Telugu govt jobs   »   Telangana Movement & State Formation ,Naxalite...   »   Telangana Movement & State Formation ,Naxalite...

Telangana Movement & State Formation, Naxalite movement, Download PDF | నక్సలైట్ ఉద్యమం

Telangana Movement & State Formation: Naxalite movement, నక్సలైట్ ఉద్యమం

  • బెంగాల్ లో ఖాళీగా ఉన్న 6 లక్షల భూమిని పేదలకు గిరిజనులకు పంచుతామని హామీ ఇచ్చి, 1967 ఎన్నికలలో CPI(M) పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా అజయ్ ముఖర్జీ, ఉపముఖ్యమంత్రి మరియు హోంమినిష్టర్ గా జ్యోతిబసు ప్రమాణ స్వీకారం చేశారు.
  • కాని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా 6 లక్షల ఖాళీ భూములను మాత్రం పేదలకు పంచడానికి నిరాకరించారు.

చారుమంజుదార్: 

  • ప్రభుత్వం భూమిని పంచకపోవడంతో డార్జిలింగ్ ప్రాంత పార్టీ సెక్రటరీగా ఉన్న చారుమజుందార్ నేతృత్వంలో డార్జిలింగ్ (బెంగాల్) ప్రాంతంలోనే ‘సిల్ గురి’ ప్రజలు భూ ఆక్రమణకు పూనుకొన్నారు.
  • మొదట సిలిగురి ప్రాంతంలోనే నక్సల్బరి అనే గ్రామంలో 1967 మే 23 నుండి 25 మధ్యకాలంలో 10,000 మంది సంతాల్ గిరిజనులు భూ ఆక్రమణ మొదలు పెట్టారు
  • ఇటువంటి సమయంలో 1967 నవంబర్ లో వివిధ కమ్యూనిస్టు వర్గాల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన భేదాలను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో ‘కమ్యూనిస్టు విప్లవకారుల అఖిలభారత సమన్వయకమిటీ ఏర్పడింది.
  • ఈ కమిటి రెండవ సమావేశం 1968 మే నెలలో కలకత్తాలో జరిగింది.
  • ఈ సమావేశంలో CPI(M) పార్టీ సిల్ గురి ప్రాంత జనరల్ సెక్రటరీ చారుమజుందార్ సాయుధ పోరాటం నిర్వహించాలనీ, ఎన్నికలను బహిష్కరించాలని పేర్కొన్నాడు.
  • ఈ ప్రకటనను వ్యతిరేకించిన జాతీయ కమ్యూనిస్టు నాయకులు : తరిమెల నాగిరెడ్డి , దేవులపల్లి వెంకటేశ్వరరావు.
  • కాని చారుమజుందార్ యొక్క సాయుధ పోరాట తీర్మానంను అంగీకరించిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమ నాయకులు: పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు

CPI(ML) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు – లెనినిస్టు)

  • చారుమజుందార్ యొక్క తీర్మానంను ఆమోదించిన వారితో కలిసి 1969 ఏప్రిల్ 22 నాడు CPI(ML) ను స్థాపించారు.
  • నక్సల్బరి గ్రామంలో పుట్టిన ఉద్యమం గనుక వీరికి పత్రికలు నక్సలైట్లుగా నామకరణం చేశారు
  • CPI(ML) ను స్థాపించిన అనంతరం 1969 మే 1 న కలకత్తాలోని ‘షహీద్ మినార్’ మైదానంలో కానూ సన్యాల్ CPI(ML) పార్టీ అవతరణను, పార్టీ విధానాలను ప్రకటించాడు.

General Awareness Quiz in Telugu, 28th August 2023_70.1APPSC/TSPSC Sure shot Selection Group

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు

  • 1960 లలో సి.పి.ఐ (ఎం) యొక్క అనుబంధ విద్యార్థి సంస్థ – స్టూడెంట్స్ ఫెడరేషన్.
  • నక్సలిజంతో ప్రభావితులైన విద్యార్థులు స్టూడెంట్స్ ఫెడరేషన్ నుండి విడిపోయి డెమోక్రటిక్ స్టూడెంట్స్ పేరుతో విద్యార్థి సంస్థను ఏర్పరచుకున్నారు.
  • కొండపల్లి సీతారామయ్య, ఛండ్ర పుల్లారెడ్డి నాయకత్వాలలో పనిచేస్తున్న విద్యార్థులు డెమోక్రటిక్ స్టూడెంట్స్ నుంచి విడిపోయి 1974లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (పి.డి.ఎస్.యు) ను ఏర్పాటు చేసుకున్నారు.
  • 1974 అక్టోబర్ లో సరోజినిదేవీ హాల్లో పి.డి.ఎస్.యు సభలు జరిగాయి.
  • ఈ సభలలో కొండపల్లి సీతారామయ్య మరియు చండ్ర పుల్లారెడ్డి వర్గం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది.
  • ఈ ఘర్షణలో పాల్గొని కొండపల్లి సీతారామయ్య వర్గ ముఖ్య విద్యార్థులు :
  • మల్లోజుల కోటేశ్వరరావు (కిషజ్)
  • సాహు (శనిగరం వెంకటేశ్వర్లు)
  • గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు)
  • అల్లం నారాయణ

ఆర్.ఎస్.యు (రాడికల్ స్టూడెంట్ యూనియన్)

  • ఈ ఘర్పణతో కొండపల్లి సీతారామయ్య వర్గం విద్యార్థులు పి.డి.ఎస్.యు నుండి బయటికి వచ్చి 1974 అక్టోబర్ లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ను ఏర్పాటు చేసుకున్నారు.
  • దీనికి రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని నామకరణం చేసింది – శ్రీశ్రీ.
  • ఆర్.ఎస్.యు. రాష్ట్ర మహాసభలు –
  • మొదటి రాష్ట్ర మహాసభలు – హైదరాబాద్ (1975)
  • రెండవ రాష్ట్ర మహాసభలు – వరంగల్ (1978)
  • మూడవ రాష్ట్ర మహాసభలు – అనంతపురం
  • నాల్గవ రాష్ట్ర మహాసభలు – గుంటూరు (1981)
  • ఐదవ రాష్ట్ర మహాసభలు – తిరుపతి (1982)

ఆర్.ఎస్.యు – గ్రామాలకు తరలండి క్యాంపెయిన్

  • వేసవి సెలవులలో విద్యార్థులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి వారిని విప్లవోద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా కొండపల్లి సీతారామయ్య ప్రణాళిక రచించాడు.
  • ఈ ప్రణాళికలో భాగంగా 1978 ఏప్రిల్ నుండి మే వరకు 30 రోజుల క్యాంపును కరీంనగర్ లోని మంథని దగ్గర గల శాస్త్రులపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో సత్యమూర్తి, సాంబశివరావు (వైట్ మాన్) మరియు ఇతర ముఖ్యులు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
  • ఈ శిక్షణ అనంతరం 5గురు సభ్యులు గల 150 విద్యార్థి బృందాలను ఏర్పాటుచేసి కరీంనగర్ జిల్లా పర్యటనకు పంపిచారు
  • ఈ 30 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న నారదాసు లక్ష్మణరావు గుంటూరులో జరిగిన ఆర్.వై.ఎల్ సభలలో పాల్గొని ప్రసంగించారు.
  • నారదాసు లక్ష్మణరావు తన ప్రసంగాలను గ్రామలకు తరలండి – నా అనుభవాలు అనే పేరుతో పుస్తకంగా క్రోడీకరించారు.

భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు

గొల్లపల్లి సభ (1977, ఆగస్టు 27)

  • ఎమర్జెన్సీ అనంతరం సి.పి.ఐ (ఎం.ఎల్) పీపుల్స్ వార్ పైన నిషేధం ఎత్తివేయబడింది.
  • దీనితో సి.పి.ఐ(ఎం.ఎల్) పార్టీ వారు 1977 జూలై నుండి ఆగస్టు నెలల మధ్య కాలంలో ప్రజాసంఘాల కార్యక్రమాలు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించారు.
  • ఆ కార్యక్రమాలలో భాగంగా గొల్లపల్లి సభ నిర్వహించారు.
  • ఆగస్టు 27, 1977న జగిత్యాల తాలూకాలోని గొల్లపల్లి గ్రామంలో రైతు కూలీ సంఘాల నేతృత్వంలో జరిగిన సభకు దాదాపు 3000 మంది రైతులు హాజరయ్యారు.

ముద్దునూరు సంఘటన

  • ముద్దునూరు భూస్వామి – రాజేశ్వరరావు.
  • ఇతనిని ఎదిరించి 1978 జూన్ 30 నాడు ప్రజలు ఇతని ప్రాంతంలోని కట్టె కొట్టి, చెట్లు నరికి తీసుకొని వెళ్లిపోయారు.

