Telangana Movement & State Formation : Most important and prestigious exams in Telangana are TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc. Many hopefuls are interested in entering these prestigious jobs.Due to the high level of competition, one can opt for high weightage related subjects and get a job with smart study.We provide Telugu study material in pdf format all aspects of Telangana Movement & State Formation that can be used in all competitive exams like TSPSC Group-1,2,3, 4, Police, Revenue etc.
Telangana Movement & State Formation తెలంగాణ భావజాల వ్యాప్తి
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Movement & State Formation (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు PDF తెలుగులో)
TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
Telangana Movement & State Formation , తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సంస్థల కృషి
తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్:
- 1992లో మనోహర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ను ప్రారంభించాడు.
- పి.జి.సిలబస్ లో ఆధునిక తెలంగాణ సాహిత్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజలమనిషి అనే నవలను చేర్చాలని ఉద్యమించి విజయం సాధించారు.
- ఈ ఆర్గనైజేషన్ ఉస్మానియా క్యాంపస్ లో 1993 ఏప్రిల్ 4,5 తేదీలలో చిన్న రాష్ట్రాల సదస్సును నిర్వహించింది.
- ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ పార్టీ నాయకుడు – జార్జ్ ఫెర్నాండేజ్
- తెలంగాణలోని ఎయిడెడ్ కళాశాలల్లో ఉన్న బ్యాక్ లాగ్ ఖాళీలను పూరించడానికి ఆంధ్ర ప్రాంతం వారిని తెలంగాణకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
- ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా 1994లో మనోహర్ రెడ్డి నిరాహారదీక్ష చేశాడు.
- ఈ నిరాహారదీక్షకు తలొగ్గిన ప్రభుత్వం బదిలీలను నిలిపివేసింది.
TSPSC Group 1 Notification 2022
తెలంగాణ ఉద్యమ వేదికలు :
- తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో పలువురు తెలంగాణ వాదులు వివిధ జిల్లాలలో, వివిధ పేర్లతో ఉద్యమ వేదికలను ఏర్పాటు చేశారు.
- తెలంగాణ చైతన్యవేదిక – మెదక్
- తెలంగాణ ఉద్యమవేదిక – మహబూబ్ నగర్
- తెలంగాణ పోరాట వేదిక – నల్గొండ
- తెలంగాణ ప్రజావేదిక – రంగారెడ్డి
సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ :
- రాష్ట్రంలోని సినిమా, వార్తాపత్రికలు, ఇతర మీడియా సంస్థలు తెలంగాణేతరుల చేతులలో ఉండడం వలన వారు తెలంగాణ పట్ల కొంత వ్యతిరేకంగా ప్రవర్తించారు.
- ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి ప్రపంచ దృష్టికి వాస్తవాలను అందించడానికి ప్రజాసంఘాల నాయకులు ప్రయత్నించారు.
- ఈ ప్రయత్నాలలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1997లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ను స్థాపించారు.
TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies
తెలంగాణ ప్రగతి వేదిక
- తెలంగాణ సమస్యలపై చర్చించడానికి 1997 జూలెలో రెండు రోజుల సదస్సు రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్లో జరిగింది.
- ఈ సదస్సు అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997 జూలై 13న ఏర్పడింది.
- ఈ వేదిక బతకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
- ఆ తరువాతి కాలంలో తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భవించడంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులో ఒక భాగస్వామి సంస్థగా పనిచేసింది.
తెలంగాణ స్టడీస్ ఫోరం:
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ స్టడీస్ ఫోరం 1998 లో ఏర్పాటయింది.
- ఈ ఫోరం ఏర్పాటులో కీలకపాత్రను పోషించినవారు : గాదె ఇన్నయ్య, నిర్మల, పిట్టల శ్రీశైలం
- ఈ ఫోరం తెలంగాణ సమస్యలపై కరపత్రాలు, పుస్తకాలను ముద్రించి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం వరకు అలుపెరగని పోరాటాన్ని కొనసాగించింది.
ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్ సభా
- 1997లో హైదరాబాద్ లోని మొజాంజాహి మార్కెట్ దగ్గర గల అశోక్ థియేటర్ లో ‘ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్’ పేరుతో సభను నిర్వహించారు.
- జర్నలిస్టు గూలాం రసూల్ ఖాన్ ఎన్ కౌంటర్ ను ఖండించడానికి కవులు, కళాకారులు ఈ సభను నిర్వహించారు.
- ఈ సభలో గద్దర్ తను రాసిన ‘అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా‘ పాటను మొదటిసారిగా పాడాడు.
