Telangana State Current Affairs In Telugu October 2022 | తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022 తెలుగులో 

Telangana State Current affairs In Telugu October 2022, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022 తెలుగులో

Telangana state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Telangana Government releases notification for Various posts through TSPSC like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations.To complement your preparation, we are providing you the Telangana State Current affairs In Telugu October 2022 .

తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను తెలుగులో అందిస్తున్నాము.

APPSC/TSPSC Sure shot Selection Group

Telangana State Current affairs In Telugu, తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. హైదరాబాద్‌లో House of France

House of France

తెలంగాణ, ఫ్రాన్స్‌ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘హౌస్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు.

2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్‌ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్‌ వర్గాలకు ఫ్రాన్స్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్‌ బిజినెస్‌ మిషన్‌  బృందం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్‌ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్‌ బృందం ప్రతినిధులు పాల్‌ హెర్మెలిన్, గెరార్డ్‌ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

2. తెలంగాణలో schneider రెండో ప్లాంట్‌ ఏర్పాటు

Schneider in Telangana

విద్యుత్‌ పరికరాల తయారీ, ఆటోమేషన్‌ రంగంలో ఉన్న ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ తెలంగాణలో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్‌ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్‌కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్‌ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ సెప్టెంబర్ 30న ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్‌ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్‌లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్‌ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది.

వర్చువల్ గా శంకుస్థాపన

భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఎమాన్యుయల్‌ లెనిన్‌తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్‌ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్‌లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్‌ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు.

3. తెలంగాణ గిరిజనులకు 10% రిజర్వేషన్ కోటా, ఉత్తర్వులు జారీ

Telangana Reservation

తెలంగాణ గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

4. ‘గొల్లభామ’కు UNESCO గుర్తింపు

UNESCO recognition of ‘Grasshopper’

చేనేత కార్మికుల వృత్తి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే సిద్దిపేట బ్రాండ్‌ అంబాసిడర్‌ గొల్లభామ చీరకు యునెస్కో గుర్తింపు దక్కడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

పదేళ్ల క్రితమే భౌగోళిక (జియోగ్రాఫికల్‌) గుర్తింపు లభించగా తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌ వేదికగా నేతన్నలను అభినందించారు. చీర ప్రత్యేకత, చరిత్ర గూర్చి వివరిస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలను ట్యాగ్‌ చేశారు. ఇటీవల భారతీయ సంప్రదాయక వస్త్రాల సంరక్షణపై యునెస్కో విడుదల చేసిన నివేదికలో సిద్దిపేట గొల్లభామ చీరకు చోటు లభించింది. తలమీద చల్ల కుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి(చిన్న మట్టి పాత్ర) పట్టుకొని, కాళ్లకు గజ్జెలు, కొప్పులో పువ్వులతో నడియాడే గొల్లభామ ప్రతిమలతో ఈ చీరను రూపొందిస్తారు.

5. టీఆర్‌ఎస్‌ పేరు ఇక బీఆర్‌ఎస్‌,పేరు మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం

The name of TRS is now BRS

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన అక్టోబర్ 5న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ జనరల్‌ బాడీ సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన జనరల్‌ బాడీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానం అమోదించింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశాం..’ అంటూ కేసీఆర్‌ చేసిన ప్రకటనకు జనరల్‌ బాడీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఆమోదం తెలిపారు. కాగా పార్టీ నిర్ణయాన్ని తెలియచేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్‌ లేఖ రాశారు. ‘టీఆర్‌ఎస్‌ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ రాజ్యాంగంలో చేసిన సవరణలకు జనరల్‌ బాడీ సమావేశం ఆమోదం తెలిపింది. వీటికి సంబంధించిన తీర్మానాలు, పార్టీ రాజ్యాంగ సవరణ అంశాలను సమర్పిస్తున్నాం..’ అని లేఖలో పేర్కొన్నారు.

 

6. సిద్దిపేటలో ప్రభుత్వ వృద్ధాశ్రమం

old age home

వృద్ధాప్యంలో తోడూనీడా లేకుండా ఒక భరోసా కోసం ఎదురుచూసే వారికి, అభాగ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సుమారు కోటి రూపాయల నిధులతో రాష్ట్రంలో ఒక మోడల్‌గా ఈ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సిద్దిపేట పరిధిలోని మిట్టపల్లి గ్రామ శివార్లలో సుమారు ఎకరం స్థలంలో దీన్ని నిర్మించేందుకు స్థల పరిశీలన పూర్తి చేశారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.

7. హైదరాబాద్‌కి 10 విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌లు

Electric Double Deckers

ముంబై తరహాలో హైదరాబాద్‌ రోడ్లపైనా త్వరలోనే ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. నగరంలోని పలు రూట్లలో 10 విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

అయితే ఒక్కో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఖరీదు రూ. 2.25 కోట్ల వరకు ఉండటం, అంత ఖర్చును భరించే ఆర్థిక పరిస్థితి సంస్థకు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన వాటిని ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం 4–5 రోజుల్లో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. క్రాస్‌ కాస్ట్‌ విధానంలో ఈ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ముందుకు రావాలని టెండర్‌ నోటిఫికేషన్‌లో కోరనుంది. అద్దె పద్ధతిలో బస్సులు నిర్వహించే సంస్థతో టెండర్‌ దక్కించుకున్న సంస్థ ఒప్పందం కుదుర్చుకొని ఆర్టీసీకి బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రతి కిలోమీటర్‌ చొప్పున నిర్ధారిత అద్దెను ఆర్టీసీ ఆ సంస్థకు చెల్లించనుంది.

8. హైదరాబాద్‌ నగరంలో ఈ-మొబిలిటీ వారోత్సవాలు

E-Mobility week

దేశంలోనే తొలిసారిగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 10,11 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ-రేస్‌(ఫార్ములా ఈ-ప్రిక్స్‌)కు ప్రచారం కల్పించేందుకు 2023 ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్‌ఈ-మొబిలిటీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. విద్యుత్‌తో నడిచే సింగిల్‌ సీటర్‌ కార్ల పోటీకి సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 6న హైదరాబాద్‌ ఈవీ సమిట్, ఫిబ్రవరి 7న ర్యాలీ, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ ఈ-మోటార్‌ షోను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

9. నందిపేటలో పురాతన రాతి చిత్రాల గుర్తింపు

Ancient rock paintings

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట్‌ మండలం నందిపేట సమీపంలోని గజ్జెలగుట్టపై తామ్రయుగం(క్రీ.పూ.4 వేల ఏళ్లు) నాటి రెండు రాతి చిత్రాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. సొరంగం తరహా మార్గం నుంచి గుహలోకి చేతుల మీద పాకుతూ వెళ్లాలి. చివరి గుహలో 10-12 మంది నివసించేంత ఖాళీ స్థలం ఉంది. ఆ గుహ ఆదిమానవుల ఆవాసమై ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

10. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో రోష్‌ 

Rosh in Hyderabad

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ ఔషధ, రోగ నిర్ధారణ యంత్రాల తయారీ సంస్థ రోష్‌ తెలంగాణలో ప్రపంచ స్థాయి అత్యాధునిక విశ్లేషణ, సాంకేతిక ప్రతిభా కేంద్రాన్ని రూ.100 కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ద్వారా వంద మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రోష్‌ ఎండీ, సీఈవో సింప్సన్‌ ఇమ్మాన్యుయేల్‌ తమ ప్రతినిధి బృందంతో హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు. ఈ కొత్త కేంద్రం మెషిన్‌ లెర్నింగ్, కృత్రిమ మేధల సాయంతో డేటా విశ్లేషణలు చేస్తుందని, రోగులకు ఆధునిక సేవలందించడంతో పాటు మెరుగైన ఫలితాలను అందించేందుకు ఉపయోగపడుతుంది.

11. ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ కీలకం

Telangana is key to global health care

జీవశాస్త్రాల రంగంలో 8.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని తెలంగాణ 2030 కంటే ముందుగానే చేరుకుంటుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆయన జీనోమ్‌ వ్యాలీలో పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్‌ఎక్స్‌ ప్రొఫెల్లంట్‌ రూ.900 కోట్ల పెట్టుబడితో 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధనశాలను, విమ్టాల్యాబ్‌ రూ.70 కోట్లతో నిర్మించిన ప్రయోగశాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ టీఎస్‌ఐఐసీ, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ నిర్మిస్తున్న బయోహబ్, జీవీ1 ల్యాబ్‌లకు ఆయన శంకుస్థాపన చేశారు. జీవీపీఆర్‌ సంస్థ రూ.40 కోట్లతో 28 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన పరిశోధన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన యాపాన్‌ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు.

12. ఇంధన సంరక్షణపై ఆస్కీతో రెడ్కో ఒప్పందం

REDCO AGREEMENT WITH ASKIE ON ENERGY CONSERVATION

ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ‘అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా’ (ఆస్కీ)తో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) అవగాహనా ఒప్పందం చేసుకుంది. రాబోయే అయిదేళ్ల పాటు రెండు సంస్థలూ ఇంధన సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆస్కీ తెలిపింది. ఇంధన సంరక్షణ చట్టం – 2001ని తెలంగాణలో పటిష్ఠంగా అమలు చేయడానికి సలహాలు, సూచనలను ఆస్కీ ఇవ్వనుంది.

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Pandaga Kalyani

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

45 mins ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

3 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

4 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

5 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

5 hours ago