మమహారాష్ట్ర ప్రభుత్వం “మిషన్ ఆక్సిజన్ స్వావలంబన”పథకాన్ని ప్రారంభించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి “మిషన్ ఆక్సిజన్ స్వావలంబన” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1300 మెట్రిక్ మీటర్లుగా ఉంది . విదర్భ, మరాఠ్వాడా, ధులే, నందూర్ బార్, రత్నగిరి మరియు సింధుదుర్గ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన యూనిట్లకు వాటి అర్హతను బట్టి స్థిర మూలధన పెట్టుబడులలో 150 శాతం వరకు ప్రోత్సాహకాలకు పొందేందుకు అర్హత ఉంది మరియు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన యూనిట్లకు 100 శాతం వరకు సాధారణ ప్రోత్సాహకాలు పొందేందుకు అర్హత ఉంది.
రూ.50 కోట్ల వరకు స్థిర మూలధన పెట్టుబడితో ఉన్న ఎం.ఎస్.ఎం.ఈ లకు స్థూల ఎస్ జిఎస్ టి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సుంకం మరియు విద్యుత్ వ్యయం యూనిట్ సబ్సిడీపై ప్రభుత్వం ఐదేళ్లపాటు తిరిగి చెల్లించనున్నాయి . జూన్ ౩౦ కి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ విధానం యొక్క ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రోత్సాహకాలతో, మహారాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ త్వరలో ఆక్సిజన్ స్వావలంబన రాష్ట్రంగా మారడానికి మరియు తయారీ, నిల్వలను పెంచడానికి బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- మహారాష్ట్ర గవర్నర్: భగత్ సింగ్ కోశ్యరి.
- మహారాష్ట్ర రాజధాని: ముంబై.
- మహారాష్ట్ర సిఎం: ఉద్ధవ్ థాకరే.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
23 మే & 24 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి