Table of Contents
Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Telangana State GK – ప్రశ్నలు
Q1. కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు?
(a) 1వ బేతరాజు
(b) రుద్రదేవుడు
(c) వెన్నడు
(d) దానర్ణవుడు
Q2. దిగువ పేర్కొన్నవి పరిగణనలోకి తీసుకోండి.
- కళా సాహిత్యానికి గొప్ప పోషకుడైన ఆయన సంస్కృతంలో ‘నితిసార’ అనే రచన చేశారు.
- అనమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
రుద్రదేవుడు గురించి దిగువ పేర్కొన్న ప్రకటన (లు) ఏది సరైనది/సరైనది?
(a) I మాత్రమే
(b) II మాత్రమే
(c) I మరియు II రెండూ
(d)I, II కాదు
Q3. కాకతీయుల రాజ్యానికి ప్రధాన ఆదాయమైన భూమిశిస్తును పండించిన మొత్తం పంటలో ఎంత భాగాన్ని వసూలు చేసేవారు?
(a) 1/4 వంతు నుంచి 1/2 వరకూ
(b) పండిన పంటలో 1/3వ వంతు
(c) పండిన పంటలో 1/7వ వంతు
(d) పండిన పంటలో 1/5వ వంతు
Q4. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండిస్తున్నట్లు వివరించినవారు ఎవరు ?
(a) మహదేవుడు
(b) రుద్రదేవుడు
(c) మార్క్ పోలో
(d) బేతన
Q5. దిగువ వాటిని జతచేయండి
జాబితా I జాబితా II
- బద్దెన 1.నీతిశాస్త్ర ముక్తావళి
- మడికి సింగన 2. పురుషార్థసారం
- సిద్ధదేవయ్య 3. నీతిసారం
- ప్రతాపరుద్రుడు 4. సకల నీతి సమ్మతం
Code:
a b c d
(a) 1 2 3 4
(b) 4 3 2 1
(c) 1 4 2 3
(d) 3 2 4 1
Q6. క్రింది వారిలో ఎవరిని తెలంగాణ సాహిత్యంలో ఆదికవిగా కీర్తిస్తారు?
(a) బద్దెన
(b) పాల్కురిసోమనాథుడు
(c) కేతన
(d) పైనవేవి కావు
Q7. ఎవరి కాలం నాటికి పద్మనాయక రాజ్యం ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, తూర్పున కొండవీటి రాజ్యం, పశ్చిమాన బహమనీ రాజ్య సరిహద్దుల వరకు విస్తరించింది?
(a) ప్రసాదిత్య నాయుడు
(b) ఒకటో అనపోతానాయకుడు
(c) ఒకటో సింగమనాయకుడు
(d) దామానాయుడు
Q8. భారతదేశంలో తొలిసారిగా యుద్ధరంగంలో ‘గన్పౌడర్’ను ఉపయోగించినవారు?
(a)హసన్ గంగూ
(b) ఫిరోజ్షా
(c) ఒకటో మహమ్మద్ షా
(d) రెండో మహ్మద్ షా
Q9. ‘కటక చురకార’ అనే బిరుదు ఎవరి ఉంది?
(a) రాచ వేమారెడ్డి
(b) కాటయ వేమారెడ్డి
(c) కుమారగిరి రెడ్డి
(d) కాటయ వేముడు
Q10. కాకతీయ సామ్రాజ్యంలో ఢిల్లీ సుల్తానుల మొదటి దండయాత్ర ఎప్పుడు జరిగింది?
(a) క్రీ.శ 1303
(b) క్రీ.శ 1309
(c) క్రీ.శ. 1319
(d) క్రీ.శ.1323
Solutions:
S1. Ans (a)
Sol: కాకతీయులు రాష్ట్రకూట వంశానికి చెందినవారు. కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చి, ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతమంతటా విస్తరించారు. కాకతీయ వంశ స్థాపకుడు 1వ బేతరాజు
S2. Ans (c)
Sol: కళ్యాణి చాళుక్యులు బలహీన మవ్వడంతో రుద్రదేవుడు హనుమకొండలో పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొదటి కాకతీయ రాజు. కళా సాహిత్యానికి గొప్ప పోషకుడైన ఆయన సంస్కృతంలో ‘నితిసార’ అనే రచన చేశారు. అనమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
S3. Ans (a)
Sol: కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పంటలో 1/4 నుంచి 1/2 వరకు శిస్తుగా వసూలు చేసేవారు. వీరికాలంలో మోటుపల్లి (దేశీయకొండ) ప్రముఖ రేవు.
