ప్రణాళికా సంఘం భారతదేశంలోని ప్రభుత్వ సంస్థ, ఇది దేశం యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని పర్యవేక్షించడానికి స్థాపించబడింది. దేశంలోని వనరులను సమర్ధవంతంగా అందరికీ అందించడం, ఉత్పత్తిని పెంచడం మరియు సమాజ సేవలో అందరికీ పని చేసే అవకాశాలను కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు వేగంగా పెరగడానికి ప్రణాళికా సంఘం 1950లో ఏర్పాటు చేయబడింది.
Planning Commission of India PDF
ప్రణాళికబద్ధమైన కృషితోనే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఇలాంటి ప్రణాళికయుతమైన దిశగా ముందుకెళుతోంది. పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్.. ఇవన్నీ ఇందులో భాగమే.
ఒక ఆర్థికవ్యవస్థ తనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. ఒడిదొడుకులు లేకుండా అత్యధిక ఫలితాలను పొందాలంటే ప్రణాళికబద్ధమైన కృషి అవసరం. 1929-30లో ప్రారంభమైన ఆర్థికమాంద్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోయినా రష్యా మాత్రం నిలవగలిగింది. ప్రణాళికబద్ధమైన కృషి వల్లే రష్యా ఆర్థికమాంద్యం ప్రభావానికి గురికాకుండా నిలవడంతో ప్రపంచ దేశాల దృష్టి కూడా ప్రణాళికల వైపు మళ్లింది. రష్యా సాధించిన ప్రణాళికాబద్ధ కృషి, ఆచరణ భారతదేశాన్ని కూడా ప్రభావితం చేశాయి. భారతదేశంలో 1951 నుంచి ప్రణాళికాబద్ధ కృషి ప్రారంభమైంది. ఇంతవరకూ 11 పంచవర్ష ప్రణాళికలను పూర్తిచేసుకుని 12వ ప్రణాళిక కాలంలో ఉన్నాం. భారతదేశ ప్రణాళికా కృషిని పరిశీలిస్తే.. కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలు ఉన్నాయి. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధమైన కృషిని పటిష్ఠం చేసే ఉద్దేశంతో ఇటీవలే ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రణాళిక విధానం లేదా ప్రణాళికబద్ధమైన కృషిలో ముఖ్యంగా మూడు అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.
మొదటిది – ఆర్థికవ్యవస్థలో ప్రస్తుతమున్న వనరులు, అవసరాలను సమగ్రంగా లెక్క వేయడం.
రెండోది – సమగ్రంగా లెక్క వేసిన సమాచారం ఆధారంగా ఆర్థికవ్యవస్థ సామర్థ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నిర్ణీత కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
మూడోది – నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థికవ్యవస్థలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సరైన మార్గాన్ని ఎంపిక చేయడం.
APPSC/TSPSC Sure shot Selection Group
భారతదేశంలో ప్రణాళికల కోసం జరిగిన కృషిని రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి..
1. స్వాతంత్య్రానికి ముందు ప్రణాళికల కోసం జరిగిన కృషి
2. స్వాతంత్య్రానంతరం ప్రణాళికల కోసం చేసిన కృషి
స్వాతంత్ర్యానికి ముందు
మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వపరమైన ప్రణాళికబద్ధ కృషి జరగలేదు. అయితే కొందరు ప్రముఖులు మన దేశ సత్వర అభివృద్ధికి ప్రణాళికల అవసరాన్ని గుర్తించారు. అంతేకాకుండా మన ఆర్థికవ్యవస్థలో అమలు చేయాల్సిన ప్రణాళికల స్వరూప స్వభావాల గురించి తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. అలాంటి ప్రయత్నం చేసినవారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉన్నారు. 1934లో ఆయన రచించిన ‘ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ – భారతదేశం’ (Planned Economy for India) అనే గ్రంథంలో భారతదేశ ఆర్థికాభివృద్ధికి పది సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించారు.
భారత జాతీయ కాంగ్రెస్ 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది. అలాగే ప్రణాళికలకు సంబంధించిన అనేక విషయాలను పరిశీలించడానికి కొన్ని ఉపసంఘాలను కూడా నియమించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ కమిటీ తన నివేదికను తయారు చేయడంలో కొంత జాప్యం జరిగింది. చివరకు 1948లో నివేదికను సమర్పించింది.
స్వాతంత్య్రానంతరం
1950 జనవరిలో లోకానాయక్ జయప్రకాష్ నారాయణ్ ‘సర్వోదయ ప్రణాళిక’ను రూపొందించారు. అయితే ఈ ప్రణాళికలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది.
స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఆవశ్యకతను గుర్తించి 1950, మార్చి 15న కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షుడు. దీని వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఉపాధ్యక్షుడు. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ కాగా, మొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా.
ప్రణాళిక సంఘం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సలహా సంస్థ మాత్రమే. రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. దేశంలో లభించే వనరులను అంచనా వేసి వాటిని సమర్థంగా, సంతులనంగా ఉపయోగించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే బాధ్యతను ప్రణాళిక సంఘానికి అప్పగించారు. ప్రణాళిక సంఘం ద్వారా ఇంతవరకు 11 పంచవర్ష, 6 వార్షిక ప్రణాళికలు పూర్తయ్యాయి. అనంతరం 12వ ప్రణాళిక (2012-17) అమల్లోకి రాగా.. 2015, జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం (ఎన్డీఏ) ‘నీతి ఆయోగ్’ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది.
జాతీయ అభివృద్ధి మండలి (నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్-ఎస్ఓసీ)
కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా 1952, ఆగస్టు 6న ‘జాతీయ అభివృద్ధి మండలి’ ఏర్పాటైంది.
ప్రణాళికా సంఘం, ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టింది. ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ లేదా చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది రాజ్యాంగేతర లేదా రాజ్యాంగేతర సంస్థ ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం ద్వారా సృష్టించబడలేదు మరియు పార్లమెంటు చట్టం ద్వారా సృష్టించబడనందున ఇది చట్టబద్ధత లేని సంస్థ.
K.C నియోగి అధ్యక్షతన 1946లో ఏర్పాటైన అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు సిఫార్సులపై భారత ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక నిర్ణయం ద్వారా 1950లో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయబడింది.
NITI AAYOG – National Institution for Transforming India దీనిని తెలుగులో భారత్ పరివర్తనకు జాతీయ సంస్థ అంటారు. హిందీ భాష ప్రకారం నీతి అనగా విధానం, ఆయోగ్ అనగా కమిటీ దీనిని బట్టి నీతి ఆయోగ్ అనగా విధాన కమిటీ అని అర్థం.
64 ఏళ్లపాటు దేశానికి సేవలందించి కేంద్రంలో ‘సూపర్ కేబినెట్’గా పేరుగాంచిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ (జాతీయ పరివర్తన సంస్థ)ను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2015, జనవరి 1న ఏర్పాటు చేసింది. దీంతో ప్రణాళిక సంఘం రద్దయిపోయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన ఆర్థిక పరిస్థితులు, కొత్త సాంకేతికతలు, మేధోసంపద వినియోగం, పాలనలో పారదర్శకత లాంటి అంశాల ప్రాతిపదికన నీతి ఆయోగ్ ఏర్పడింది.
విధులు :
ప్రాంతీయ మండళ్లు (రీజినల్ కౌన్సిల్స్)
ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక సమస్యలను చర్చించడానికి ప్రాంతీయ మండళ్లను ఒక నిర్ణీత కాలానికి ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు వీటిలో సభ్యులు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు లేదా అతడు నామినేట్ చేసిన వ్యక్తులు ఈ మండళ్లకు అధ్యక్షత వహిస్తారు.
నీతి ఆయోగ్ కీలక విధాన నిర్ణయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను అందించే ‘మేధోకూటమి’గా వ్యవహరిస్తుంది. నిధులను కేటాయించే అధికారం ఆర్థికశాఖకు ఉంటుంది. ప్రణాళిక సంఘం వివిధ మంత్రిత్వ శాఖలకు, వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో సూపర్ కేబినెట్గా వ్యవహరించిందనే అభిప్రాయం ఉంది. ప్రణాళిక సంఘం తరహాలో కాకుండా జాతీయ పరివర్తన సంస్థ (నీతి ఆయోగ్)లో నాలుగు డివిజన్లు ఉంటాయి. అవి
1. ప్లాన్ ఎవాల్యుయేషన్ ఆఫీస్
2. అంతర్రాష్ట్ర మండలి
3. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
4. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
నీతి ఆయోగ్ కి సంబంధించిన పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటూ అభివృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్రపోషిస్తారు. జాతీయ అభివృద్ధి మండలిలో మాత్రం వీరి పాత్ర పరిమితం.
వివిధ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికలు లక్ష్యసాధనలో ఆశించిన ఫలితాలు అందిస్తాయి. కానీ ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వానికే ప్రణాళిక రచనలో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దేశం అభివృద్ధి వైపు పయనించాలంటే రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడం ముఖ్యమనే అంశం నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం. భారతదేశానికి అధికారాలు, ప్రణాళిక వికేంద్రీకరణ అవసరమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు.
‘సహకార సమాఖ్య తత్వం’ నీతి ఆయోగ్లో ముఖ్యమైన అంశం. విధాన, ప్రణాళిక ప్రక్రియ పైస్థాయి నుంచి కింది స్థాయికి (టాప్ టూ బాటం) కాకుండా, కింది స్థాయి నుంచి పై స్థాయికి (బాటం టూ టాప్) మారాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దృక్పథం ప్రణాళిక సంఘంలో పూర్తిగా లోపించింది. పాత వ్యవస్థలో కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలు పాటించాలనే విధానం కనిపిస్తుంది.
అధ్యక్షుడు: ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ)
ఉపాధ్యకుడు: ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియ (తొలి ఉపాధ్యక్షుడు) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో): కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తిని ప్రధానమంత్రి సీఈవోగా నియమిస్తారు.
కమిషన్ ఎక్స్ అఫిషియో సభ్యులలో ఆర్థిక మంత్రి, వ్యవసాయ మంత్రి, హోం మంత్రి, ఆరోగ్య మంత్రి, రసాయనాలు, ఎరువుల మంత్రి, సమాచార సాంకేతిక మంత్రి, న్యాయ మంత్రి, మానవ వనరుల అభివృద్ధి మంత్రి, ప్రణాళికా రాష్ట్ర మంత్రి ఉన్నారు.
కమిషన్ దాని వివిధ విభాగాల ద్వారా పనిచేసింది, వాటిలో రెండు రకాలు ఉన్నాయి:
కమిషన్లోని నిపుణుల్లో ఎక్కువమంది ఆర్థికవేత్తలు, కమిషన్ను భారతీయ ఆర్థిక సేవ అతిపెద్ద యజమానిగా చేశారు.
పాలకమండలి సభ్యులు: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు.
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
The Planning Commission was set up 15 March 1950 in accordance with article 39 of the constitution.
Our Prime Minister, Narendra Modi is the Planning Commission chairman.
Planning Commission is replaced by NITI Aayog, which is neither a constitutional body nor a statutory body. It is an extra-constitutional body, as the Planning Commission was set up in 1950 by an executive decision of Government of India on the recommendations of Advisory Planning Board.
The goal of establishing NITI Aayog was to have a body that could provide proper and critical strategies and directions for the development process. It is considered to be an advisory institution capable of providing policy advice to the state and federal governments.
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…