తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర:
తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , తెలంగాణ ఉద్యమం, భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ TSPSC గ్రూప్-1,2,3 ,4 , పోలీస్ , రెవెన్యూ మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247, ఈ అంశాలలో ఒకటైన తెలంగాణ ఉద్యమం (Telangana Movement) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వివిధ పార్టీల పాత్ర
జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉంటాయని పేర్కొన్నాడు.
- భావ వ్యా ప్తి
- ఉద్యమ దశ
- రాజకీయ ప్రక్రియ
(1) భావవ్యా ప్తి:
- 1990 లలో మొదలై 1996 తరువాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, అన్నివర్గాల వారు ఈ భావవ్యాప్తిని కొనసాగిస్తూనే ఉన్నారు.
- తెలంగాణ ఏ విధంగా నష్టపోతుందనే విషయాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుదాకా అన్నివర్గాల వారు ప్రతిభావంతంగా, ప్రభావంతంగా భావవ్యాప్తిని చేయగలిగారు.
(2) ఉద్యమదశ:
- భావవ్యాప్తి ద్వారా వచ్చిన చైతన్యం ఉద్యమంగా మారింది. 2000లలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ రూపాలు ఏర్పడ్డాయి.
- 1990లలో ఒక ఆకాంక్షగా మొదలైన తెలంగాణ ఉద్యమం 2001లో టి.ఆర్.ఎస్ ఆవిర్భావం తరువాత రాజకీయ వ్యక్తీకరణ జరిగింది. ఆ తరువాత డిమాండ్ గా మారింది.
(3) రాజకీయ ప్రక్రియ :
- 2001 టి.ఆర్.ఎస్ ఆవిర్భావం తరువాత టి.ఆర్.ఎస్ పార్టీ ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకున్నది.
టీఆర్ఎస్ పార్టీ పాత్ర మరియు రాజకీయ పునరేకీకరణ, ఎన్నికల పొత్తులు
- తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్వయుగంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేసి ఆ తరువాత కాలంలో, అంటే 1983లో ఎన్.టి.ఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి సిద్దిపేట అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగు (1985, 1989, 1993) సార్లు ఎన్నికవుతూ వచ్చారు.
- 1999 ఎన్నికల అనంతరం డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు.
- విజన్-2020 పత్రాన్ని మెకెన్సీ వారిచేత బాబు తయారుచేయించాడు.
- విజన్-2020 డాక్యుమెంట్ లో తెలంగాణ అభివృద్ధి గురించి లేకపోవడంతో ఈ పత్రాన్ని కె.సి.ఆర్ బహిరంగంగా విమర్శించాడు.
- చంద్రబాబు కరెంట్ చార్జీలను పెంచినపుడు “అసలే కరువుతో బాధపడుతున్న తెలంగాణ రైతులకు ఇది మరింత భారమై వారి నడ్డి విరిచేస్తుంది” అని కె.సి.ఆర్ బహిరంగంగానే విమర్శించాడు.
- 2000 సం||లో ఎన్.డి.ఎ ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను ఏర్పరుస్తూ దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నించగా చంద్రబాబు అడ్డుపడ్డాడు. దాంతో కె.సి.ఆర్. టీడీపీ పార్టీకి రాజీనామా చేశాడు.
- రాజీనామా అనంతరం 2001 ఏప్రిల్ 27న కె.సి.ఆర్’ హైదరాబాద్ లోని జలదృశ్యంలో “తెలంగాణ రాష్ట్ర సమితి“ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
- 2001 మే 17న కరీంనగర్ లో “సింహగర్జన” పేరుతో సభ పెట్టారు.
- ఈ సింహగర్జన సభకు “జార్ఖండ్ ముక్తి మోర్చా” నాయకుడు “శిబూ సోరెన్” వచ్చి తెలంగాణకు మద్దతు తెలిపాడు.
- 2001లో స్థానిక సంస్థల ఎన్నికలలో టి.ఆర్.ఎస్. పార్టీ నాగలి గుర్తుపై పోటీ చేసి నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకుంది.
- నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా-సంతోష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా – కె.వి.రాజేశ్వర్రావు ఎన్నికయ్యారు.
- 2001 సెప్టెంబర్ లో కె.సి.ఆర్. రాజీనామా చేసిన సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
- ఈ ఉప ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గము నుండి తన ప్రత్యర్థి అయిన కె.శ్రీనివాసరెడ్డి పై (టి.డి.పి) 58,712 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.
- 2001 నవంబర్ 17న ఖమ్మంలో ప్రజాగర్జన సభను నిర్వహించారు.
- 2002 మార్చి 27న రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో శంఖారావ సభ పేరుతో బహిరంగ సభను టీఆర్ఎస్ నిర్వహించింది.
- 2002 జనవరి 22న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి.
- ఈ ఎన్నికలలో టి.ఆర్.ఎస్. పార్టీ కేవలం రెండు కార్పొరేట్ స్థానాలలో (మాణికేశ్వర్ నగర్ లో యాదయ్య, మోండా మార్కెట్ నుండి పద్మారావు) మాత్రమే గెలిచారు.
- ఈ కార్పొరేషన్ ఎన్నికలలో మేయర్ స్థానానికి పోటీ చేసిన టి.ఆర్.ఎస్. పార్టీ ప్రధాన కార్యదర్శి – నాయిని నర్సింహారెడ్డి కూడా ఈ ఎన్నికలలో ఓడిపోయాడు.