S4. Ans : (c)
Sol: ఓరుగల్లు (వరంగల్) ప్రాంతంలో సువాసనలతో కూడిన వరి పండిస్తున్నట్లు మార్కోపోలో పేర్కొన్నాడు.రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపోలో కాకతీయ రాజ్యం సిరి సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ అని ప్రస్తావించాడు.
S5. Ans (c)
Sol: కాకతీయుల పాలనా విషయాలు ప్రధానంగా శాసనాలు, రాజనీతిని వివ రించే గ్రంథాల ఆధారంగా ఉన్నాయి.
బద్దెన – నీతిశాస్త్ర ముక్తావళి,
మడికి సింగన – సకల నీతి సమ్మతం,
సిద్ధదేవయ్య – పురుషార్థసారం,
ప్రతాపరుద్రుడు – నీతిసారం గ్రంథాలు ముఖ్యమైనవి
S6. Ans (b)
Sol: తెలంగాణ సాహిత్యంలో కాకతీయుల కాలం స్వర్ణయుగం అంటారు. తొలిసారిగా స్వతంత్ర రచన చేసిన పాల్కుర్కి సోమనాథుడు (1160- 1240) తెలంగాణ సాహిత్యంలోనే కాదు తెలుగు సాహిత్యంలోనే ఆదికవి. ఆయన ఏ సంస్కృతపురాణంలో లేని స్వతంత్ర ఇతివృత్తాన్ని తీసుకోవడమే కాక, పూర్తిగా దేశీయమైన భాషను, నుడికారాన్ని.. ఛందస్సును తీసికొని దేశీయతకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించినాడు.
S7. Ans (b)
Sol: ఒకటో అనపోతానాయకుడు కాలంలో పద్మనాయక రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు దక్షణాన శ్రీశైలం. తూర్పున కొండవీటి రాజ్యం, పడమర బహమనీ రాజ్యం సరిహద్దులుగా ఉంది. అంటే తెలంగాణా ప్రాంతమంతా పద్మనాయకుల పాలనలోకి వచ్చింది. ‘నాడు మొదలు ఒక శతాబ్ద కాలం పద్మనాయకుల చరిత్రయే తెలంగాణ చరిత్ర” అని చరిత్ర కారులన్నది నిజం.
S8. Ans (c)
Sol: 1వ మహమ్మదా క్రీ.శ 1364-65 లో గోల్కొండ దుర్గంతో సహ పరిసర ప్రాంతాల్ని ఆక్రమించినాడు. భారతదేశంలోనే మొదటి సారి యుద్ధరంగంలో గన్పౌడర్ ఉపయోగించినవాడితడు
S9. Ans (d)
Sol: కాటయ వేముడు తన రాజమహేంద్ర రాజ్యాన్ని కటక్ వరకు విస్తరించి ‘కటక చురకార’ అనే బిరుదును ధరించాడు. కాటయ వేముడు అత్తిలి యుద్ధంలో తిప్పన చేతిలో మరణించాడు
S10. Ans (a)
Sol: కాకతీయ సామ్రాజ్యంలో ఢిల్లీ సుల్తానుల మొదటి దండయాత్ర క్రీ.శ 1303 జరిగింది. ఆ నాటి ఢిల్లీ సుల్తాను అల్లా ఉద్దీన్ ఖిల్జీ (1296-1316). దండయాత్ర జరిపిన సేనాపతి మాలిక్ ఫక్రుద్దీన్ జునా. ఉప్పరపల్లి (కరీంనగర్) యుద్ధంలో కాకతీయ సైన్యం చేతిలో ఓడిపోయారు. అతనిని ఓడించిన కాకతీయ సేనాపతులు రేచర్ల వెన్నడు, కొలిగింటి మైలి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |