Telugu govt jobs   »   Telangana Movement & State Formation,   »   Telangana Movement & State Formation,

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

Telangana Movement & State Formation Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం,  భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana Movement & State Formation (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు PDF తెలుగులో)

TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

(ఎ) ఉద్యో గుల పాత్ర

విద్యుత్ ఉద్యోగులు:

  •  కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని నాన్ ముల్కీ ఉద్యోగులను జనవరి 10 లోగా తొలగించాలని ఉద్యమించారు.
  • ఉద్యమం ఉదృతరూపం దాల్చడంతో 1969 జనవరి 18, 19 రోజులలో కాసు బ్రహ్మానందరెడి ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

అఖిలపక్ష ఒప్పందం: 

ఈ ఒప్పందం ప్రకారం తీసుకోవలసిన చర్యలు:

  • ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో నియమించిన ఉద్యోగులందరినీ వెంటనే తొలగించి వారి స్థానాలలో స్థానికులను నియమించాలి. ఈ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన ఆంధ్రప్రాంతం వారికి వారి ప్రాంతంలో ఉద్యోగవకాశాలు కల్పించాలి.
  • ఆంధ్ర ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీసి ఆ నిధులను తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కొరకు ఉపయోగించాలి.
  • రాజధానియైన హైదరాబాదు నగరంలో విద్యావసతులను విస్తరింపజేయాలి.

జి.వో.36 :

  • ఈ అఖిలపక్ష నిర్ణయాన్ని అమలుపరచుటకు, రాష్ట్ర ప్రభుత్వం 1969 జనవరి 21 రోజున 36 నంబరు గల ఒక జీ.వో.ను జారీ చేసింది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యాచరణ సమితి

  •  1969 మార్చి 11న TNGO ల నాయకుడు కె.ఆర్. అమోస్ ఉపాధ్యాయుల నాయకుడు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో – ‘ఉద్యోగులు, ఉపాధ్యాయుల కార్యాచరణ సమితి’ ఏర్పడింది.

కె.ఆర్.ఆమోస్ డిస్మిస్ అంశం: 

  • 1969 మేలో ప్రత్యేక తెలంగాణ జూన్ 1 లోగా ఏర్పడకపోతే రక్తపాతం తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగసంఘం నాయకుడు – కె.ఆర్. ఆమోస్.
  • దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది.
  • అంతే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడనే కారణంతో గవర్నర్ ‘అమోస్’ను ఉద్యోగం నుండి 1969 మే 25న డిస్మిస్ చేశారు.

నిరవధిక సమ్మె:

  • 1969 జూన్ 10 నుండి ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించి, 1969 జూలై 16 (37 రోజులు)న విరమించారు.
  • తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తగిన సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి నసి ఉల్లాబేగ్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసింది.

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర_50.1

బి) 1969 ఉద్యమం – మేధావుల పాత్ర

తెలంగాణ పరిరక్షణల కమిటి:

  • హైదరాబాద్ నగరంలోని మేధావులు 1969 జనవరి 13 న తెలంగాణ పరిరక్షణల కమిటీని స్థాపించారు. 
  • తెలంగాణ పరిరక్షణల కమిటీ ఛైర్మన్ – కాటం లక్ష్మీనారాయణ. 

తెలంగాణ విమోచనోద్యమ సమితి:

  • 1969 జనవరి 28న వరంగల్ లో ‘తెలంగాణ విమోచనోద్యమ సమితి’ సదస్సు కాళోజీ అధ్యక్షతన జరిగింది.
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది – ‘కాళోజీ నారాయణరావు’
  • 1969 జూన్లో హైదరాబాద్ లో కాళోజి నారాయణరావు అధ్యక్షతన ‘తెలంగాణ రచయితల సదస్సు జరిగింది.

తెలంగాణా ప్రజాసమితి: 

  • 1969 మార్చి 25న హైద్రాబాద్ లో యువకులు, మేధావులు విద్యార్థులు కొనసాగిస్తున్న తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా ‘తెలంగాణ ప్రజాసమితి’ ని స్థాపించారు (ఫిబ్రవరిలో ఏర్పాటైన తెలంగాణ ప్రజా కన్వెన్షన్ 1969 మార్చి 25న తెలంగాణ ప్రజా సమితిగా మార్పు చెందింది).
  • దీని అధ్యక్షుడు – మదన్ మోహన్ (సిద్దిపేట లాయర్)
  • మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షుడు అయిన తర్వాతి కాలంలో తెలంగాణ ప్రజాసమితి నుండి మదన్ మోహన్ సిద్దిపేట ఉపఎన్నికలలో పాల్గొని విజయం సాధించాడు.

ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సు: (1969 మే 20) 

  • 1969 మే 20 న ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, లెక్చరర్ల తెలంగాణా సదస్సు వై.యం.సి.ఎ. హాల్ లో ప్రొ॥ముంజుఠాలం అధ్యక్షతన జరిగింది. “
  • ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసింది – రావాడ సత్యనారాయణ (ఉస్మానియా వైస్ ఛాన్సలర్)
  • ఫిజిక్స్ ప్రొఫెసర్ గా ఉన్న రావాడ సత్యనారాయణను 1969 ఏప్రిల్ 25న డి.ఎస్.రెడ్డి స్థానంలో ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గా నియమించారు.

ఈ సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించిన ప్రొఫెసర్లు :

  • ప్రొ॥ జయశంకర్ సారు
  • బషీరొద్దిన్
  • పెన్నా లక్ష్మీకాంతారావు
  • శ్రీధరస్వామి
  • తోట ఆనందరావు
  • ఈ సదస్సులో సమర్పించిన పత్రాలన్నింటిని కలపి ‘Telangana Movement and Investigative Focus’ అనే పుస్తకంను ప్రచురించారు.
  • ఈ సదస్సులో ప్రొ॥ జయశంకర్ సారు సమర్పించిన పత్రం పేరు- “డా॥ కె.ఎల్.రావు-నాగార్జునసాగర్”
  • ఈ సదస్సు ముగింపు ఉత్సవంలో మర్రిచెన్నారెడ్డి ప్రసంగించారు.

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర_60.1

(సి) ఉద్యమం-విద్యార్థుల పాత్ర

ఉద్యమంలోకి ఉస్మానియా విద్యార్థులు :

  • 1969 జనవరి 12న యూనివర్సిటిలోని అన్ని కాలేజీలు విద్యార్థి సంఘాల సర్వసభ్య సమావేశం వెంకట్రామారెడ్డి అధ్యక్షతన జరిగింది. 

సెఫ్ గార్డ్స్ విద్యార్ధులు: (ప్రత్యేక రక్షణల అమలుకోసం మాత్రమే)

  • వెంకట్రామిరెడ్డి నాయకత్వంలోని గ్రూపు కేవలం తెలంగాణ రక్షణల అమలుకు మాత్రమే పరిమితం. 
  • ఈ విద్యార్థుల లక్ష్యం – రాష్ట్రంను సమైక్యంగా ఉంచుతూ తెలంగాణ రక్షణలను అమలు పరచాలి.
  • అందుకే రక్షణల కోసం మాత్రమే పోరాడుతున్న విద్యార్థులను సేఫ్ గార్డ్స్ విద్యార్థులు అన్నారు.

తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి:

  • ఈ కార్యాచరణ సమితి యొక్క ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున్ ఎన్నికయ్యాడు.
  • ‘ప్రత్యేక తెలంగాణ సాధించడం మా లక్ష్యం’ అని విద్యార్థులు మొదటిసారి ఈ సమితి ద్వారా ప్రకటించారు. *
  • దీంతో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో రెండు విద్యార్థి సంఘాల గ్రూపులు సేఫ్ గార్డ్స్ మరియు సెపరేటిస్టులుగా విడిపోయారు.

సెపరేటిస్టు విద్యార్థులు:

  •  వీరు ‘తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి’ గా ఏర్పడ్డారు.
  • దీనికి ప్రధాన కార్యదర్శి – మల్లికార్జున్
  • వీరు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమించారు.
  • 1969 జనవరి 18 సెపరేటి స్టువర్గం విద్యార్థులు మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో నిజాం కాలేజి నుండి కోఠికి ఊరేగింపు నిర్వహించారు.
  • తెలంగాణ రక్షణలు కోరుతున్న విద్యార్థులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కోఠి నుండి అబిడ్డకు ఊరేగింపు నిర్వహించారు.
  • ఈ రెండు ఊరేగింపులు అబిడ్స్ చౌరస్తాలో ఎదురుపడ్డారు.
  • అప్పుడు 1969 ఉద్యమ సమయంలో మొదటిసారి హైద్రాబాద్ నగరంలో 1969 జనవరి 18న లాఠీచార్జి జరిగింది.
  • 1969 జనవరి 20న శంషాబాదు రైల్వేస్టేషన్ (ఉమదానగర్)పై విద్యార్థులు దాడి చేసిన సందర్భంలో నగరంలో తొలిసారి పోలీసులు కాల్పులు జరిపారు.
  • 1969 జనవరి 24న సదాశివపేటలో విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు.
  • ఈ ఊరేగింపుపై పోలీసులు కాల్పులు జరపగా ‘శంకర్’, ‘కృష్ణ’ అనే యువకులకు బుల్లెట్లు తగిలి గాంధీ హాస్పిటల్ లో చేరగా శంకర్ జనవరి 25న, కృష్ణ ఫిబ్రవరి 10న మరణించారు.

నోట్: 1969వ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. 

విద్యార్థి నాయకుల జిల్లా పర్యటనలు:

  • 1969 మార్చి మొదటి వారంలో హైద్రాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో తెలంగాణ సదస్సు ఏర్పాటు చేయాలని 1969 జనవరి 27న మల్లికార్జున్ నేతృత్వంలో ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ నిర్ణయించింది.
  • ఈ సదస్సు విజయవంతం చేయుటకొరకు 35 మంది విద్యార్థి నాయకులు తెలంగాణ జిల్లాలలో పర్యటించడానికి వెళ్ళారు.
  • అటువంటి సమయంలో 1969 జనవరి 28న నల్లగొండ పట్టణంలో ఉపసర్వేయర్ గా పనిచేస్తున్న ‘రంగాచార్యులు’ అనే  ఆంధ్ర ఉద్యోగిని గుర్తు తెలియనివారు పెట్రోల్ పోసి తగులబెట్టారు.
  • దాంతో ఆంధ్రప్రాంతంలో జి.వో-36 కు వ్యతిరేకంగా కౌంటర్ ఉద్యమం ప్రారంభం అయ్యింది.

Telangana History PDF In Telugu | తెలంగాణ చరిత్ర స్టడీ మెటీరియల్ PDF

రెడ్డి హాస్టల్ సదస్సు (1969 మార్చి 8,9 లలో) 

  • 35 మంది విద్యార్థి నాయకులు జిల్లా పర్యటనలు పూర్తి చేసుకొని హైద్రాబాద్ లో 1969 మార్చి _8,9వ న రెండు రోజులు రెడ్డి హాస్టల్ లో ‘తెలంగాణ సదస్సు’ నిర్వహించారు.
  • ఈ సదస్సుకు అధ్యక్షత వహించినది – శ్రీమతి సదాలక్ష్మి.
  • ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ప్రొ॥ రావాడ సత్యనారాయణ చేశాడు.
  • ఈ సదస్సులో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి క్విట్ తెలంగాణ అనే నూతన నినాదాన్ని లేవదిశారు.
  • తెలంగాణ మ్యాప్ ను ఇ.వి. పద్మనాభం, ఆదిరాజు వెంకటేశ్వరరావు, మునిజమాలు 1969 మార్చి 7న లీడర్ పత్రికా కార్యాలయంలో రూపొందించారు.
  • తెలంగాణ మ్యాపు రెడ్డి హాస్టల్ సదస్సులోనే శాసనసభ్యుడు అయిన టి.పురుషోత్తమరావు ఆవిష్కరించారు.
  • ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా ‘తపాలబిళ్ల’ ఆవిష్కరణ కోసం రాష్ట్ర గవర్నర్ ఖండుభాయిదేశాయి రావడంతో విద్యార్థులు గవర్నర్ ను ఘెరావ్ చేశారు.
  • 1969 మార్చి 17న విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాల ముందు ‘ప్రజాస్వామ్య రక్షణ దినాన్ని’ జరుపుకొన్నాయి.
  • 1969 మార్చి 28 న ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రింకోర్టు తీర్పు చెప్పింది
  • సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమించి జామై ఉస్మానియా రైలు స్టేషన్‌కు నిప్పంటించారు.

రైల్వే స్టేషన్ మంటలలో పొరపాటున చిక్కుకొని మరణించిన ఇంజనీరింగ్ విద్యార్థులు

  1. ప్రకాశ్ కుమార్ జైన్
  2. పి.సర్వా రెడ్డి

( డి) ఉద్యమం- తెలంగాణ ప్రజా సమితి పాత్ర

  • 1969 ఏప్రిల్ 11 న ప్రధానమంత్రి ఇందిరాగాంధి, లోక్ సభలో అష్ఠసూత్ర పథకంను ప్రకటించింది.
  • ఇటువంటి సమయంలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంఘాల నియోజకవర్గానికి శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.
  • ఈ ఎన్నికలలో మేడ్చల్ పంచాయితీ సమితి అధ్యక్షుడు గా ఉన్న వెంకటరామిరెడ్డి తెలంగాణ ప్రజాసమితి తరపున నిలబడి విజయం సాధించాడు.