లక్సెట్టిపేట సంఘటన

  •  తునికాకు సీజన్లో కూలీలంతా అధికరేట్లు కావాలని, తాము ఏరుకొని వచ్చిన తునికాకుకు న్యాయమైన ధర అందించాలని కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా లక్సెట్టిపేటలో సమ్మెచేసి విజయం సాధించారు.

జగిత్యాల జైత్రయాత్ర (1978 సెప్టెంబర్ 7)

  • 1978 సెప్టెంబర్ 7న జగిత్యాల పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం.ఎల్) ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన రైతు కూలీ ప్రదర్శన జరిగింది.
  • జగిత్యాల తాలూకాలోని అన్ని గ్రామాల నుండి రైతులు, రైతు కూలీలు వచ్చినప్పటికీ కేవలం వెల్దుర్తి, సారంగాపూర్ గ్రామాల నుండి రైతులు రాలేకపోయారు.
  • వెల్దుర్తి గ్రామ భూస్వామి సత్యనారాయణరావు ఆ గ్రామ రైతులు జగిత్యాల జైత్ర యాత్రలో పాల్గొనకుండా అడ్డుపడ్డాడు.
  • ఈ మహాసభను చారిత్రాత్మకమైన రైతు ప్రదర్శనగా ఆంధ్రభూమి దినపత్రిక అభివర్ణించింది.

జగిత్యాల జైత్రయాత్ర అనంతర సంఘటనలు

చిన్న మెట్ పల్లి ఘటన

  • 1958లో 30 ఎకరాల స్వంత భూమి కలిగిన జగన్మోహనరావు అనే భూస్వామి 1978 నాటికి 150 ఎకరాలకు ఆసామి అయ్యాడు.
  • జగిత్యాల జైత్రయాత్రలో పాల్గొన్న రైతాంగం తమ దొరచేసే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సంఘం పెట్టుకోవాలనుకున్నారు.
  • మెట్ పల్లి రైతులు సెప్టెంబర్ 14న తమ గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు.
  • ఈ సభను అడ్డుకోవడానికి భూస్వామి జగన్మోహనరావు తన బలగంతో ఆ సభపై దాడి చేయించాడు.
  • ఈ వార్త విన్న చుట్టు ప్రక్క గ్రామ ప్రజలు చిన్నమెట్పల్లికి చేరుకొని భూస్వామి జగన్మోహనరావు ఇంటికి ఊరేగింపుగా బయలుదేరారు.
  • ఈ ఊరేగింపును చూసిన భూస్వామి అల్లుడైన బోర్నపల్లి సురేష్ బంగ్లా పైనుండి ఊరేగింపుపై కాల్పులు ప్రారంభించాడు.
  • ఈ కాల్పుల విషయం తెలుసుకున్న సురేష్ సొంతూరు బోర్నపల్లి ప్రజలు సురేష్ ఇంటిని తగలబెట్టారు.

కల్లోల ప్రాంతంగా ప్రకటన

  • రైతుకూలి సంఘాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కేంద్ర ప్రభుత్వంనకు నివేదిక సమర్పించాడు.
  • దీనితో అక్టోబర్ 20, 1978న జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
  • రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పటికి కేంద్రంలోని ఆనాటి జనతా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని (జగిత్యాల, సిరిసిల్ల) కల్లోలిత ప్రాంతంగా ప్రకటించుటకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

రైతు కూలీ సంఘాలు 

  • ప్రజలు జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలలో భూస్వాములకు ఎదురుతిరగారు.
  • రాడికల్ స్టూడెంట్ యూనియన్ “గ్రామాలకు తరలండి” అనే క్యాంపెయిన్లో భాగంగా అనేక గ్రామాలలో రైతు కూలీ సంఘాలను ఏర్పరచారు.
  • 1977లో మద్దనూరు గ్రామంలో జీతాలు, కూలీరేట్లు పెంచాలని మద్దనూరు భూస్వామి రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా పాలేర్లు, రైతు కూలీలు సమ్మెచేశారు
  • మద్దనూరులో ప్రారంభమైన ఈ పోరాటం జగిత్యాల తాలూకా అంతటా వ్యాపించింది.

