Land Reforms in India: Land reform refers to efforts to reform the ownership and control of land in India. Or, land redistribution by the government from landlords to landless people for agriculture or special purpose is called land reform. There is a need to implement land reforms to reduce inequalities in land ownership and provide social justice.
భారతదేశంలో భూ సంస్కరణలు: భూ సంస్కరణ అనేది భారతదేశంలో భూమి యొక్క యాజమాన్యం మరియు నియంత్రణను సంస్కరించే ప్రయత్నాలను సూచిస్తుంది. లేదా, వ్యవసాయం లేదా ప్రత్యేక ప్రయోజనం కోసం ప్రభుత్వం భూస్వాముల నుండి భూమి లేని వ్యక్తులకు పునఃపంపిణీ చేసిన భూములను భూ సంస్కరణ అంటారు. భూ యాజమాన్యంలోని అసమానతలను తగ్గించి సామాజిక న్యాయం అందించేందుకు భూ సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంస్కరణల్లో ఆరు ప్రధాన వర్గాలు ఉన్నాయి:
గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలకు భూమే ప్రధాన జీవనాధారం. కానీ ఆ భూమి పంపిణీకి సంబంధించి అనేక అసమానతలు అమలవుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువ మొత్తం భూమి అతి తక్కువ సంఖ్యలో ఉన్న ధనవంతులైన భూస్వాముల అధీనంలో ఉంది. ఈ పరిస్థితి సామాజిక న్యాయం అందించాలనే ప్రణాళికా లక్ష్యానికి విరుద్ధంగా ఉంది. భూమి యాజమాన్యంలోని అసమానతలను తగ్గించి సామాజిక న్యాయాన్ని అందించడానికి భూసంస్కరణలు అమలుచేయాల్సిన అవసరం ఏర్పడింది. భూయాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్నే భూసంస్కరణలుగా చెప్పవచ్చు.
నిర్వచనాలు
ప్రొఫెసర్ రాజ్కృష్ణ
ఇతర దేశాల అనుభవాలు
1) జమీందారీ పద్ధతి (1793)
2) రైత్వారీ విధానం (1820)
3) మహల్వారీ విధానం (1833)
శాశ్వత భూమిశిస్తు వసూలు విధానం: ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం 1793లో లార్డ్ కారన్వాలీస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో శాశ్వత భూమి శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీన్నే జమీందారీ విధానం అంటారు. ఇది బెంగాల్, బిహార్, ఒడిశాల్లో అమల్లో ఉండేది. ఈ పద్ధతి ప్రకారం మొదట వ్యవసాయ భూముల నికర ఆదాయంలో 83% కౌలుగా వసూలు చేసేవారు. ఆ తర్వాత సాగుభూమిలో నికర ఆదాయంలో 40% శిస్తుగా వసూలు చేశారు. అయితే శాశ్వత భూమి శిస్తు నిర్ణయం ప్రకారం జమీందార్లు 10/11వ వంతు పంట దిగుబడిని ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో శిస్తు వసూలుకు జమీందార్లు రైతులను పీడించేవారు. చివరికి రైతులు భూమిపై వ్యవసాయం చేసే హక్కుకు వదులుకునేవారు. ఈ పద్ధతి వల్ల రైతులు, కూలీలుగా మారి వ్యవసాయ రంగ అభివృద్ధి క్షీణించింది.
తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం: భూమిశిస్తు వసూలు విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి అవసరమైనప్పుడు భూమిశిస్తును సవరించే తాత్కాలిక నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 20 – 40 సంవత్సరాలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన శిస్తు నిర్ణయిస్తారు. దీంతో రైతులపై పన్ను భారం పెరిగి వ్యవసాయ రంగానికి హాని జరిగింది.
రైతు అంటే భూమిని సాగుచేసేవాడు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కును ఇవ్వడం. భూమిని సొంతంగా సాగుచేసే లేదా ఇతరులతో సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు/సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. మధ్యవర్తుల ద్వారా పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని తొలగించడానికి 1820లో థామస్ మన్రో రైత్వారీ విధానాన్ని అమలుచేశారు. దీన్నే రైత్వారీ శిస్తు నిర్ణాయక విధానం అంటారు. భూమిపై హక్కు ఉన్న రైతులందరినీ భాగస్వాములుగా ఏర్పాటుచేశారు. సంవత్సరానికి ఒకసారి ఈ పన్నును రైతులు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పద్ధతిలో పన్ను వసూలు చేయడంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. భూసారం, ఉత్పత్తి వ్యయం అంశాల ఆధారంగా ప్రభుత్వమే పన్ను నిర్ణయిస్తుంది. భూయజమానులే (కౌలుదారులు కాదు) ఈ పన్నును బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించాలి. స్థూల ఉత్పత్తిలో 40% – 50% వరకు పన్నుగా నిర్ణయించారు. శిస్తును 20 నుంచి 40 సంవత్సరాలకు ఒకసారి సవరించే వీలు ఉంటుంది. రైత్వారీ విధానాన్ని ముందుగా (1817 – 18) బొంబాయి, మద్రాస్ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి తర్వాత ఈశాన్య, వాయవ్య రాష్ట్రాలకు విస్తరించారు. దేశంలోని 38% వ్యవసాయ భూమిలో మాత్రమే ఈ విధానం అమల్లో ఉండేది.
బ్రిటిష్ ప్రభుత్వం ఒక గ్రామంలోని వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూమిని అంచనా వేసి దాన్ని ఆ గ్రామ సమష్టి ఆస్తిగా పరిగణించి మొత్తం భూమిపై శిస్తు విధించేది. ఈ పద్ధతిని మహల్వారీ పద్ధతి అంటారు. దీన్ని 1833లో విలియం బెంటింక్ ప్రవేశపెట్టాడు. గంగా మైదానంలో ఈ పద్ధతి అమల్లో ఉండేది. మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అవధ్ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామపెద్దకు ఈ భూమిపై శిస్తు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈయన గ్రామంలోని రైతుల నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. తన సేవలకు ప్రతిఫలంగా వసూలు చేసిన భూమి శిస్తులో కొంత శాతం కమిషన్గా పొందుతాడు. దేశంలోని 5 శాతం వ్యవసాయ భూమిలో మాత్రమే మహల్వారీ పద్ధతి అమల్లో ఉండేది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భూ సంస్కరణలు
స్వాతంత్ర్యం తర్వాత భూ సంస్కరణల లక్ష్యాలు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు జోసెఫ్ చెల్లాదురై కార్నెలియస్ కుమారప్ప (జేసీ కుమారప్ప) అధ్యక్షతన 1948లో వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. 1949లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులను అనుసరించి జమీందారీ లాంటి మధ్యవర్తుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దున్నేవాడికే భూయాజమాన్యాన్ని బదిలీ చేయాలని సూచించింది.
8వ పంచవర్ష ప్రణాళిక (1992-97)లో పొందుపరిచిన భూసంస్కరణల లక్ష్యాలు:
జమీందారీ నిర్మూలన చట్టాలు
ప్రారంభంలో, ఈ చట్టాలు వివిధ రాష్ట్రాల్లో ఆమోదించబడినప్పుడు, అవి భారత రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుకు విరుద్ధమని కోర్టులలో సవాలు చేయబడ్డాయి. కాబట్టి, భూస్వామ్య రద్దును చట్టబద్ధం చేయడానికి పార్లమెంటులో సవరణలు ఆమోదించబడ్డాయి. 1956 నాటికి, అనేక రాష్ట్రాల్లో జమీందారీ నిర్మూలన చట్టాలు ఆమోదించబడ్డాయి. దీని ఫలితంగా, దాదాపు 30 లక్షల మంది కౌలుదారులు మరియు వాటాదారులు దేశవ్యాప్తంగా మొత్తం 62 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులను పొందారు.
ల్యాండ్ సీలింగ్ చట్టం
ల్యాండ్ సీలింగ్ అనేది ఒక కుటుంబం లేదా వ్యక్తి స్వంతం చేసుకోగల భూమి పరిమాణంపై టోపీని అమర్చడాన్ని సూచిస్తుంది. ఏదైనా మిగులు భూమి కౌలుదారులు, రైతులు లేదా వ్యవసాయ కూలీలు వంటి భూమిలేని వ్యక్తుల మధ్య పంపిణీ చేయబడుతుంది.
అద్దె సంస్కరణలు
ఇది మూడు రంగాలపై దృష్టి పెట్టింది:
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
RPF SI ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్మెంట్ 2024 కోసం…
Veda means 'Knowledge'. The Vedas are the oldest religious texts which are related to the…
Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…
నవోదయ విద్యాలయ సమితి (NVS) నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితమైన ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం…
పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి; కావున, ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఔత్సాహికులు తప్పనిసరిగా దానిపై…
TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…