ప్రథమ వార్షికోత్సవ సభ:
- 2002 ఏప్రిల్ 27న టి.ఆర్.ఎస్. ప్రథమ వార్షికోత్సవ సభ నల్గొండలో జరిగింది.
- ఈ వార్షికోత్సవ సభకు హాజరైన నాయకులు: శిబూసోరెన్, అజిత్ సింగ్, భీంసింగ్
- టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి, దుబ్బాక, సిరిసిల్ల చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి కె.సి.ఆర్ తో సహా పార్టీ కార్యకర్తలు భిక్షాటన చేసి మరీ ఆర్థిక సహాయం అందించారు.
ద్వితీయ వార్షికోత్సవ సభ:
- 2003 ఏప్రిల్ 27 వ తేదీన వరంగల్ (హన్మకొండ) పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ద్వితీయవార్షికోత్సవ సభలు జరిగాయి.
- ఈ సభకు టి.ఆర్.ఎస్. పార్టీ ‘వరంగల్ జైత్రయాత్ర’ అని నామకరణం చేసింది.
- ఈ సభకు కె.సి.ఆర్ సిద్ధిపేట నుండి సైకిల్ యాత్రతో, అన్ని జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు సైకిళ్ళపై వచ్చారు. ఈ
- ఈ వార్షికోత్సవ సభలో పాల్గొన్న ముఖ్య నాయకులు –
- అజిత్ సింగ్ (మాజీ కేంద్రమంత్రి)
- దేవేగౌడ (మాజీ ప్రధానమంత్రి)
- బన్వర్లాల్ పురోహిత్ (విదర్భ ఉద్యమనాయకుడు)
- బాబూలాల్ తివారి (బుందేల్ఖాండ్ ఉద్యమనాయకుడు)
- ఈ సభలోనే దేవేగౌడ, అజిత్ సింగ్లు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తమ పార్టీల మద్దతు లభించగలదని హామీ ఇచ్చారు.
తెలంగాణ భావన ప్రజలలోకి తీసుకువెళ్లడానికి టీఆర్ఎస్ కార్యక్రమాలు
పల్లెబాట: టి. ఆర్. ఎస్ పార్టీ 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 వరకు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది.
జలసాధన ఉద్యమం:
- తెలంగాణ రాష్ట్రసమితి 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 6 వరకు జలసాధన ఉద్యమాన్ని నిర్వహించింది.
- జలసాధన కార్యక్రమం అనంతరం 2003 జనవరి 6న ‘తెలంగాణ గర్జన’ ఫేరుతో హైద్రాబాద్ లోని జింకానా గ్రౌండ్స్ లో ఒక మహాసభను నిర్వహించింది. (
కె.సి.ఆర్ పాదయాత్రలు:
- రాజోలి బండ డైవర్షన్ పథకం సమస్యపై నిరహార దీక్ష చేసిన నాయకుడు – రవీంద్రనాథ్ రెడ్డి
- అటువంటి సమయంలో ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కె.సి.ఆర్. 2003 మే 20నుండి మే 25వరకు మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు పాదయాత్ర చేశాడు.
- ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుదారులు నిరసన వ్యక్తం చేశారు.
- దాంతో బాధిత రైతులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కె.సి.ఆర్. 2003 ఆగస్టు 25 నుండి ఆగస్టు 30 తేదీల మధ్య కోదాడ నుండి హాలియా వరకు 120 కి.మీ పాదయాత్ర చేశాడు.
జాతీయస్థాయిలో తెలంగాణ ఆకాంక్ష తెలియజేయడం :
- టి.ఆర్.ఎస్. పార్టీ తెలంగాణ వాదమును ఢిల్లీకి తెలయజేయడానికి 2003 మార్చి 27న హైద్రాబాద్ లోని ఫలక్ నుమా పాలెస్ నుండి 1000కార్లతో ఢిల్లీకి కారు ర్యాలీ తీశారు. ఢిల్లీలో రాంవిలాస్ పాశ్వాన్ ఆహ్వానం పలికాడు.
- “2003 సెప్టెంబర్ 9న మౌలాంకర్ హోటల్ లో వివిధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు సమావేశం నిర్వహించారు.
- ఈ సమావేశంలోనే “ప్రత్యేక రాష్ట్రాల జాతీయ కన్వీనర్ గా కె.సి.ఆర్.” ను ఎన్నుకున్నారు.
- ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యనాయకులు
- అజిత్ సింగ్ (హరిత ప్రదేశ్ ఉద్యమకారుడు)
- శిబూసోరెన్ (జార్ఖండ్ రాష్ట్రం)
- బన్వర్ లాల్ (విదర్భ ఉద్యమకారుడు)
- బాబూలాల్ తివారి (బుందేల్ ఖండ్ ఉద్యమకారుడు)
- రాజా బుందేలా (బుందేల్ఖాండ్ ఉద్యమకారుడు)
*****************************************************************
మునుపటి అంశాలు :
తెలంగాణ భావజాల వ్యాప్తిలో వివిధ సభలు
తెలంగాణ భావజాల వ్యాప్తిలో పౌరసంఘాలు, వేదికల పాత్ర
జై ఆంధ్ర ఉద్యమం- అనంతర సంఘటనలు
1969 ఉద్యమం వివిధ రాజకీయ పార్టీల పాత్ర
1969 ఉద్యమం-వివిధ వర్గాల పాత్ర
1956-69 మధ్య తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనలు,
తెలంగాణ ఉద్యమం-పెద్ద మనుషుల ఒప్పందం 1956
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఏర్పాటు , ముల్కీ ఉద్యమం 1952
