AP and Telangana States March Weekly Current Affairs | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మార్చి వారాంతపు కరెంట్ అఫైర్స్

AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the February Current affairs of AP and Telangana State Weekly Current Affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Weekly Current Affairs

1. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సామాజిక ఆర్థిక సర్వే 2022-23 నివేదికను విడుదల చేశారు. 

AP Socio Economic Survey

ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయంలో 13.98% వృద్ధి నమోదైందని 2022 – 23 సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.26,931 కోట్లు పెరిగిందని వెల్లడించింది. దేశ తలసరి ఆదాయంలో వృద్ధి కంటే ఇది అధికమని తేల్చింది. 2022 – 23 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.13.17 లక్షల కోట్లకు చేరిందని, 16.22% వృద్ధి నమోదైందని పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సచివాలయంలో సామాజిక ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేశారు.
అందులోని ప్రధానాంశాలు..

  •  రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021 – 22లో రూ.11,33,837 కోట్లు ఉండగా 2022 – 23లో రూ.13,17,728 కోట్లుగా అంచనా వేశారు.
  • నవరత్నాల అమల్లో భాగంగా నగదు బదిలీ ద్వారా మొత్తం రూ.1.97 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు ఆర్థిక సర్వే నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. విద్యా రంగంలో మన బడి ‘నాడు – నేడు’ పథకం అమలు ద్వారా మూడేళ్లలో 57,189 పాఠశాలలు, 3,280 విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రూ.16,022 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
  •  రైతు భరోసాకు రూ.27,063 కోట్లు, ఉచిత పంటల బీమాకు రూ.6,872 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణాలకు రూ.1,834 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీ కింద రూ.2,747 కోట్లు, వ్యవసాయ విద్యుత్తు రాయితీకి రూ.27,800 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
  •  పెట్టుబడుల సదస్సులో రూ.13.42 లక్షల కోట్లకు 378 ఒప్పందాలు చేసుకోవడం ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగంలో రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల యూనిట్ల ఏర్పాటు ద్వారా 13.63 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు వివరించింది. రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 69 భారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

2. సీఐఐ ఏపీ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా లక్ష్మీప్రసాద్‌ నియమితులయ్యారు. 

Lakshmi Prasad

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆంధ్రప్రదేశ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌ నియమితులయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా వైజాగ్‌ హాస్పిటల్స్, క్యాన్సర్‌ రీసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.మురళీకృష్ణ వ్యవహరిస్తారు. 2023 – 24 సంవత్సరానికి గాను వీరిద్దరూ ఈ పదవుల్లో కొనసాగనున్నారు. సుజయ్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ ఎం.లక్ష్మీప్రసాద్‌ ఈ పదవితో పాటు వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

3. సావిత్రి, నాగిరెడ్డికి ఎన్టీఆర్‌ పురస్కారాలు లభించాయి 

Awards

నాన్నే (ఎన్టీఆర్‌) తనకు స్ఫూర్తి అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.  మహానటి సావిత్రి, విజయా ప్రొడక్షన్స్‌ అధినేత బి.నాగిరెడ్డికి ప్రకటించిన ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయచాముండేశ్వరికి, విశ్వనాథరెడ్డిలకు బాలకృష్ణ అందజేశారు.

4. ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు.. నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు లభించింది 

Oscar award

భారతీయ సినీ చరిత్రలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 95వ ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ఆస్కార్‌ గెలిచింది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్‌ రచించిన నాటు నాటు.. పాట అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు.

5. అప్పుల్లో ఆంధ్రులే ఎక్కువ గా ఉన్నారని 78వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది

Debt

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడినవారిలో ప్రతి లక్ష మందిలో 46,330 మంది సంస్థాగతంగానో, వ్యక్తుల ద్వారానో అప్పు తీసుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన 78వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే 2020 జనవరి నుంచి 2021 ఆగస్టు 15 వరకు చేశారు. దేశవ్యాప్తంగా 8,469 గ్రామీణ, 5,797 పట్టణ ప్రాంతాల్లోని 2,76,409 ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. ఈ నివేదికలో తేలిన అంశాల ప్రకారం మరే రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత భారీ సంఖ్యలో ప్రజలు అప్పుల్లో లేరు. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 39,358 మంది ఏదోఒక రూపంలో అప్పు చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో 17% మంది ఎక్కువగా అప్పుల్లో కూరుకుపోయారు. జాతీయ స్థాయి సగటు (15,809 మంది)తో పోలిస్తే ఏపీలో 193% మంది, తెలంగాణలో 148% మంది అధికంగా అప్పుల్లో ఉన్నారు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల తరవాత స్థానంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలు నిలిచాయి.

6. గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్‌-1 స్థానం లో నిలిచింది 

Eggs

గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం గుడ్లలో ఏపీ నుంచి 20.41%, తెలంగాణ నుంచి 12.86% వస్తున్నట్లు కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల విడుదల చేసిన ‘పశుసంవర్థక ప్రాథమిక గణాంకాలు – 2022’ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం 2021 – 22లో దేశంలో పాల ఉత్పత్తి 221.06 మిలియన్‌ టన్నులకు చేరింది. 5.29% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ విషయంలో రాజస్థాన్‌ (15.05%), ఉత్తర్‌ప్రదేశ్‌ (14.93%), మధ్యప్రదేశ్‌ (8.06%), గుజరాత్‌ (7.56%), ఆంధ్రప్రదేశ్‌ (6.97%) తొలి 5 స్థానాలను ఆక్రమించాయి.  గుడ్ల ఉత్పత్తి 6.19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 2021 – 22లో 129.60 బిలియన్ల గుడ్లు దేశంలో ఉత్పత్తి అయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ (20.41%), తమిళనాడు (16.08%), తెలంగాణ (12.86%), పశ్చిమబెంగాల్‌ (8.84%), కర్ణాటక (6.38%) మొదటి 5 స్థానాల్లో నిలిచాయి.

7. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బడ్జెట్ 2023-24 ను శాసన సభలో ప్రవేశ పెట్టారు 

AP Budget 2023-24

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం శాసనసభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,79,279 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తం బడ్జెట్‌లో ప్రత్యక్ష ప్రయోజన పథకాలకు రూ.54,228 కోట్లు కేటాయించారు, ఇందులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక (రూ. 21,435 కోట్లు), వైఎస్ఆర్ రైతు భరోసా (రూ. 4,020 కోట్లు), జగనన్న విద్యా దేవేణ (రూ. 2,842 కోట్లు) ఉన్నాయి. , మరియు జగనన్న వసతి దేవేనా (దీనికి రూ. 2,200 కోట్లు లభిస్తాయి). ఇతర ప్రధాన DBT కేటాయింపులు వైఎస్ఆర్ ఆసరా (రూ. 6,700 కోట్లు), వైఎస్ఆర్ చేయూత (రూ. 5,000 కోట్లు) మరియు అమ్మ ఒడి (రూ. 6,500 కోట్లు).

 

Telangana State Weekly Current Affairs

1. బోయింగ్, జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ ప్రయాణికుల విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే ఒప్పందం కుదుర్చుకున్నారు 

Agreement

ప్రయాణికుల విమానాలను సరకు రవాణా విమానాలుగా మార్చే సదుపాయం హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. బోయింగ్‌ కన్వర్టెడ్‌ ఫ్రైటర్‌ (బీసీఎఫ్‌) అనే ఈ సదుపాయాన్ని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌తో కలిసి బోయింగ్‌ నెలకొల్పుతుంది. ఏడాదిన్నర వ్యవధిలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇటువంటి సదుపాయం భారత్‌లో అందుబాటులోకి రానుండటం ఇదే ప్రథమం. దీనివల్ల భారతదేశంలో అంతర్గతంగా, అంతర్జాతీయంగా సరకు రవాణా సదుపాయాలు గణనీయంగా పెరుగుతాయి.

2. తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు కేంద్ర పురస్కారాలు లభించాయి 

telangana

తెలంగాణ మరో రెండు ప్రతిష్ఠాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. దేశంలో వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్‌) ప్లస్‌ రాష్ట్రంగా ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ఫలితాల్లో రాష్ట్రం ఈ ఘనత సాధించింది.
ఓడీఎఫ్‌ ప్లస్‌ అంటే.. మరుగుదొడ్లను నిర్మించుకుంటే ఓడీఎఫ్‌గా పరిగణిస్తారు. అదనంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుల్లో తడి పొడిగా వేరు చేయడం, ఇంకుడు గుంతలు నిర్మించడం ద్వారా రోడ్లపై నీళ్లు నిలవకుండా చేయడం వంటి కార్యకలాపాలు చేపడితే దానిని ఓడీఎఫ్‌ ప్లస్‌గా గుర్తిస్తారు. ఇటీవల ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాల పురోగతి వివరాలను నమోదు చేయడానికి కేంద్రం అవకాశమిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ అధికారులు గ్రామాల్లో ఉన్న వసతులు, మౌలిక సదుపాయాల వివరాలను నమోదు చేశారు. వీటి ఆధారంగా తెలంగాణ ప్రగతిని కేంద్రం గుర్తించి, పురస్కారాలను ప్రకటించింది.

3. భారత్, తైవాన్‌ కలిస్తే ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేయవచ్చని మంత్రి కేటీఆర్‌ తెలిపారు 

KTR

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ రంగాల్లో అగ్రగామిగా ఉన్న భారత్, తైవాన్‌ దేశాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌ యంగ్‌ లియూతో కలిసి దేశంలోనే తొలి ప్రొటోటైపింగ్‌ కేంద్రం టి-వర్క్స్‌ను రాయదుర్గంలో ప్రారంభించారు. గ్రామీణ ఆవిష్కరణకర్తల భాగస్వామ్యంతో టీ హబ్‌ ఇప్పటికే వెంటిలేటర్, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ పరికరాలను రూపొందించిందని, ప్రపంచస్థాయి వసతులతో నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ జరుగుతోందని వెల్లడించారు.

4. సీఐఐ – తెలంగాణ ఛైర్మన్‌గా సి.శేఖర్‌ రెడ్డి ఎంపికయ్యారు

Shekar and Prasad

సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య), తెలంగాణ విభాగానికి నూతన ఛైర్మన్‌గా సి.శేఖర్‌ రెడ్డి ఎంపికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా డి.సాయి ప్రసాద్‌ వ్యవహరిస్తారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి వీరిద్దరూ సీఐఐ – తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తారు.

సి.శేఖర రెడ్డి రియల్‌ సీఎస్‌ఆర్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌కు సీఎండీగా ఉన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రియల్‌ ఎస్టేట్‌ సంఘాల్లో కీలక పదవులు నిర్వహిస్తూ, సంబంధిత విధానాల రూపకల్పనలో పాల్గొన్నారు. క్రెడాయ్‌ రూపకల్పనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.

డి.సాయి ప్రసాద్, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  వ్యాక్సిన్లు, బయోటెక్నాలజీ, హ్యూమన్‌ జెనిటిక్స్, సెల్‌ బయాలజీ విభాగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది.

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

FAQs

where can I found weekly current affairs?

you can found weekly current affairs at adda 247 telugu website

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

2 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

4 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

6 hours ago

రైల్వే పరీక్షల క్యాలెండర్ 2024 విడుదల, RRB వార్షిక పరీక్ష షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…

6 hours ago

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

7 hours ago