Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. ముసునూరి రాజ్య స్థాపకుడు?
Q2. ఉండవల్లి గుహాలయాలను నిర్మించింది ఎవరు?
Q3. క్రీ.శ 350 నాటి ‘అత్తివర్మ గోరంట్ల’ తామ్ర శాసనం కన్నా ప్రాచీనమైన శాసనం ____ దగ్గర ఉన్నదని ఇటీవల పరిశోధకులంటున్నారు?
Q4. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు సంతతివారు అని ఈ కింది చరిత్రకారులు పేర్కొన్నారు?
Q5. అద్దంకి గంగాధర కవి, మరింగంటి సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి తదితర తెలుగు కవులను పోషించిన కుతుబ్షాహీ పాలకుడు ఎవరు?
Q6. మహమ్మద్ కులీ కుతుబ్షా రాజ్యాధికారం చేపట్టడానికి సహాయపడినవారు?
Q7. చరిత్రకారులు ‘పాశ్చాత్యీకరణ’ ప్రారంభానికి సాక్షీభూతంగా ఎవరిని పేర్కొంటారు?
Q8. చందూలాల్ తరువాత నిజాం యొక్క ప్రధాని ఎవరు?
Q9. ‘ది రెబెలియన్ ఇన్ ఇండియా‘ అనే పుస్తకం రచించినది ఎవరు
Q10. ఉత్తర భారతదేశంలో ముస్లింలలో సాంఘిక సంస్కరణను తీసుకురావటానికి ప్రారంభమైన ఉద్యమం?
S1. Ans (B)
ప్రోలయ నాయకుడు (క్రీ.శ. 1325-1330) ముసునూరి నాయక రాజుల్లో మొదటివాడు. ఇతడు రాజమహేంద్ర వరం నుంచి ముస్లింలను పారద్రోలి గోదావరి–కృష్ణ నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. ‘రేఖపల్లి‘ కేంద్రంగా పరిపాలించాడు. ముస్లింలను ఎదుర్కోడానికి గెరిల్లా దాడులు నిర్వహించాడు. బ్రాహ్మ ణులకు అగ్రహారాలను కేటాయిం చి, వైదిక మత ధర్మ పునరుద్ధరణకు పాటుపడ్డాడు.
S2. ANS (a)
Sol: ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన ‘ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం‘ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం‘ ఉంది.
S3. ANS (C)
Sol: క్రీ.శ. 370-400 నాటి గోవిందరాజ విహార (చైతన్యపురి) శాసనం తెలంగాణాలో లభిస్తున్న మొదటి ప్రాకృతశాసనం అయితే ఈ శాసనం కన్నా, క్రీ.శ 350 నాటి ‘అత్తివర్మ గోరంట్ల తామ్ర శాసనం కన్నా ప్రాచీనమైన శాసనం నల్లగొండ జిల్లా ఏలేశ్వరం దగ్గర ఉన్నదని ఇటీవల పరిశోధకులంటున్నారు
S4. ANS.(c)
Sol: ఇక్ష్వాకులు దాదాపు వందేళ్లు పాలించారు. వీరు ఐదుగురు రాజుల శాసనాల ద్వారా తెలుస్తుండగా, ఏడుగురు రాజులని పురాణాలు తెలుపుతున్నాయి. జన్మస్థలంపై ఎన్నో వాదాలు ఉండగా చరిత్రకారులు రాప్సన్, బూలర్ ప్రకారం: ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశాన్ని పాలించిన ఇక్ష్వాకు సంతతివారు.
S5. Ans: (B)
అద్దంకి గంగాధర కవి, మరింగంటి సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి, పొన్నెగంటి తెలగనార్యుడు తదితర తెలుగు కవులను పోషించిన కుతుబ్షాహీ పాలకుడు ఇబ్రహీం కుతుబ్షా. కవి పండిత పోషకుడు. ఆంధ్ర కవులను ఆదరాభిమానంతో పోషించినందువల్ల ‘మల్కిభరాముడు‘గా పేరుగాంచాడు
S6. Ans: (C)
ఇబ్రహీం మరణానంతరం మహమ్మద్ కులీ కుతుబ్షా (1580-1612) అతి పిన్న వయసులో(14వ ఏట) రాజ్యానికొచ్చినాడు. ఇబ్రహీం ఆరుగురు మగసంతానంలో ఇతడు మూడోవాడు, ఇబ్రహీం ప్రేమించి పెళ్లి చేసుకున్న భాగీరథి అనే తెలుగు స్త్రీకి ఇతడు జన్మించినాడు. ఇంతమంది సంతానంలో కులీ అధికారంలోకి రావడానికి దక్కన్ ముస్లింల సహకారంతో అశ్వారావు చేసిన కృషి కారణం.
Q7. Ans: (D)
మహమ్మద్ కుతుబ్షా గోల్కొండ రాజ్యంలో అస్థిరత నెలకొనకుండా చేసుకున్నాడు. చచ్చివారు ఇంగ్లీషు వారు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాల్ని నెలకొల్పుకొని పాశ్చాత్యీకరణ ప్రారంభానికి సాక్షీ భూతమితడు
S8. Ans: (A)
1843లో చందూలాల్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సిరాజ్ ఉల్ ముల్క్ హైదరాబాద్ కు ప్రధాని అయ్యాడు.
Q9. Ans: (D)
బ్రూస్ నార్తజ్ తన ‘ది రెబెలియన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో బీరార్ ఒప్పదం గురించి ‘న్యాయ దేవత చెవుల్లో దూది పెట్టి ఆమెను ఆంగ్లేయులు చెవిటిదాన్ని , గుడ్డిదాన్ని చేశారు‘ అని పేర్కొన్నాడు. ఈ ఒప్పందాన్ని అవమానకరంగా భావించిన సిరాజ్ ఉల్ ముల్క్ అస్వస్థతకు గురై మరణించాడు.
S10. Ans : (C)
ఉత్తర భారతదేశంలో ముస్లింలలో సాంఘిక సంస్కరణను తీసుకురావటానికి వారి రాజకీయ ప్రయోజనాలు సాధించడానికి ప్రారంభమైన గొప్ప ఉద్యమం వహాబీ ఉద్యమం
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…
తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…
TSPSC Group 2 Best Books Best Books for TSPSC Group 2: TSPSC officials released TSPSC…
TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…