Telugu govt jobs   »   Daily Quizzes   »   AP History MCQs Questions And Answers...

AP History MCQs Questions And Answers In Telugu, 25th September 2023 For APPSC GROUPs & AP Police Constable

AP History MCQ Quiz in Telugu: Welcome to Adda 247. ADDA 247 Telugu is giving you AP History MCQ in Telugu for all competitive exams including   APPSC GROUPs & AP Police Constable. Here you get AP History Multiple Choice Questions and Answers with Solutions every day. these questions are very unique and very helpful for those who are preparing for Competitive Exams. Practice daily basis and know your knowledge about AP History in Telugu for competitive exams. Study these History MCQs regularly and succeed in the exams.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు AP పోలీస్, TS పోలీస్ లాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు. దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పాలిటీ, చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, పర్యావరణ శాస్త్రం సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. ఈ ప్రశ్నలు చాలా ప్రత్యేకమైనవి మరియు కామెటిటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రోజూ ప్రాక్టీస్ చేయండి మరియు పోటీ పరీక్షల కోసం తెలుగులో పాలిటీ గురించి మీ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఈ పాలిటీ MCQలను క్రమం తప్పకుండా అధ్యయనం చేయండి మరియు పరీక్షలలో విజయం సాధించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

AP History MCQs Questions And Answers in Telugu

QUESTIONS 

Q1. కందుకూరి వీరేశలింగం గారు తొలి వితంతువు వివాహాన్ని ఏ రోజున జరిపించారు?

  1. డిసెంబర్ – 10 – 1881
  2. డిసెంబర్ – 11 – 1881
  3. డిసెంబర్ – 12 – 1881
  4. డిసెంబర్ – 13 – 1881

Q2. జస్టిస్ పార్టీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

  1. 1915
  2. 1916
  3. 1917
  4. 1918

Q3. 1934లో ఏర్పడిన రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది?

  1. కడప
  2. అనంతపురం
  3. మద్రాస్
  4. కర్నూలు

 Q4. శ్రీ బాగ్ ఒప్పందం ఏ నాయకులు మధ్య జరిగింది?

  1. ఆంధ్రతెలంగాణ
  2. తెలంగాణరాయలసీమ
  3. ఆంధ్రతమిళ
  4. ఆంధ్రరాయలసీమ

Q5. కాకతీయుల కాలంలో మొట్టమొదటి ముస్లింల దాడి ఏ సంవత్సరంలో జరిగింది?

  1. 1301
  2. 1301
  3. 1303
  4. 1304

Q6. నందంపూడి అగ్రహారం ఈ క్రింది వానిలో ఎవరికి ఇవ్వబడింది?

  1. నన్నయ్య
  2. నారాయణ బట్టు
  3. పావులూరి మల్లన్న
  4. పాల్కురికి సోమనాథుడు

Q7. కాకతీయుల కాలం నాటి నాట్యం, సంగీతం గురించి ఈ క్రింది ఏ శాసనం పేర్కొంటుంది?

  1. బీదర్ కోట శాసనం
  2. మల్కాపురం శాసనం
  3. వరంగల్ శాసనం
  4. మోటుపల్లి అభయ శాసనం

Q8. విజయనగర సామ్రాజ్య చరిత్రకు ప్రధాన ఆధారమైన గ్రంధం ఈ క్రింది వానిలో ఏది?

  1. మను చరిత్ర
  2. ఆముక్త మాల్యాద
  3. పాండురంగ మహత్యం
  4. ఫర్ గాటెన్ ఎంపీరియర్

 Q9. పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో గల విద్యాధికారి ఎవరు?

  1. విద్యనాథుడు
  2. త్రినాధుడు
  3. శ్రీ నాథుడు
  4. ఎర్రా ప్రగడ

Q10. ప్రముఖమైన అల్లూరి శాసనం ఈ క్రింది ఏ రాజ వంశం కాలం నాటిది?

  1. తూర్పు చాళుక్యులు
  2. కాకతీయులు
  3. ఇక్ష్వాకులు
  4. రెడ్డి రాజులు

SOLUTIONS

S1.Ans(b)

Sol: వితంతు పునర్వివాహ చట్టాన్ని 1856 లో లార్డ్ డల్హౌసి కాలంలో రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ చట్టం ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన మొదటి వివాహము డిసెంబర్ – 11 – 1881 న రాజమండ్రిలో జరిగింది. కందుకూరి వీరేశలింగం ఈ వివాహాన్ని గోగులపాటి శ్రీరాములు, సీతమ్మకు జరిపించారు.

S2.Ans(c)

Sol: బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ. దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి పానుగల్ రాజా. జస్టిస్ పార్టీని 1917లో ఏర్పాటు చేశారు. దీని మొదటి సమావేశం 1917 జులై 19న కోయంబత్తూర్ లో జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది పానుగల్ రాజా.

