రాణి రాంపాల్ మరియు మన్ ప్రీత్ సింగ్ భారత హాకీ జట్ల కెప్టెన్లుగా ఎంపికయ్యారు
మిడ్ ఫీల్డర్ మన్ ప్రీత్ సింగ్ 16 మంది సభ్యుల ఒలింపిక్-బౌండ్ భారత పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఎంపికకాగా, అనుభవజ్ఞులైన డిఫెండర్లు బీరేంద్ర లక్రా మరియు హర్మన్ ప్రీత్ సింగ్ వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఇది మన్ ప్రీత్ యొక్క మూడవ ఒలింపిక్స్. మన్ ప్రీత్ సారథ్యంలో భారత జట్టు 2017లో ఆసియా కప్, 2018లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ, 2019లో ఎఫ్ ఐహెచ్ సిరీస్ ఫైనల్ గెలుచుకుంది. మన్ ప్రీత్ నేతృత్వంలోని జట్టు భువనేశ్వర్ లో జరిగిన ఎఫ్ ఐహెచ్ పురుషుల ప్రపంచ కప్ 2018 క్వార్టర్ ఫైనల్స్ కు కూడా చేరుకుంది.
మహిళా విభాగంలో
16 మంది సభ్యుల ఒలింపిక్-బౌండ్ భారత మహిళల హాకీ జట్టుకు రాణి రాంపాల్ కెప్టెన్ గా ఎంపికయ్యారని హాకీ ఇండియా ప్రకటించింది. రాణి తన ఆన్-ఫీల్డ్ ప్రతిభకు మాత్రమే కాకుండా జట్టులోని యువకులకు మార్గనిర్దేశం చేసే సహజ సామర్ధ్యం కూడా కలిసి వచ్చింది. రాణి సారథ్యంలో, గత నాలుగు సంవత్సరాలుగా భారత జట్టు 2017 లో ఆసియా కప్ గెలవడం, ఆసియా గేమ్స్ 2018 లో రజతం గెలుచుకోవడం, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2018 లో సిల్వర్ అలాగే 2019 లో ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్ ను గెలుచుకోవడం తో సహా గణనీయమైన ఫలితాలను సాధించింది. రాణి నేతృత్వంలోని జట్టు మొదటిసారి లండన్ లో జరిగిన ఎఫ్ ఐహెచ్ మహిళల ప్రపంచ కప్ 2018లో క్వార్టర్ ఫైనల్స్ కు కూడా చేరుకుంది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |