Telugu govt jobs   »   State GK   »   Telangana Movement and State Formation

Telangana Movement and State Formation- KCR fast unto death | కె.సి.అర్ ఆమరణ నిరాహార దీక్ష

On Nov 29th, 2009 , KCR had announced an indefinite hunger strike demanding statehood to Telangana. But enroute, the state police had arrested him and sent to Khammam sub-jail. The movement spread like wildfire with students, Empl​​oyees, peoples’ organizations plunging into it. In the next 10 days, the whole of Telangana region came to a standstill. in this article we are providing details related to Telangana Movement and State Formation- KCR fast unto death. for more details read the article completely.

Telangana Movement and State Formation: KCR fast unto death | కె.సి.అర్ ఆమరణ నిరాహార దీక్ష

2009 ఎన్నికలు – పార్టీలు

  • రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. 
  • సామాజిక న్యాయం పేరుతో నటుడు చిరంజీవి 2008, ఆగస్టు 26న ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సామాజిక తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.
  • 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాల కూటమి కలిసి పోటీచేసింది.
  • అనంతర పరిస్థితుల్లో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ కు దూరమయ్యాయి.
  • 2009 జనవరి 16న తన ‘తల్లి తెలంగాణ పార్టీ’ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు విజయశాంతి ప్రకటించారు.
  • 2009 జనవరి 31న టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఉమ్మడిగా ‘మహాకూటమి’పేరుతో ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీలు నిర్ణయించాయి. ఈ పొత్తులో జయశంకర్ సార్ కీలకంగా వ్యవహరించారు.
  • తెలంగాణకు తాను అనుకూలమని, తెలంగాణపై సంయుక్త సంఘాన్ని (Joint Committee) ఏర్పాటు చేస్తున్నట్లు 2009, ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి వైఎస్ హడావుడిగా ప్రకటించారు.
  • ‘తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ కు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ 2009, ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రకటించారు.

AP State GK MCQs Questions And Answers in Telugu ,19 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

ఎన్నికల మేనిఫెస్టోలు

  • టీడీపీ (TDP) – తన ఎన్నికల మానిఫెస్టోలో తొలిసారిగా తెలంగాణ అంశాన్ని చేర్చింది.
  • బీజేపీ (BJP) – మరోసారి చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి ప్రస్తావించింది.
  • సీపీఐ (CPI) – జాతీయ విధానం రాష్ట్ర విభజనకు వ్యతిరేకమైనా, చిన్న రాష్ట్రాల ఏర్పాటును సమర్థించకపోయినా, తెలంగాణకు సంబంధించినంత వరకూ జాతీయ కార్యవర్గం మినహాయింపు నిచ్చింది.
  • సీపీఎం (CPM)-రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో ప్రకటించింది.
  • బీఎస్పీ (BSP)-చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాము సుముఖమని మేనిఫెస్టోలో ప్రకటించింది.
  • ప్రజారాజ్యాం – సామాజిక తెలంగాణకు తామ కట్టుబడి ఉన్నట్లు తన మేనిఫెస్టోలో పేర్కొంది. “

 

ఎన్నికలలో కాంగ్రెస్ విజయం

  • ఏప్రిల్ 16న తెలంగాణలో మొదటి దశలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. 
  • ఆ తర్వాత ఆంధ్రా ప్రాంతంలో వైఎస్సార్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రసంగించారు .
  • 2009లో కాంగ్రెస్ పార్టీ 152 సీట్లు మాత్రమే గెలుచుకొని తిరిగి అధికారంలోకి వచ్చింది.
  • టి.ఆర్.ఎస్ కు రెండు ఎం.పి.స్థానాలు, 10 అసెంబ్లీ వచ్చాయి.

KCR fast unto death | కె.సి.అర్ ఆమరణ నిరాహార దీక్ష

  • ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని కె.సి.ఆర్ ప్రకటించి నవంబర్ 29 2009 నుండి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు
  • కె.సి.ఆర్. దీక్ష స్థలం – రంగథాంపల్లి (సిద్దిపేట)
  • నవంబర్ 29న కె.సి.ఆర్ కరీంనగర్ నుండి రంగథాంపల్లి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.
  • కె.సి.ఆర్. ఖమ్మం జైలులోనే దీక్ష ప్రారంభించారు.
  • ఈ పరిణామాల వల్ల “శ్రీకాంతాచారి” అనే యువకుడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
  • 2009 డిసెంబర్ 4న శ్రీకాంతాచారి అమరుడయ్యారు.
  • ఈ ఉద్యమ తీవ్రతను గ్రహించిన ముఖ్యమంత్రి రోశయ్య 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
  • ఈ సమావేశానికి 9 రాజకీయ పార్టీలు హజరయ్యాయి.
  • డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబునాయుడు మద్దతు ప్రకటించారు.
  • మొదటి నుండి సమైక్యాంధ్రకు అనుకూలమైన ఎమ్. ఐ.ఎమ్., సి.పి.ఐ.(ఎమ్) తప్ప మిగిలిన పార్టీలు అన్నీ తెలంగాణకు మద్దతిచ్చాయి.
  • 2009 డిసెంబర్ 8న నీమ్స్, సూపరిండెంట్ ప్రసాదరావు కె.సి.ఆర్ దీక్ష విరమించకపోతే జీవితం ప్రమాదంలో పడుతుందని ప్రకటన విడుదల చేశారు.
  • డిసెంబర్ 9 నాడు ప్రధానమంత్రి రష్యాలో, ప్రణబ్ ముఖర్జీ విదేశీ పర్యటనలో ఉన్నారు. దాంతో 2009 డిసెంబర్ 9 నాడు కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన ఏవిధంగా ఉండాలి అనే విషయంపై ప్రొ॥ జయశంకర్ సార్ తో చర్చించారు.
  • అనంతరం 2009 డిసెంబర్ 9 రాత్రి 11.30గంటలకు హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై క్రింది విధంగా ప్రకటన జారీ చేశారు
  • మొదటి ప్రకటన – “తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు” అని చిదంబరం పేర్కొన్నారు.
  • తెలంగాణ ఏర్పాటు పై చిదంబర ప్రకటన అనంతరం కె.సి.ఆర్.తో ప్రొ|| జయశంకర్ సార్ నిరాహార దీక్ష విరమింపజేసినారు.
  • తరువాత ఆంధ్రాలో జరిగిన సంఘటనల ఫలితంగా తిరిగి కేంద్ర హోంమంత్రి చిదంబరం డిసెంబర్ 23న మరొక ప్రకటనను జారీ చేశారు.
  • రెండవ ప్రకటన – “అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం” అని పేర్కొన్నారు.

Political Joint Action Committee | రాజకీయ ఐక్య కార్యా చరణ కమిటీ

  • 2009 డిసెంబర్ 24వ తేదిన తెలంగాణ కోసం రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది.
  • డిసెంబర్ 25, 2009న బంజారా హిల్స్ లోని రావి నారాయణ రెడ్డి హాలులో జె.ఎసీ. స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది.
  • జేఏసీ కన్వీనర్ గా ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ (రాజనీతిశాస్త్ర ఆచార్యుడు – Political Science) ఏకగ్రీవంగా ఎంపికైనాడు.
  • జేఏసీ కో కన్వీనర్- మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ జర్నలిస్టు
  • దీనిలో చేరిన పార్టీలు – టీఆర్ఎస్, కాంగ్రెస్ (తెలంగాణ), తెలంగాణ టీడీపీ ఫోరం, బీజేపీ, సీపీఐ, న్యూ డెమోక్రసీ
  • 2010 ఫిబ్రవరి 19న రాజకీయ ఐక్యకార్యాచరణ కమిటీ (Political JAC) నుండి కాంగ్రెసు తప్పుకుంది.
  • మార్చి 12, 2010న తెలంగాణ జేఏసీ సమావేశం జరిగింది. దీనికి కె.సి.ఆర్ హాజరైనాడు. తెలంగాణ జేఏసీ నుంచి టీడీపీని బహిష్కరించటం జరిగింది.

Justice Sri Krishna Committee | శ్రీ కృష్ణ కమిటీ

  •  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఫిబ్రవరి 3, 2010లో ఏర్పడింది.
  • కమిటీ చైర్మన్ : జస్టిస్ బి.ఎన్ శ్రీకృష్ణ (రిటైర్డు) సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • కమిటీ సభ్యులు –
  • 1) ప్రో,, రణబీర్ సింగ్, వెస్ ఛాన్సలర్, జాతీయ న్యాయ కళాశాల ఢిల్లీ
  • 2) డా. అబుసలేషరీప్, సీనియర్ ఫెలో, జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా సంస్థ, ఢిల్లీ
  • 3) ప్రొఫెసర్ డా. రవీందర్ కౌర్ సాంఘిక శాస్త్ర విభాగం, ఐఐటి ఢిల్లీ
  • కమిటీ కార్యదర్శి  – వినోద్ కుమార్ దుగ్గల్ (రిటైర్డు ఐ.ఎ.ఎస్)
  • ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 31లోపు అందించాలని కేంద్రం నిర్దేశించింది.
  •  ఈ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 30న కేంద్రానికి అందజేసింది.

కమిటీ ప్రతిపాదనలు 

  • ఈ కమిటీ తన మొదటి సమావేశం ఫిబ్రవరి 13, 2010న ఢిల్లీలో జరిగింది.
  • శ్రీకృష్ణ కమిటీ నివేదికలో 505 పేజీలు, 9 చాప్టర్లు ఉన్నాయి.
  1. ఉద్యమాన్ని సాధారణ శాంతిభద్రతల పరిస్థితిగా పరిగణించి కేంద్రం సాధారణ మద్దతు తీసుకుంటూ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవడం
  2. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాతం
  3. హైదరాబాద్ రాజధానిగా రాయలసీమ, తెలంగాణలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు.
  4. ప్రత్యేక తెలంగాణ, పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు. గుంటూరు, కర్నూలు, నల్లగొండ, మహబూబ్ నగర్జి ల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుకుని హైదరాబాదు పెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం.
  5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తి
  6. ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి రాజ్యాంగబద్ద రక్షణను కల్పించడం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం.
  • ఈ కమిటీ 6వ అంశాన్ని తమ తొలి ప్రాధాన్యత అంశంగా పేర్కొంది. అంటే పరోక్షంగా సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించింది.
  • ఒకవేళ 6వ అంశం అమలు చేయడం సాధ్యం కాకపోతే రెండవ ప్రాధాన్యత 5వ అంశం అని పేర్కొంది.
  • 8వ అధ్యాయంను రహస్యంగా ఉంచి హెూంమంత్రికి సమర్పించింది
  • 8వ అధ్యాయ, బహిర్గతంపై కోర్టులో తెలంగాణ వాది అయిన నిజామాబాద్ మాజీ ఎంపీ కేసు వేశాడు
  • 2011 మార్చి 23న హైకోర్టు న్యాయమూర్తి ఎల్. నర్సింహ్మారెడ్డి 8వ అధ్యాయంలోని కొన్ని అంశాలను కోడ్ చేస్తూ తీవ్ర విమర్శలతో కూడిన తీర్పు ఇచ్చారు
  • కానీ ఈ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది

అఖిలపక్ష సమావేశం(2012 డిసెంబర్ 28)

  • డిసెంబర్ 28, 2012న కేంద్ర హోం శాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్యపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 
  • ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్న 8 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి.
  • 1. కాంగ్రెసు(ఐ) 2. తెలుగుదేశం పార్టీ 3. తెలంగాణ రాష్ట్ర సమితి 4. భారతీయ జనతాపార్టీ 5. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 6. సి.పి.ఐ. (ఎమ్) 7. మజ్లిస్ 8. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ

అఖిలపక్ష భేటీకి హాజరైన పార్టీల ప్రతినిధులు

  • టీ.ఆర్.ఎస్ (TRS) – కేసీఆర్, నాయిని నర్సింహారెడ్డి
  • టి.డీ.పీ (TDP) – యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి
  • వై.సీ.పీ (YCP) – మైసురారెడ్డి, కేకే మహేందర్ రెడ్డి
  • బీజేపీ (BJP) – కిషన్ రెడ్డి, హరిబాబు
  • సీపీఐ (CPI) – నారాయణ, గుండా మల్లేష్
  • సీపీఎం (CPM) – రాఘవులు, జూలకంటి రంగారెడ్డి
  • ఎంఐఎం (MIM) – అక్బరుద్దీన్, అసదుద్దీన్
  • కాంగ్రెస్ (Congres) – కేఆర్ సురేశ్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి

మరింత చదవండి 

తెలంగాణ ఉద్యమం ఆర్టికల్స్ 
తెలంగాణ గుర్తింపుకై ఆరాటం  జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు 
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956 తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,  1969 ఉద్యమానికి కారణాలు
 1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర 1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
నక్సలైట్ ఉద్యమం  


pdpCourseImg

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

When was Telangana formed as a state?

The state of Telangana was officially formed on 2 June 2014. The day marks significance in the state's history for the sustained Telangana movement through the years.

What was KCR's fast unto death?

KCR's fast unto death refers to a hunger strike undertaken by K. Chandrashekar Rao as a protest against the delay in the formation of a separate Telangana state. He demanded that the Indian government address the demands of the Telangana Movement.

How long did KCR's fast unto death last?

KCR's fast unto death lasted for 11 days, ending on December 9, 2009.