AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of July 4th week.
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
1. హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ‘ఆజాదీకీ రైల్ గాడీ’
పలువురు స్వాతంత్య్ర సమరయోధులు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నాటి పోరాట సన్నివేశాలను వివరిస్తూ అందరిలో జాతీయ భావాన్ని నింపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా ద.మ.రైల్వే ఏర్పాటు చేసిన ‘ఆజాదీకీ రైల్ గాడీ, ఔర్ స్టేషన్’ కార్యక్రమంలో సమరయోధులు కె.చంద్రప్రకాశ్రావు, పి.మోహన్రావు, జి.గాలయ్యలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంతో మమేకమై నేటికీ రైల్వేలో సేవలందిస్తున్న ఆనాటి ఏపీ ఎక్స్ప్రెస్, ప్రస్తుత తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలును హైదరాబాద్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఆజాదీకీ రైల్ గాడీగా పేరొందిన తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (నెం.12723) రైలును ఈ సందర్భంగా అందంగా తీర్చిదిద్దారు.
2. తెలంగాణలో మరో 13 మండలాలు ఏర్పాటు
తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక ప్రజావసరాల మేరకు మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా, కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.
జిల్లా కొత్త మండలాలు
నల్గొండ గట్టుప్పల్
నారాయణపేట గుండుమల్, కొత్తపల్లె
వికారాబాద్ దుడ్యాల్
మహబూబ్నగర్ కౌకుంట్ల
నిజామాబాద్ ఆలూర్, డొంకేశ్వర్, సాలూర
మహబూబాబాద్ సీరోల్
సంగారెడ్డి నిజాంపేట్
కామారెడ్డి డోంగ్లి
జగిత్యాల ఎండపల్లి, భీమారం
3. తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా ఆరుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపింది. ఇందులో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజ శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఈ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతో పాటు హిమాచల్ప్రదేశ్ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్కతా (9), పంజాబ్, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. జులై 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత అయిదు రోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.
4. వేసెక్టమీలో దేశంలోనే రాష్ట్రానికి రెండో స్థానం
పురుషులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (వేసెక్టమీ) చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఛత్తీస్గఢ్ మొదటిస్థానంలో ఉంది. దీంతోపాటు వ్యక్తిగత జాబితాలో అత్యధిక సర్జరీలు చేసినందుకు హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ యాకూబ్పాషాకు కేంద్రం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 3,600 వేసెక్టమీ సర్జరీలు జరగగా, డాక్టర్ యాకూబ్పాషా తన 22 ఏళ్ల సర్వీసులో 40 వేలకు పైగా సర్జరీలు నిర్వహించారు.
తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ‘నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ సమ్మిట్–2022’లో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకున్నారు.
5. తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్లు.. తమిళనాడు టాప్
‘స్టేట్ ఫైనాన్స్లు 2021–22 బడ్జెట్ల అధ్యయనం’పేరుతో రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో బీజేపీ ఎంపీ కిషన్కపూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు.
తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సాధారణ నికర రుణ సీలింగ్(ఎన్బీసీ)ను కేంద్రం నిర్ణయిస్తుందని, క్రితం సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలను తదుపరి సంవత్సరంలోని రుణ పరిమితులలో సర్దుబాటు చేస్తారని పేర్కొన్నారు.
1. ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా సంతోషరావు నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కె.సంతోషరావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం) సీఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2. ఫ్యాప్సి అధ్యక్షుడిగా కరుణేంద్ర జాస్తి ఎన్నికయ్యారు
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) అధ్యక్షుడిగా 2022 – 23 ఏడాదికిగాను కరుణేంద్ర ఎస్. జాస్తి ఎన్నికయ్యారు. 3వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్) ఇందుకు వేదికైంది. స్టైప్యాక్ వ్యవస్థాపకులైన కరుణేంద్ర విశాఖపట్నంలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో బీఈ (మెకానికల్) చదివారు. కే లాజిస్టిక్స్లో భాగస్వామిగానూ ఉన్నారు. మాక్రో మీడియా డిజిటల్ ఇమేజింగ్తోనూ ఈయనకు అనుబంధం ఉంది. 2019 – 20లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి అధ్యక్షుడిగా సేవలందించారు.
3. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్లోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. కొవ్వాడతోపాటు మహారాష్ట్రలోని జైత్పూర్, గుజరాత్లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమ బెంగాల్లోని హరిపూర్, మధ్యప్రదేశ్లోని భీమ్పూర్లలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు.
రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాదన కోసం కర్ణాటక, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో 10 అణు రియాక్టర్లలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు. సమూహం పద్ధతిలో నెలకొల్పే ఈ పది రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
4. ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలు చేయాలని సీఎం ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆగస్టు 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్ రన్ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ విధానంపై ఆశా వర్కర్, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీ నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల వారీగా మాస్టర్ ట్రైనర్లను గుర్తించి, వారికి బుధవారం విజయవాడలో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం అంటే?
5. అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ నంబర్ 14400
ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అవినీతిపై ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ నంబర్ 14400తో పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ పోస్టర్ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నంబర్ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు.
Also check : AP and Telangana state July Weekly Current affairs part 3
********************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…