APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మారుస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా తనకు వచ్చిన అనేక అభ్యర్థనల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని చెప్పారు. ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు, హాకీలో దేశం కోసం మూడు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్నారు.
అవార్డు గురించి:
ఈ అవార్డు 1991-92లో ప్రారంభించబడింది, ఈ పురస్కారం ఒక పతకం, ఒక ధృవీకరణ పత్రం మరియు 25 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. ఖేల్ రత్న యొక్క మొదటి గ్రహీత చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్. ఇటీవలి సంవత్సరాలలో కొంతమంది విజేతలలో క్రికెటర్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేష్ ఫోగట్, మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ తదితరులు ఉన్నారు.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: