AP History MCQ Quiz in Telugu: Welcome to Adda 247. ADDA 247 Telugu is giving you AP History MCQ in Telugu for all competitive exams including AP Police Constable & APPSC GROUPs. Here you get AP History Multiple Choice Questions and Answers with Solutions every day. these questions are very unique and very helpful for those who are preparing for Competitive Exams. Practice daily basis and know your knowledge about AP History in Telugu for competitive exams. Study these History MCQs regularly and succeed in the exams.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు AP పోలీస్, TS పోలీస్ లాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు. దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పాలిటీ, చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, పర్యావరణ శాస్త్రం సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. ఈ ప్రశ్నలు చాలా ప్రత్యేకమైనవి మరియు కామెటిటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రోజూ ప్రాక్టీస్ చేయండి మరియు పోటీ పరీక్షల కోసం తెలుగులో పాలిటీ గురించి మీ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఈ పాలిటీ MCQలను క్రమం తప్పకుండా అధ్యయనం చేయండి మరియు పరీక్షలలో విజయం సాధించండి.
AP History MCQs Questions And Answers in Telugu
QUESTIONS
Q1. కాంగ్రెస్ సంస్థ ఉండగా హోంరూలు లీగ్ అవసరమేమిటని ప్రశించిన పత్రిక
(a)కృష్ణా పత్రిక
(b) ఆంధ్రపత్రిక
(c) గౌతమీ పత్రిక
(d) శశి రేఖ పత్రిక
Q2. వెనీసు బాటసారి మార్కోపోలో ఏ సంవత్సరంలో తూర్పుతీర రేవుపట్టణం మోటుపల్లి దగ్గర దిగి కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల్ని వివరించినాడు.
(a) క్రీ.శ. 1292
(b) క్రీ.శ. 1294
(c) క్రీ.శ. 1296
(d) క్రీ.శ. 1298
Q3. A)కందుకూరి 1874 లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పాడు .
B) పెద్దాపురం రాజా ఇచ్చిన పదివేల ధనంతో రాజమండ్రిలో స్త్రీల విద్యకోసం ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పాడు .
(a)A,B సరైనవి
(b) A,B సరి కాదు
(c) A సరి కాదు,B సరైనది
(d) A సరైనది,B సరి కాదు
Q4.కందుకూరి వీరేశలింగం ఎవరి వద్ద సంస్కృతం నేర్చుకునే వాడు
(a) దూసి సోమయాజులు
(b)సామినేని ముద్దు నరసింహం
(c) ఏనుగు వీరయ్య
(d)పురాణపండ రామ దీక్షుతులు
Q5. అభ్యుదయ రచయితల సంఘం 1943 లో ఏర్పడింది . దీని ప్రధమాధ్యక్షులు
(a) తాపీ ధర్మారావు
(b)శ్రీశ్రీ
(c) ఆరుద్ర
(d) సి.నా.రె
Q6.’’వాస్తవికతతోపాటు అధివాస్తవికతను , వ్యక్తి చైతన్యంతోపాటు సంఘచైతన్యమును సమానాధికారంతో ప్రవచించిన ప్రవక్త శ్రీ శ్రీ’’ అని ఎవరు ప్రశంసించారు .
(a) సి.నారాయణరెడ్డి
(b)విశ్వనాధ సత్యనారాయణ
(c)చెర బండ రాజు
(d) తెన్నేటి విశ్వనాధం
Q7.ఆంధ్ర రాష్ర ఏర్పాటు సమయంలో హైకోర్టు గుంటూరులో ఏర్పరచాలని ఆంధ్ర శాసనసభ ఏ సంవత్సరంలో తీర్మానించింది
(a) 1955
(b) 1954
(c) 1958
(d) 1956
Q8. ‘వేదాంత రసాయనం‘ అనే క్రైస్తవ గ్రంథాన్ని రచించిన వారు
(a) మంగళగిరి ఆనందరావు
(b) శేషగిరి శాస్త్రి
(c) షుల్జ్
(d) మార్తిమం రోజర్
Q9.1907 బిపిన్ చంద్ర పాల్ రాజమండ్రి పర్యటన సమయానికి రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు ?
(a) లైడింగర్
(b) మార్క్ వాంటర్
(c)స్కాట్
(d)సాడ్లింగ్
Q10. ” గురజాడ తెలుగు సారస్వతానికి సరిహద్దు ” అని అన్న వారు
(a) దాశరధి
(b) గిడుగు వెంకటరామమూర్తి
(c) ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
(d) నార్ల వెంకటేశ్వరరావు గారు
Solutions:
S1.Ans(b)
Sol.కాంగ్రెస్ సంస్థ ఉండగా హోంరూలు లీగ్ అవసరమేమిటని ఆంధ్రపత్రిక ప్రశించింది .
S2.ans.(a)
Sol. వెనీసు బాటసారి మార్కోపోలో ఏ సంవత్సరంలో తూర్పుతీర రేవుపట్టణం మోటుపల్లి దగ్గర దిగి కాకతీయ సామ్రాజ్య పరిస్థితుల్ని వివరించినాడు. – క్రీ.శ. 1292
S3.ans.(d)
sol.కందుకూరి 1874 లో ధవళేశ్వరంలో బాలికల పాఠశాలను నెలకొల్పాడు . పిఠాపురం రాజా ఇచ్చిన పదివేల ధనంతో రాజమండ్రిలో స్త్రీల విద్యకోసం ఒక ఉన్నత పాఠశాలను నెలకొల్పాడు .
S4.ans.(a)
sol. కందుకూరి వీరేశలింగం ఎవరి వద్ద సంస్కృతం నేర్చుకునే వాడు – దూసి సోమయాజులు
S5.ans(a)
sol. అభ్యుదయ రచయితల సంఘం 1943 లో ఏర్పడింది . దీని ప్రధమాధ్యక్షులు – తాపీ ధర్మారావు
S6.ans(a)
sol. .‘’వాస్తవికతతోపాటు అధివాస్తవికతను , వ్యక్తి చైతన్యంతోపాటు సంఘచైతన్యమును సమానాధికారంతో ప్రవచించిన ప్రవక్త శ్రీ శ్రీ’’ అని ఎవరు ప్రశంసించారు .- సి.నారాయణరెడ్డి
S7.ans(b)
Sol. ఆంధ్ర రాష్ర ఏర్పాటు సమయంలో హైకోర్టు గుంటూరులో ఏర్పరచాలని ఆంధ్ర శాసనసభ 1954 లో తీర్మానించింది.
S8.ans(a)
sol. ‘వేదాంత రసాయనం‘ అనే క్రైస్తవ గ్రంథాన్ని రచించిన వారు – మంగళగిరి ఆనందరావు
S9.ans(b)
sol. 1907 బిపిన్ చంద్ర పాల్ రాజమండ్రి పర్యటన సమయానికి రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ ఎవరు ?- మార్క్ వాంటర్
S10.ans(c)
Sol. ” గురుజాడ తెలుగు సారస్వతానికి సరిహద్దు ” అని ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ప్రసంశించారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |