమైన అంశాలు

Telangana state budget 2022-23 PDF

Telangana Budget 2022-23 : Finance Minister T. Harish Rao on March 7 introduced the Telangana Budget for 2022-23 in the State Legislature with an outlay of ₹2,56,958 crore including ₹17,700 crore for its new flagship scheme Dalit Bandhu.

Static-GK-Longest Rivers In India |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Budget 2022-23 pdf, తెలంగాణ బడ్జెట్ 2022-23 ముఖ్యమైన అంశాలు

రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌వేశ‌పెట్టారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు కాగా, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లు.

మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌. టీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నారు. పోటీ పరీక్షలో బడ్జెట్ , ఆర్థిక సర్వేపై ప్రశ్నలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ వివరాలు పరిక్షల కోణంలో నిపుణుల పాటకుల కోసం.

ముఖ్యమైన పథకాలు కేటాయింపులు (రూ. కోట్లలో)

  • రూ.2,56,958.51 కోట్లుతో తెలంగాణ బడ్జెట్
  •  వ్యవసాయ రంగానికి  రూ.24,254 కోట్లు
  • ఆసరా పెన్షన్లకు  రూ.11,728 కోట్లు
  •  కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కు  రూ.2,750 కోట్లు
  •  డబుల్ బెడ్రూమ్ ల కోసం  రూ.12,000 కోట్లు
  • దళితబంధు  రూ.17,700 కోట్లు.
  •  మన ఊరు- మన బడి  రూ.7,289  కోట్లు.
  •  ఎస్టీల సంక్షేమం కోసం  రూ.12,565 కోట్లు
  •  పట్టణ ప్రగతి కోసం  రూ.1,394 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం  రూ.5,698కోట్లు
  •  బ్రాహ్మణుల సంక్షేమం కోసం  రూ.177 కోట్లు
  • పల్లె ప్రగతి  రూ.3330 కోట్లు
  •  ఫారెస్ట్ యూనివర్సిటీకి  రూ.100 కోట్లు
  • హరితహారంకు  రూ.932 కోట్లు
  •  రోడ్లు, భవనాల కోసం  రూ.1542 కోట్లు

ద‌ళిత‌బంధుకు రూ. 17,700 కోట్లు

ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది సీఎం కేసీఆర్ గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధుల‌ను భారీగా పెంపు. గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించ‌గా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తోంది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది.

తెలంగాణా విధ్యా శాఖ

మనఊరు-మనబడి

  1. రెండోదశలో ఇతరప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మనఊరు-మనబడి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది.
  2. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్  ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.
  3. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదించింది.
  4. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈబడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది.
  5. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

adda247

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

  • సొంత జాగ కలిగినవారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్‌లో అందుకు నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి, సొంత స్థలంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది.

తెలంగాణా రైతుల రుణాలు మాఫీ

  • వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ
  • రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ
  • పంట రుణాలు రూ. 16,144 కోట్లు మాఫీ
  • ఈ ద‌ఫా 5.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణాలు మాఫీ

తెలంగాణా వ్య‌వ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు

  • వ్య‌వ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు
  • పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
  • రాష్ట్రంలో 2.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు ల‌క్ష్యం.
  • హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు

తెలంగాణా ఆరోగ్య శాఖ

  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
  • హైదరాబాద్‌లోని 18 మేజర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనా. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి.

 

తెలంగాణా సంక్షేమ శాఖ

  1. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా పింఛన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో రూ.11728 కోట్లను ప్రతిపాదించాం.
  2. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్‌టీఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.
  3. గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది.
  4. రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది.
  5. బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ‘ కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్‌’ పేరుతో పోషకాహారంతో కూడిన కిట్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిర్ణయించింది. ఈ కిట్స్‌ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
  6. గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్‌లో  నిర్ణయం తీసుకోవడం జరిగింది.
  7. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్‌ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.
  8. భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త ప‌థ‌కం ప్రవేశపెడుతున్నాం. మొద‌టి విడత‌లో ల‌క్ష మంది కార్మికుల‌కు మోటార్ సైకిళ్లను ఇవ్వాల‌ని బ‌డ్జెట్‌లో ప్రతిపాదించడమైంది. విధివిదానాలు త్వరలో ప్రకటిస్తాం.
  9. గిరిజ‌న‌, ఆదివాసీ గ్రామ పంచాయ‌తీల‌కు సొంత భ‌వ‌నాల నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఈ ఏడాది 600 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించ‌నున్నాం.
  10. కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ.750 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు.
  11. అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్జెట్‌లో రూ. 800 కోట్లు
  12. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపు.
  13. ఏయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1500  కోట్ల కేటాయింపు.
  14. పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది.
  15. హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్లను ఈ వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
  16.  దూప దీప నైవేధ్య పథకంలో హైదరాబాద్‌లోని దేవాలయాలను చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఈ ఏడాది 1736 దేవాలయాలను కొత్తగా ఈ పథకంలో చేరుస్తున్నారు. దూప దీప నైవేద్య  పథకానికి రూ. 12.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది
  17. మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.500  కోట్లు కేటాయించింది.
  18. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ. 190 కోట్లను బడ్జెట్‌లో కేటాయింపు.
  19. పావలా  వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసి విధంగా ప్రోత్సహించడానికి రూ. 187 కోట్లు కేటాయింపు.
  20.  హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ. 300 కోట్లు కేటాయింపు.

Download: Telangana Budget 2022-23 Pdf 

 మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

 

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతం

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

2022-03-09 10:35:00 AM

సుమారు 91,142 పోస్టులను భర్తీ చేయనున్న తెలంగాణా రాష్ట్రం


2 వ రోజు బడ్జెట్ సమావేశంలో మొత్తం 91,142 ఉద్యోగాను ఈ రోజు నుండే నోటిఫై చేయనున్న తెలంగాణా రాష్ట్రం. వీటిలో సుమారు 11,000 కాంట్రాక్టు పోస్టులను రెగ్యులర్ చేయనున్నట్టు ప్రకటించారు. అభ్యర్ధులు తమ స్థానిక జిల్లాలలో ఉద్యోగాలు చేసుకొనే విధంగా 95% స్థానికత ఆధారంగా భర్తీ.

2022-03-09 10:20:00 AM

తెలంగాణాలో లక్ష నూతన ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించనున్న CM KCR


తెలంగాణా రాష్ట్రంలో సుమారు లక్ష నూతన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని ప్రకటించిన KCR, TSPSC ద్వారా గ్రూప్-1,2, 3, 4 మరియు పోలీస్ ఉద్యోగాలతో పాటు, సుమారు 18000 ఉపాధ్యాయ నియామకాలను ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మొత్తం భర్తీ చేయబోయే ఉద్యోగాలలో 95% స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.

Sharing is caring!