రైతు కూలీ సంఘాల సారా వ్యతిరేక ఉద్యమం

  • 1979లో జగిత్యాల తాలూకా ప్రాంతంలో సారాకాంట్రాక్టులకు రాకుండా భూస్వాములను అడ్డుకొని గ్రామకమిటీల నాయకత్వాన ప్రజల సమక్షంలో వేలంపాట నిర్వహించారు.
  • వేలంపాడిన గుత్తేదారు గ్రామ అభివృద్ధికి కొంత డబ్బును ఖర్చు పెట్టాలనే నిబంధనను పెట్టి గ్రామాలను కొంతవరకు అభివృద్ధి చేసుకున్నారు.
  • తెలంగాణ గ్రామాలలో ఎన్.టి.ఆర్ ప్రభుత్వం వారుణి వాహిని పేరుతో ప్రవేశపెట్టిన సారాపంపిణీని వ్యతిరేకిస్తూ రైతుకూలీ సంఘం అనేక పోరాటాలు నిర్వహించింది.
  • 1970 లలో గిరిజన భూములను కొనడంపై ప్రభుత్వం నిషేధిస్తూ చట్టం చేసింది.
  • చట్టంనే 1/70 చట్టం అని కూడా పేర్కొంటారు.
  • ఈ చట్టం ముఖ్యాంశాలు:
  • 1. గిరిజన భూములను గిరిజనేతరులు కొనుక్కున్నా, లీజుకు తీసుకున్నా చెల్లదు.
  • 2. ఎటువంటి పరిస్థితులలోనైనా గిరిజనులు భూములు అమ్ముకున్నా, అద్దకు ఇచ్చుకున్నా వారికి (గిరిజనులకి) ఆ భూమిపై హక్కు పోదు.
  • పెడ్యూల్ తెగల వారి భూములను షెడ్యూల్ తెగలు కాని వారికి బదలాయించకూడదని సుప్రీం కోర్టు సమత వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు సందర్భంగా తీర్పు చెప్పింది.

ఇంద్రవెల్లి సభ

  • 1970లలో ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నిర్మించిన ముఖ్యమైన విప్లవకారులు : సాహు (శనిగరం వెంకటేశ్వర్లు),  దాసరి లక్ష్మీకాంతం (పొర్కల దొర)
  • ఆదివాసీ రైతుకూలీ సంఘం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ రైతు కూలీలైన గోండు, కోలాంలను కూడగట్టి 1980 ఏప్రిల్ 21న భారీ బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.
  • పిట్టబొంగరం అనే గ్రామంలో గోండురైతులు సభకు వస్తుండగా అడ్డుకున్న పోలీసులకు, గోండు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.
  • దానితో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొని పోలీసులు కాల్పులు జరిపారు.
  • ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ కాల్పులలో 13 మంది మరణించారు. కానీ పౌర హక్కుల సంఘం వారు ఈ కాల్పులలో 60 మంది దాకా మరణించారని పేర్కొంటారు.
  • ఈ విధంగా ఇంద్రవెల్లి గిరిజన సభ రక్తసిక్తమైంది.
  • ఇంద్రవెల్లిలో ప్రాణాలు అర్పించిన గిరిజన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడానికి తరువాత సంవత్సరంలో అదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం వారు ఇంద్రవెల్లి సభను నిర్వహించారు.
  • అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇంద్రవెల్లి అమరవీరులకు స్థూపంను నిర్మించి ఆవిష్కరించారు.
  • ఎన్.టి.ఆర్ సీఎం అయిన తరువాత 1987లో ఈ అమరవీరుల స్థూపాన్ని కూల్చివేయడం జరిగింది.
  • ఈవిధంగా గిరిజన రైతు కూలీ సంఘాల నేతృత్వంలో ఆదివాసి భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా గిరిజనులు ఉద్యమించారు.

 Telangana Movement Naxalite movement Download PDF

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్స్ 

తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు – 1969 ఉద్యమానికి కారణాలు
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
1948 నుండి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం యొక్క సంక్షిప్త చరిత్ర
తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు- కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What was the Naxalite movement in Telangana?

The Naxalite movement, also known as the Naxal movement or Naxalism, was a radical left-wing movement that aimed to establish a classless society and overthrow the Indian government through armed struggle. It gained traction in Telangana and other parts of India in the late 1960s.

Did the Naxalite movement achieve its goals in Telangana?

The Naxalite movement did not achieve its ultimate goal of overthrowing the government or establishing a classless society. However, it did bring attention to issues of land reform, tribal rights, and rural inequality.