- తెలంగాణకు జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలపై ప్రభుత్వ శాఖల నుండి సేకరించిన సమాచారంతో గాదె ఇన్నయ్య ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తకమును ఈ సదస్సులో ఆవిష్కరించారు.
- ఈ సదస్సులోనే భువనగిరి సభ సమావేశాన్ని (1997 మార్చి 8న) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Telangana Health and Family Welfare Department Vacancies 2022
ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ:
- సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ వారికి జరుగుతున్న నష్టాల గురించి చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షతన ఒక అవగాహన సదస్సు జరిగింది.
- ఈ సదస్సుకు ముఖ్య అతిధి – దాశరధి కృష్ణమాచార్యులు.
- ఈ సదస్సులోనే ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ అనే ప్రజాసంఘం ఏర్పడింది.
- దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ జి. లక్ష్మణ్ నియమితులయ్యారు.
- నూతన సంవత్సరం సందర్భంగా 1988లో తెలంగాణ మ్యాప్ తో కూడిన మాతెలంగాణ గ్రీటింగ్స్ ను పంపిణీ చేసింది.
- అంతేగాకుండా క్యాలెండర్ను కూడా విడుదల చేసింద
- తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తో కలిసి ఓ.యు. ఫోరం ఫర్ తెలంగాణ కాళోజీ చేతుల మీదుగా ‘తెలంగాణ పొలిటికల్ మ్యాప్’ను విడుదల చేసింది.ఇదే తెలంగాణ మొదటి పొలిటికల్ మ్యాప్ అని చాలామంది పేర్కొంటున్నారు.
- ఈ ఫోరం సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, నవంబర్ 1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఉస్మానియాలో అవగాహన సదస్సులు నిర్వహించింది.
- అదేవిధంగా ఈ ఫోరం చిన్న రాష్ట్రాల సదస్సులను 1988, 1996 లలో నిర్వహించింది.
- ఈ సదస్సులలో పాల్గొన్న ముఖ్యనాయకులు : జార్జ్ ఫెర్నాండెజ్ , టూమర్ (నాగాలాండ్)
- ఈ సంస్థ విద్యార్థులలో, అధ్యాపకులలో భావజాలం వ్యాప్తి చేయడంలో క్రియాశీలకపాత్ర పోషించింది.
- ఈ సంస్థ టి.ఆర్.ఎస్. పార్టీ ఏర్పడిన సమయంలో ఆ పార్టీపై అవగాహన కల్పించడానికి 2001 మే లో ఠాగూర్ ఆడిటోరియంలో కె.సి.ఆర్. ను ఆహ్వానించి భారీ సభను నిర్వహించింది.
మంజీర రచయితల సంఘం – సిద్దిపేట సదస్సు:
- 1997 ఆగస్టు నెలలో రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సిద్దిపేట పట్టణంలో సదస్సును నిర్వహించారు.
- ఈ సభ సమావేశంలోనే నందిని సిధారెడ్డి రాసిన ‘నాగేటి సాళ్లల్ల – నా తెలంగాణ’ పాట వచ్చింది.
- ఈ విధంగా తెలంగాణ భావజాల ప్రచారం కోసం 1990 నుండి 1997 వరకు తెలంగాణలోని ప్రధాన నగరాలలో చాలా సమావేశాలు జరిగాయి.
మల్లేపల్లి రాజం ట్రస్ట్
- మల్లేపల్లి లక్ష్మయ్యకు చిన్నాన్న అయిన మల్లేపల్లి రాజం యొక్క స్మారకార్థం ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున తన స్వగ్రామమైన జనగామాలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించేవారు.
- ఆ విధంగా 1997 జనవరిలో జయశంకర్ సార్ తో స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఏమి జరుగుతున్నది అనే అంశంపై జయశంకర్సార్ ఉపన్యసించారు.
- ఉద్యమానికి ఈ ఉపన్యాస అవసరాన్ని గుర్తించిన మల్లేపల్లి లక్ష్మయ్య ఈ ఉపన్యాసాన్ని ” తెలంగాణ లో ఏం జరుగుతుంది?” అనే పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు.
- ఈ పుస్తకమును జనవరిలో అశోక థియేటర్ (హైదరాబాదు)లో జరిగిన తెలంగాణ సభ ఆవిష్కరించారు.
TSPSC Group 4 Recruitment 2022 Apply for 9168 Posts, Notification
మునుపటి అంశాలు :
జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు
1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర
1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952