S3.Ans(c)

 Sol: రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి K. సుబ్రహ్మణ్యం, C.L నరసింహారెడ్డి 1934లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని మొదటి సమావేశం 1934 జనవరి 28వ తేదీన మద్రాసులో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది నెమలి పట్టాభి రామారావు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. దీని యొక్క రెండో సమావేశం 1935 సెప్టెంబర్ మొదటి వారంలో కడపలో జరిగింది.

S4.Ans(d)

Sol: మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావు ఇంటి వద్ద 1937 – నవంబర్ – 16 న ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా 1937 లో దీపావళి పండుగను ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం గా జరుపుకున్నారు. శ్రీ బాగ్ ఒప్పందం ఆధారంగా 1952 – సెప్టెంబర్ – 2 తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.

S5.Ans(c)

Sol. కాకతీయుల కాలంలో మొట్టమొదటి ముస్లింల దాడి 1303 లో జరిగింది. ఈ మొదటి దాడిలో ముస్లిం వర్గానికి ఫక్రుద్దీన్ జునా నాయకత్వం వహించాడు. కానీ ఈ తిరుగుబాటు విజయవంతం కాలేదు. మొత్తంగా కాకతీయులపై ముస్లింలు 5 సార్లు దండయాత్ర చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర వల్ల 1323 లో కాకతీయ సామ్రాజ్యము ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో అంతర్భాగమైంది. కాకతీయుల కాలంలో జరిగిన మొట్టమొదటి ముస్లింల దాడి రెండో ప్రతాపరుద్రుడి కాలంలో జరిగింది.

 S6.Ans(b)

Sol. తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు తన ఆస్థానములోని నారాయణ భట్టుకు నందంపూడి అగ్రహారం ఇచ్చాడు. మహాభారత రచనల్లో నన్నయకు సహకరించినందుకు. మహాభారతంలో మొత్తం 18 పర్వాలు కలవు. ఎక్కువ భాగాన్ని తిక్కన రచించాడు.

మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు నన్నయ్య, తిక్కన , ఎర్రన.

S7.Ans(b)

Sol: కాకతీయుల కాలం నాటి నాట్యం, సంగీతం గురించి మల్కాపురం శాసనంలో పేర్కొనడం జరిగింది. ఈ శాసనాన్ని వేయించినది గణపతి దేవుని కుమార్తె అయిన రుద్రమదేవి. రుద్రమదేవి యొక్క గురువు విశ్వేశ్వర శివాచార్యుడు. ఈయనకు మందడ అనే గ్రామాన్ని దానం చేయడం జరిగింది. ఈ మల్కాపురం శాసనంలోనే ప్రసూతి గృహం గురించి పేర్కొన్నారు.

S8.Ans(d)

Sol: విజయనగర చరిత్రకు అతి ముఖ్యమైన ఆధార గ్రంధం ఫర్ గాటెన్ ఎంపీరియర్. దీని రచయిత  రాబర్ట్ సీవెల్. విజయనగర సామ్రాజ్యం 1336 లో ఏర్పాటు చేశారు. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం నాలుగు రాజవంశాలు పరిపాలించాయి. వాటిలో ఎక్కువ కాలం పరిపాలించిన వంశం సంఘము వంశం. ప్రముఖమైన శ్రీకృష్ణదేవరాయలు తుళువ అంశానికి చెందినవాడు.

S9.Ans(c)

Sol: పెద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా శ్రీనాధుడు పనిచేశాడు. శ్రీ నాథుడికి గల ప్రముఖమైన బిరుదు కవి సార్వభౌమ. ఈ బిరుదును రెండవదేవరాయల ఆస్థానంలో ఉన్న గౌడ  డిండిమ భట్టును ఓడించి కవి సార్వభౌమ అనే బిరుదును పొందాడు. ఈ బిరుదును రెండవదేవరాయలు చేతుల మీదుగా పొందుకున్నాడు.

S10.Ans(c)

Sol: ప్రముఖమైన అల్లూరి శాసనం ఇక్ష్వాకుల కాలంలో వేయబడింది. ఇక్ష్వాకులలో ప్రముఖ రాజు అయిన వీర పురుష దత్తుడు అల్లూరి శాసనాన్ని వేయించాడు. ఇతని పాలనా కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఇతని కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం అత్యధికంగా వ్యాప్తి చెందింది. అందువల్లనే ఇతనిని దక్షిణాది అశోకుడు అంటారు. ఇతనికి గల ప్రముఖమైన బిరుదులు శ్రీ పర్వతాధిపతి, దక్షిణాది అశోకుడు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website