మధ్యయుగ కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ: మధ్యయుగ కాలంలో, ప్రజల జీవనోపాధి వివిధ వృత్తిపరమైన కళలు, వ్యవసాయం, వాణిజ్యం మరియు వాణిజ్యం, చేతివృత్తుల చేతివృత్తులు మరియు మొదలైనవి సుస్థిర జీవన విధానాలు. ఈ కార్యకలాపాలు కాలక్రమేణా మారాయి. రాష్ట్రం తమ పాలనను నిలబెట్టుకోవడానికి వారి ఉత్పత్తి మరియు వనరుల ఆధారంగా ప్రజలపై పన్నులు విధించింది. మధ్యయుగ భారతదేశంలో, జనాభాలో అత్యధికులు రైతులు. మధ్యయుగ భారతదేశ ఆర్థిక చరిత్రలో అవి అత్యంత ముఖ్యమైన భాగం. మెజారిటీ రైతుల సాధారణ పేరు రాయత్. ఈ వ్యాసంలో మేము మధ్యయుగ కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి వివరాలను అందిస్తున్నాము. మధ్యయుగ కాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి మరింత తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.
చారిత్రక సంఘటనల క్రమం ఆధారంగా చరిత్రను మూడు యుగాలుగా విభజించారు. అవి
1) ప్రాచీన యుగం (క్రీ.శ. 8వ శతాబ్దం పూర్వం )
2) మధ్య యుగం
3) ఆధునిక యుగం ( క్రీ.శ. 18వ శతాబ్దం తర్వాత నుంచి ఇప్పటి వరకు )
భారతదేశ చరిత్రలో క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటారు. ఈ కాలంలో వివిధ రాజులు పరిపాలించారు ఉత్తర భారతదేశాన్ని రాజపుత్రులు, ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తులు పరిపాలించగా, దక్షిణ భారతదేశాన్ని చోళులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు పరిపాలించారు. మొగల్ చక్రవర్తులకు సమకాలీనంగా దక్షిణ భారతదేశంలో శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించాడు.
మధ్యయుగ ప్రధాన లక్షణం భూస్వామ్య వ్యవస్థ లేదా ఫ్యూడలిజం. భారతదేశంలో ఆర్.ఎస్. శర్మ అనే చరిత్రకారుడు తొలిసారిగా ఫ్యూడలిజం లేదా భూస్వామ్య వ్యవస్థ అనే పదాన్ని ఉపయోగించాడు. హర్బన్స్ ముఖియా దాన్ని స్వేచ్ఛా రైతాంగ ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంటే, ఇర్ఫాన్ హబీబ్ అనే చరిత్రకారుడు ‘మధ్యయుగ ఆర్థికవ్యవస్థ’ అనే పద ప్రయోగమే ఉత్తమం అని పేర్కొన్నాడు. రాజులు తమ ఉద్యోగులకు జీతాలను నగదు రూపంలో కాకుండా భూమి, జాగీర్ల రూపంలో ఇవ్వడం వల్లే క్రీ.శ. 7వ శతాబ్దంలో భూస్వామ్య వ్యవస్థ విస్తరించింది. వాస్తవానికి భూస్వామ్య వ్యవస్థకు పునాది గుప్త యుగంలోనే పడింది. భూమిని పొందిన వ్యక్తులు ఆ భూములను కౌలుకు ఇవ్వడం ద్వారా కౌలు రైతులు, బానిసలు, అర్ధబానిసలు పుట్టుకొచ్చారు.
రాజపుత్ర యుగంనాటి ఆర్థిక వ్యవస్థను తెలుసుకోవడానికి ఆల్బెరూని రచించిన కితాబ్-ఉల్-హింద్ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యుగంలోనే భూస్వామ్య ప్రభువులు వచ్చారు. వారిని సామంతులని, రాణాలని పిలిచేవారు. రాజు తన ఉద్యోగులకు ఇచ్చే భూమిని భోగ లేదా జమీ అనేవారు. వ్యవసాయం ద్వారా వచ్చే మిగులును ప్రత్యక్ష పాత్రలేని వ్యక్తులు హరించే భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించింది.
భూస్వామ్య ప్రభువుల విధానాల కారణంగా ‘కనీసపు పంటలు’ మేలని రైతులు భావించారు. అదనపు పంటలు లేకపోవడం, అంతర్గత అస్థిరత రాజ్యాల మధ్య నిరంతర పోరాటాల వల్ల వాణిజ్యం తగ్గి, నాణేల చెలామణి కూడా తగ్గిపోయింది. అరబ్ యాత్రికుల రచనల ప్రకారం రాజపుత్ర యుగంలో చైనా కంటే భారతదేశంలో పట్టణాల సంఖ్య తక్కువగా ఉంది. పశ్చిమాసియా, ఆగ్నేయాసియాలతో వ్యాపారం చేసేవారు. పర్షియన్ గల్ఫ్ లోని సిరాజ్ రేవు పట్టణం వ్యాపారానికి ఆయువుపట్టుగా ఉండేది.
భారతదేశానికి కర్పూరం, దంతం, కాగితం, వజ్రాలు, గంధపు చెక్క లాంటివి దిగుమతి అయ్యేవి. ఇక్కడి నుంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, మందులు, ఆభరణాలు ఎగుమతి అయ్యేవి. పశ్చిమ దేశాలకు సుగంధ ద్రవ్యాలు, ఆగ్నేయాసియాకు మందులు, చైనాకు ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేవారు. తూర్పు కోస్తాలో లభించే బుఖారిమ్స్ అనే వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేదని మార్కోపోలో రాశాడు. మధ్యయుగంలో అరబ్బులు నౌకా వాణిజ్యంలో ముందంజ వేశారు. అరబ్బులతో వ్యాపారం వల్ల రాష్ట్రకూట రాజ్యం ఐశ్వర్యవంతమైంది. రాష్ట్రకూటుల కాలంలో వంశపారంపర్య అధికారులను నాల్గవుండులు లేదా దేశాగ్రముక్తాలు అనేవారు. వీరి నుంచే దేశముఖు, దేశ్పాండేలు ఆవిర్భవించారు.
మహ్మదీయ దండయాత్రల వల్ల ముఖ్యంగా గజనీ మహమ్మద్ దండయాత్రతో భారత ఆర్థిక వ్యవస్థలో క్షీణ లక్షణాలు ప్రారంభమయ్యాయి. గజనీ తన దాడుల ద్వారా దేశసంపదను నాశనం చేశాడని అతడితో వచ్చిన అల్బెరూని పేర్కొన్నాడు. అల్బెరూని తన కితాబ్-ఉల్- హింద్ గ్రంథంలో నాటి ఆర్థిక అంశాలను ప్రస్తావించాడు. భూమిశిస్తు పంటలో 1/6వ వంతుగా ఉండేదని, బ్రాహ్మణులకు తప్ప మరెవ్వరికీ పన్ను మినహాయింపు లేదని రాశాడు. కానీ భూస్వామ్య ప్రభువులు రైతులను పీడించే విధానాల గురించి తన రచనల్లో ప్రస్తావించలేదు.
క్రీ.శ. 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని అయిదు రాజ్యవంశాలు పరిపాలించాయి. ఈ కాలంలో భూమిశిస్తు విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. రైతులను దోపిడీ చేసి, అపారమైన నిధులను సమీకరించడం ఢిల్లీ సుల్తానుల ఆర్థిక పాలనలో ముఖ్య లక్షణం. సుల్తానుల కాలంలో భూములను మూడు ప్రధానమైన రకాలుగా వర్గీకరించారు. అవి:
ఇక్తా భూమిపై వచ్చే ఆదాయాన్ని కులీన వర్గాలకు, అధికారులకు కేటాయించేవారు. సుల్తాన్ సొంత భూమిని ఖలీసా భూమి అనేవారు. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేది. కవులు, పండితులు, కళాకారులు, మత సంబంధ వ్యక్తులకు ఇచ్చే భూములను మదద్-ఇ-మాష్ భూములు అనేవారు. జమ అంటే ప్రతి ప్రాంతం చెల్లించే భూమి శిస్తు అంచనా. ఈ జమను సుల్తానులే తయారు చేయించేవారు.
సమకాలీన చరిత్రకారులైన ఇబన్ బటూటా, ఇసామీ, బరానీ లాంటివారు అప్పటి ఆర్థిక వ్యవస్థను గురించి వివరించారు. మహ్మబ్బీన్ తుగ్లక్ కాలంలో వచ్చిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా భారత్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు, రహదారులు, ప్రజల జీవన పరిస్థితుల గురించి వివరించారు
Indian Economy Complete study material in Telugu
దక్షిణ భారతదేశంలో చోళులు వ్యవసాయ, వాణిజ్య పరిశ్రమ రంగాల అభివృద్ధికి కృషి చేశారు. వీరు తంజావూరును రాజధానిగా చేసుకుని పాలించారు. స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరుగాంచారు. అప్పటి ధనవంతులైన భూస్వాములను మువ్వెంద వేలన్, అరయ్యార్ అని పిలిచేవారు. అనేక వర్గాలవారికి భూములను దానం చేశారు.
బ్రాహ్మణులకు దానం చేసిన భూములను బ్రహ్మదేయ, బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమిని వెల్లన్ వాగై దేవాలయాలకు ఇచ్చిన భూములను దేవమేయ / దేవాదాన / తిరునాముత్తక్కని, పాఠశాలలకు ఇచ్చిన భూమిని శాలభోగ, జైన సంస్థలకు ఇచ్చిన భూమిని పళ్లిచ్చందం అని పేర్కొనేవారు. అప్పటి గ్రామీణ జీవితం గురించి పెరియపురాణ గ్రంథం వివరిస్తోంది.
మధ్య యుగ భారత ఆర్థిక వ్యవస్థ, డౌన్లోడ్ PDF
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
మధ్యయుగ యుగంలో, ప్రజలు తమ జీవనోపాధిని కొనసాగించడానికి వివిధ వృత్తిపరమైన నైపుణ్యాలు మరియు ఇతర అభ్యాసాలను అనుసరించేవారు.
మధ్యయుగ కాలంలో ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది
ఫ్యూడలిజం, భూస్వామ్య వ్యవస్థ లేదా భూస్వామ్యత అని కూడా పిలుస్తారు
సిల్క్ రూట్ మరియు స్పైస్ రూట్ మధ్యయుగ కాలంలో రెండు ప్రధాన వాణిజ్య మార్గాలు.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…