Telugu govt jobs   »   Study Material   »   తెలంగాణ మలి దశ ఉద్యమం

Telangana Mali Dasha Movement and State Formation | తెలంగాణ మలి దశ ఉద్యమం – రాష్ట్ర అవతరణ

Telangana Movement and State Formation – మలిదశ ఉద్యమం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎన్ని విధాలుగా నష్టపోయినా రాజకీయ పార్టీలు కాని నాయకులు కాని, తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపలేదు. ఏ ఒక్క నాయకుడయినా తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించినా వారికి సీమాంధ్ర సంపన్న వర్గాల నుంచి అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ విధమైన తరుణంలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ సమస్యలపై ఉద్యమించడం ప్రారంభించారు. ఈ ఉద్యమ భావజాల వ్యాప్తి 1984 నుంచి క్రమంగా మొదలయింది. ప్రజాసంఘాల నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తెలంగాణ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి జరగదని భావించారు. అందువల్ల 1984 నుంచి ప్రజా సంఘాల నాయకులు, సంఘాల నాయకత్వంలో మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 1984 నుంచి ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి స్థూలంగా నిర్మాణ పూర్వ దశ (1984 – 1996), నిర్మాణ దశ (1996-2001), రాజకీయ ప్రక్రియ దశ (2001 నుంచి) అనే 3 దశలుగా విభజించవచ్చు.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ సాధన సమితి

  • కాకినాడ తీర్మానం (Kakinada Resolution) అమలు చేయకపోయేసరికి ఆలె నరేంద్ర బీజేపీ నుంచి బయటికి వచ్చి ‘తెలంగాణ సాధన సమితి’ అనే పార్టీని స్థాపించారు.
  • కేసీఆర్ తో సంప్రదింపుల అనంతరం తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించి 2002 ఆగస్టు 11న టీఆర్ఎస్ లో తెలంగాణ సాధన సమితి విలీనమైంది.

తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు

2004 Election Alliances | 2004 ఎన్నికల పొత్తులు

  • టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకరించింది.
  • ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీకి 42 స్థానాలు ఇవ్వటానికి అంగీకారం కుదిరింది.
  • 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 26 శాసనసభ సీట్లను, 5 లోక్ సభ సీట్లను గెలిచింది.
  • కేంద్రంలో యూపీఏ కూటమి అధికారంలోకి రావటంతో టీఆర్ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరింది.
  • దీనిలో కె.చంద్రశేఖర్ రావుకు ఓడరేవుల మంత్రిత్వశాఖ , ఆలె నరేంద్రకు గ్రామీణాభివృద్ధి శాఖ  లభించింది.
  • 2004 జూన్ 7న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంలో ‘అవసరమైన సంప్రదింపుల ద్వారా సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అంశాన్ని చేపడుతుందని” పేర్కొన్నారు.

 తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర

J.M. Giriglani Committee | జె.ఎమ్.గిర్‌గ్లాని కమిటీ

  • జూన్ 25, 2001న 610 జి.ఓ. అమలును పరిశీలించడానికి  గిర్‌గ్లాని కమిటీ ఏర్పాటు చేసింది – నారా చంద్రబాబునాయుడు
  • ఇది ఏకసభ్య విచారణ కమిటీ.
  • ఈ కమిటీ 90 రోజులలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు పెట్టింది.
  • ఈ కమిటీ విచారణకు ప్రభుత్వం సహకారం లేకపోవడంతో 25% ఉద్యోగుల జాబితాతో తొలి నివేదికను 2001 అక్టోబర్ లో ప్రభుత్వానికి సమర్పించింది
  • మొదటి మధ్యంతర నివేదికలో 25% ఉద్యోగుల తొలి జాబితా తయారుచేయబడింది.

నక్సలైట్ ఉద్యమం

Recommendations | సూచనలు 

ఈ కమీషన్ రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జి.వో అమలు కోసం తాత్కాలికమైన, శాశ్వతమైన చర్యలను సూచించింది.

  1. సర్వీసు పుస్తకాలలో స్థానికత నమోదు జరగాలి.
  2. ఉల్లంఘనలు సరిచేసిన తర్వాతే కొత్త నియమాకాలు, పదోన్నతులు చేపట్టాలి.
  3. రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి.
  4. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత సభా కమిటీని  చేయాలి. 
  5. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత మంత్రుల కమిటీని చేయాలి.
  6. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 అమలుపై శాశ్వత అధికారుల కమిటీని శాశ్వతంగా నియమించాలి.
  7. సాధారణ పరిపాలన శాఖ చూసే సర్వీసు నిబంధనల విభాగంను బలోపేతం చేయాలి.
  • జి.వో.610 అమలులో ఉల్లంఘనలను అధ్యయనం చేయటానికి రాష్ట్ర శాసనసభ హౌస్ కమీటీని నియమించింది.

 తెలంగాణ గుర్తింపుకై ఆరాటం 

జి.వో 610పై హౌస్ కమిటీ:

  • జూన్ 15, 2001న 6 సూత్రాల పథకం అమలు పైన 5, 6 జోన్లలో జీవో నెం. 610 అమలు పైన ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది.
  • తెలంగాణ శాసన సభ్యులు. డిసెంబర్ 29, 2001న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాలలో స్థానికులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించారు
  • దీనితో శాసనసభ హౌస్ కమిటీ నియమించబడింది.
  • ఈ కమిటీ చైర్మన్ – రేవూరి ప్రకాశ్ (టీడీపీ ఎమ్మెల్యే)

610 జీవో అమలుకు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కమిటీ:

  1. 2006 డిసెంబర్ 6న 610 జీవో అమలుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు.
  2. ఈ కమిటీ సభ్యులలో వున్న సీమాంధ్ర ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయడంతో 610 జీవో అమలు కాలేదు.

1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు

ప్రణబ్ ముఖర్జీ కమిటీ

  • కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2005లో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీ యొక్క గడువు 8 వారాలు
  • ఈ కమిటీ యొక్క విధి అన్ని పార్టీల అభిప్రాయం తెలుసుకోవడం.
  • ఈ కమిటీకి 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా  లేఖలు ఇచ్చారు.
  • 2008 అక్టోబర్ లో టిడిపి తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇచ్చింది.

జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 

టి.ఆర్.ఎస్. చీలికకు వై.ఎస్.ఆర్, కుట్ర:

  • ఇటువంటి సమయంలో వై.ఎస్.ఆర్ రాష్ట్రంలో టి.ఆర్.ఎస్.ను చీల్చడానికి ప్రయత్నించాడు. 
  • దీనిని పసిగట్టిన కె.సి.ఆర్. రాష్ట్ర మంత్రివర్గం నుండి తప్పుకోమని టి.ఆర్.ఎస్. మంత్రులకు సూచించాడు
  • రాష్ట్ర మంత్రివర్గంలోని టి.ఆర్.ఎస్ మంత్రులు రాజీనామా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్న కె.సి.ఆర్, ఆలె నరేంద్రలు తమ పదవులకు రాజీనామా చేయలేదు.
  • 2005 డిసెంబర్ లో శాసనమండలి ఎన్నికలలో “కాసాని జ్ఞానేశ్వర్” స్వతంత్ర్య అభ్యర్థిగా కాంగ్రెస్అం డతో పోటీ చేశాడు.
  • జ్ఞానేశ్వర్‌కు పార్టీ ఆదేశాలను ధిక్కరించి 9 మంది టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలు మద్దతివ్వడానికి పరోక్షంగా వై.ఎస్.ఆర్. కారణమయ్యాడు
  • తెలంగాణ భావాజాలాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ జాగరణ సేన అను పేరుతో లక్ష మంది కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది.
  • పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న గిరిజనులకు మద్దతు తెలపడానికి టి.ఆర్.ఎస్ పార్టీ పోలవరం గర్జన పేరుతో 2006 ఫిబ్రవరి 12న భద్రాచలంలో బహిరంగ సభను నిర్వహించింది.
  • ఈ సభకు కేంద్రమంత్రి శిబుసోరెన్ హాజరయ్యారు.

తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956

Telangana Prime Test Pack 2023-2024 | Complete Bilingual Online Test Series by Adda247

 

ఇంకా చదవండి
తెలంగాణ భావజాల వ్యాప్తి  1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర
1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర  1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952 తెలంగాణ ఉద్యమ చరిత్ర -తెలంగాణ రాష్ట్ర అవతరణ

 

Sharing is caring!