AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్
Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the Current affairs of July 2nd week.
Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో జనరల్ అవేర్నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. GA మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
1. పొంటాక్తో టీ–హబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది
సాంకేతిక ఆధారిత స్టార్టప్లకు ఊతమివ్వడం ద్వారా దేశంలోని ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు ‘టీ–హబ్’మరో కీలక అడుగు ముందుకేసింది. బ్రిటన్, అమెరికా, భారత్, కెనడాలో ఆవిష్కరణల నిధిని సమకూర్చడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పొంటాక్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, పొంటాక్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రేమ్ పార్థసారథి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.
ఏడాది పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా టీ–హబ్ కొత్త భవన్లో పొంటాక్ నూతన శాఖ ఏర్పాటుకు వీలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. టీ–హబ్లో పురుడు పోసుకునే స్టార్టప్లను యూకే మార్కెట్తో అనుసంధానం చేసేందుకు వీలుగా పొంటాక్ టీ–హబ్తో కలిసి నిధులు సమకూరుస్తుంది. యూకే, భారత్లో స్టార్టప్లు మరింత వృద్ధి, మరిన్ని నిధులకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని శ్రీనివాస్రావు తెలిపారు.
2. తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ నవీన్ రావు నియమితుల య్యారు
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా జస్టిస్ నవీన్ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూ యాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్ నవీన్రావును నియమించారు.
3. ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఆర్ఎస్ఐ) నుంచి అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యా ప్తంగా రసాయన శాస్త్ర పరిశోధనలు చేస్తున్న 30 మంది శాస్త్రవేత్తలను కాంస్య పతకాలకు ఎంపిక చేయగా అందులో ఐఐసీటీలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్లుగా పనిచేస్తున్న డాక్టర్ ప్రథమ ఎస్.మైన్కర్, డాక్టర్ దేబేంద్ర కె.మహాపాత్ర, ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డికి దర్శన్ రంగనాథన్ స్మారక ఉపన్యాసకుడిగా గుర్తింపు లభించింది. మొహాలీలో ఇటీవల జరిగిన 29వ సీఆర్ఎస్ఐ జాతీయ సదస్సులో ఈ అవార్డులను అందజేశారు. మెడిసినల్ కెమిస్ట్రీ, కృత్రిమ సేంద్రియ రసాయన శాస్త్రం, కొత్త మందుల ఆవిష్కరణ వంటి రంగాల్లో డాక్టర్ ప్రథమ పరిశోధనలు చేస్తుండగా వైద్యానికి కీలకమైన సంక్లిష్టమైన సహజ రసాయనాలు గుర్తించేందుకు డాక్టర్ దేబేంద్ర కృషి చేస్తున్నారు. ఫార్మా రంగంతోపాటు సీఎస్ఐఆర్ వ్యవస్థలోనూ అనుభవం గడించిన డాక్టర్ డి.శ్రీనివాసరెడ్డి సేంద్రియ, మెడిసినల్ రసాయన శాస్త్ర రంగాలను మానవ సంక్షేమానికి వర్తించే దిశగా కృషి చేస్తున్నారు.
4.చుక్కా రామయ్యకు జీవిత సాఫల్య పురస్కారం
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు తెలంగాణ వేదిక్ మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందచేశారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా దీక్షితులు కళావేదికపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు అవార్డును అందచేశారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య గణితశాస్త్రానికే ప్రతిరూపం లాంటి వారని, ఆయన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీని ఇంటింటికీ తీసుకెళ్లారని కొనియాడారు.
అవార్డుల స్థాయి కన్నా ఎత్తుకు ఎదిగిన రామయ్య నుంచి లెక్కలు మాత్రమే కాదు జీవితం సక్రమంగా నడిచే లెక్కలు కూడా నేర్చుకోవాలన్నారు. త్వరిత గణిత విధానంలో రికార్డు సాధించిన సాయి కిరణ్ సారథ్యంలో ఉన్నత ప్రతిభ చూపిన చంద్రయ్య, నరసింహారావులకు గణిత రత్న అవార్డు బహూకరించారు. బాల సాహిత్య రచయిత చొక్కాపు రమణ అధ్యక్షత వహించారు.
5. శంషాబాద్లో విడిభాగాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఫ్రాన్స్కు చెందిన ప్రసిద్ధ వైమానిక సంస్థ శాఫ్రాన్ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే విమాన నిర్వహణ, మరమ్మతుల కేంద్రం (ఎంఆర్వో) ప్రపంచంలోనే అతిపెద్దదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ కేంద్రం 2025 నాటికి సిద్ధమవుతుందన్నారు. మధ్య ప్రాచ్య దేశాలు, దక్షిణ ఆసియా దేశాల నుంచి కూడా విమానాలు మరమ్మతులకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఆ సంస్థ తెలంగాణలో వరసగా పెడుతున్న మూడో అతిపెద్ద పెట్టుబడి ఇదని అన్నారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి ఎంఆర్వో కేంద్రం ఇదేనని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్లో కొత్తగా నిర్మించిన శాఫ్రాన్ విమాన ఇంజిన్ల విడిభాగాల అధునాతన ఉత్పత్తి కేంద్రాన్ని, సమీపంలో ఉన్న శాఫ్రాన్ ఎలక్ట్రికల్, పవర్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2020 నుంచి తాను, తమ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన అన్నారు.
1. ఏపీ: భారతి సిమెంట్ సంస్థకు 5 స్టార్ రేటింగ్
ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి సిమెంట్ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్ స్టార్ రేటింగ్ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్ రేటింగ్ను ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా అందులో ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం.
2. నెల్లూరులో గ్యాస్ పరిశ్రమ ఏర్పాటు పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్లైన్ గ్యాస్ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్ పీ గ్యాస్ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
3. ఏపీకి ఉత్తమ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డు
పర్యాటక రంగంలో రాష్ట్రానికి ఉత్తమ ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ అవార్డు లభించిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తెలిపింది. జులై 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన ‘ట్రావెల్ టూరిజం ఫెయిర్’లో ప్రింట్ ప్రమోషనల్ మెటీరియల్ విభాగంలో రాష్ట్రానికి అవార్డు లభించినట్లు ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కన్నబాబు వెల్లడించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…
మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…