మెడే ఊరేగింపు – 1969 మే 01: 

  • తెలంగాణ ప్రజాసమితి మే డే (మే,01) నాడు ‘డిమాండ్స్ డే’ (కోరికల దినం) పాటించాలని పిలుపునిచ్చింది.
  • మే 01 న రెండు ఊరేగింపులు నిర్వహించి గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది.
  1. చార్ మినార్ నుండి రాజ్ భవనకు
  2. 2. సికింద్రాబాద్ నుండి రాజ్ భవను
  • కాని పోలీస్ కమీషనర్  ఊరేగింపుకు అనుమతి చార్ మినార్ నుండి కాకుండా పబ్లిక్ గార్డెన్స్ నుండి ఇచ్చాడు.
  • కాని నాయకులు చార్ మినార్ నుండి ఊరేగింపు చేయాలని నిర్ణయించారు.

చార్మినార్ నుంచి ఊరేగింపు :

చార్మినార్ నుండి ఊరేగింపుకు మొదట సారధ్యం వహించిన వారు-

  1. మల్లిఖార్జున్
  2.  మదన్ మోహన్
  3. కేశవరావ్ జాదవ్
  •  తరువాత కాలంలో కె.వి.రంగారెడ్డి నాయకత్వంలో ఊరేగింపు బయలుదేరింది.
  • ఆ ఊరేగింపు సికింద్రాబాద్ నుండి బయలుదేరిన ఊరేగింపుతో పబ్లిక్ గార్డెన్ వద్ద కలుసుకొంది.

సికింద్రాబాద్ నుంచి ఊరేగింపు

  • ఈ ఊరేగింపునకు నాయకత్వం వహించినది.
  • ఎస్.బి. గిరి
  • నాగం కృష్ణ
  • గౌతు లచ్చన్న
  • రాజ్ భవన్ దగ్గర కూడా ఉద్యమకారులపై కాల్పులు జరగడం వలన సికింద్రాబాద్ ‘సాయం కళాశాల’ విద్యార్థి నాయకుడు అయిన ‘ఉపేందరావు’ మరణించాడు.

పోలీస్ వ్యాన్‌పై బాంబుదాడి: 

  • మే 01 వ తేదీన జరిగిన హింసాకాండకు వ్యతిరేకంగా మే 2 వ తేదీనాడు నగరంలో బంద్ నిర్వహించారు.
  • దీనికి నిరసనగా హింసకు హింసతోనే సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో సికింద్రాబాద్ లో పోలీస్ వ్యాన్ పై బాంబు విసిరిన ఉద్యమకారులు : * నరేందర్ • కుమార్
  • ఈ బాంబు దాడిలో మరణిచిన కానిస్టేబుల్ – ‘ఫారుఖ్ అలీ’.

చెన్నారెడ్డి – తెలంగాణ ప్రజాసమితి:

  • 1969 ఏప్రిల్ లో చెన్నారెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ప్రకటనను ప్రకటిస్తూ ప్రత్యక్ష ఉద్యమంలోకి ప్రవేశించాడు.
  • చెన్నారెడ్డి నాయకత్వంలో ఉద్యమం రెండోదశలోకి ప్రవేశించింది.
  • ప్రత్యేక తెలంగాణ విషయంపై 15 రోజులలో ప్రజాభిప్రాయం సేకరిస్తే అందులో ఓడిపోతే ఉద్యమం విరమిస్తానని చెన్నారెడ్డి 1969 మే 18న ఇందిరాగాంధికి సవాల్ విసిరారు.
  • తెలంగాణ ప్రజాసమితి జూన్ 2వ తేదీన బంద్ కు పిలుపునిచ్చింది.
  • హైద్రాబాద్ నగరం మొత్తం బంద్ పాటించినా ‘దుర్గావిలాస్’ అనే ఆంధ్రహోటల్ మాత్రం తెరచి ఉంచారు.
  • దాంతో ఆగ్రహించిన విద్యార్థి నాయకుడు ‘ప్రేమ్ కిషోర్’ హోటల్ లోనికి వెళ్ళగా అప్పటికే అక్కడికి వచ్చిన ఆంధ్రరౌడీలు కత్తులతో పొడిచి చంపారు.
  • 1969 జూన్ 4 వ తేదీన హైద్రాబాద్ నగరంలో ప్రధాని ఇంధిరాగాంధి పర్యటించి తెలంగాణ ప్రజాసమితి నాయకులతో ఇతర ఉద్యమకారులతో చర్చించింది.

అబిడ్స్ చౌరస్తా – సత్యాగ్రహం:

  • 1969 జూన్ 25 న అబిడ్స్ చౌరస్తాలో సత్యాగ్రహం చేయాలని నిర్ణయించారు. దీనికి పోలీసులు అనుమతించలేదు.
  • అయినప్పటికీ అబిడ్స్ చౌరస్తాలో సత్యాగ్రహం చేశారు.
  • దాంతో ప్రభుత్వం 16 మంది అగ్రనాయకులను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించింది
  • ఈ అగ్రనాయకుల అరెస్టుకు నిరసనగా లోకసభకు రాజీనామా చేస్తామని పేర్కొన్న పార్లమెంటరీయన్లు
  •  డాక్టర్. మెల్కోటే
  • సంగం లక్ష్మీబాయమ్మ.
  • దేశంలోనే పి.డి. చట్టం కింద అరెస్టు కాబడిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ – ‘డాక్టర్ గోపాల్ కిషన్’.

తెలంగాణ ఫ్లాగ్ డే – 1969 జూలై 12

  • ‘1969 జూలై 12’ న తెలంగాణాలో ఫ్లాగ్ డే ను నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఇసామియా బజార్ లో ప్రత్యేక తెలంగాణ పతకాన్ని ఆవిష్కరిస్తూ అరెస్ట్ కాబడిన పార్లమెంట్ సభ్యుడు – డాక్టర్ మేల్కాటే.
  • అటువంటి సమయంలోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి బలపరచిన లక్ష్మీనారాయణ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయం కూడా తెలంగాణవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది.

కొత్తగూడెం కాల్పులు – 1969 ఆగస్టు 6

  • కొత్తగా హోం మినిస్టర్ పదవి చేపట్టిన జలగం వెంగళ్ రావు సభలో నిరసన వ్యక్తం చేసిన ప్రజలపై “ఆగస్టు 6′ న కొత్తగూడెంలో పోలీసులు కాల్పులు జరిపారు.
  • ఈ కాల్పులలో మరణించిన విద్యార్థులు : * రాంచందర్ * దస్తగీర్.

ఉద్యమ విరమణ ప్రకటన

  • హైదరాబాద్ నగరానికి విడిదికి వచ్చిన రాష్ట్రపతి వి.వి.గిరి తో మర్రిచెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీలు తెలంగాణ ఉద్యమంపై చర్చించారు.
  • ఈ చర్చ అనంతరం 1969 సెప్టెంబర్ 23న విద్యార్థులు తరగతులకు హజరుకావాలని ‘తెలంగాణ ప్రజాసమితి’ మరియు ‘విద్యార్థుల కార్యచరణ సమితి’ ప్రకటించింది
  • ఈ ప్రకటనపై సంతకం చేసిన నాయకులు : మర్రి చెన్నారెడ్డి, మల్లిఖార్జున్

తెలంగాణ ప్రజాసమితి ప్రథమ రాష్ట్రస్థాయి సభలు: 

  • ఈ సభలు మర్రి చెన్నారెడ్డి అధ్యక్షతన 1970 జనవరి 10న సికింద్రాబాద్ లోని బాయ్స్ స్కాట్ కేంద్ర కార్యాలయం వద్ద ప్రారంభించబడ్డాయి
  • ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు – నగరి కృష్ణ,
  • ఈ మహాసభలకు ప్రత్యేక ఆహ్వానితుడుగా బ్రిటన్ కి చెందిన లేబర్ పార్టీ ఎం.పి. గ్రే హాజరయ్యారు.
  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిపై రిఫరెండం జరగాలని ఈ సమావేశాల్లోనే మర్రి చెన్నారెడ్డిగారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇ) పోటీ తెలంగాణ ప్రజాసమితి పాత్ర

  • 1969 మేలో చెన్నారెడ్డి ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షుడయ్యాడు.
  • మర్రిచెన్నారెడ్డి అధ్యక్షతను వ్యతిరేకిస్తూ విద్యార్థులు శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ‘పోటీ తెలంగాణ ప్రజాసమితి’ ఏర్పరిచారు.
  • ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తయినందుకు పోటీ తెలంగాణ ప్రజాసమితి వారు 1970 జనవరి 15న కేశవ మెమోరియల్ గ్రౌండ్లో బహిరంగ సభను నిర్వహించారు.
  • ఈ సభకు పోటీ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు ఎం.శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించాడు.

Download: 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర

 

మునుపటి అంశాలు : 

 1969 ఉద్యమానికి కారణాలు

1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,

తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956

తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952

 

More Important Links on TSPSC :

Telangana State GK 
Polity Study Material in Telugu
Economics Study Material in Telugu

 

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర_70.1

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Telangana Movement & State Formation, 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.