Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana Movement Quiz in Telugu

Telangana Movement Quiz in Telugu, 26th August 2023 For TSPSC GROUP-2 & GROUP-3

Telangana Movement MCQS Questions And Answers in Telugu: Telangana Movement is an important topic in every competitive exam. here we are giving the Telangana Movement Section which provides you with the best compilation of Telangana Movement. Telangana Movement is a major part of the exams like TSPSC GROUP-2 & GROUP-3.  Many aspirants for government exams have benefited from our website now it’s your turn.

This is the best site to find recent updates on Telangana Movement not only for competitive exams but also for interviews.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana Movement MCQs Questions And Answers in Telugu (తెలుగులో)

Q1. క్రింది వారిలో రాష్ట్రాల పునర్వ్యవస్తికరణ కమీషన్ లో సభ్యులు కాని వారిని గుర్తించండి.

  1. హృదయనాథ్ కుంజ్రు 
  2. కవలం మాధవ ఫణిక్కర్
  3. టి. హయగ్రీవ చారి
  4. మల్లికార్జున్
  1. I మరియు II
  2. II మాత్రమే
  3. III మరియు IV
  4. IV మాత్రమే

Q2. హైదరాబాద్ రాజ్యంలో ముల్కిల పక్షాన మరియు నాన్ ముల్కీల పక్షాన ప్రచారం చేసిన పత్రికలు వరుసగా ఏవి?

  1. హైదరాబాద్ రికార్డు & ఇలాహి బక్ష్
  2. ఇలాహి బక్ష్ & హైదరాబాద్ రికార్డు
  3. దక్కన్ టైమ్స్ & మీజాన్
  4. రిసాల తబ్బి & హైదరాబాద్ టెలిగ్రాఫ్

Q3. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం  ఉద్యమం 1938వ సంవత్సరం నవంబర్29న ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభం అయింది?

  1. అచ్యుత రెడ్డి
  2. పి.వి. నరసింహరావు
  3. ఆరుట్ల రామచంద్ర రెడ్డి
  4. టి. హయగ్రీవ చారి

Q4.  “మా భూమి నాటకం” ఎవరి వీరత్వం గురించి పేర్కొంటుంది?

  1. షేక్ బందగీ
  2. దొడ్డి కొమురయ్య
  3. సర్వాయి పాపన్న
  4. బత్తిని మొగిలయ్య గౌడ్

Q5. క్రింది వాటిని జతపరచండి.

  1. గ్రంథాలయోద్యమ పిత                          a. స్వామి రామానందతీర్థ
  2. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు   b. మాడపాటి హనుమంతరావు
  3. తెలంగాణా వైతాళికుడు                         c. బి.యస్. వెంకట్రావ్
  4. హైదరాబాద్ అంబేద్కర్                         d. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

(a). I-a, II-b, III-c, IV-d

(b). I-d, II-a, III-b, IV-c

(c). I-d, II-b, III-a, IV-c

(d). I-c, II-a, III-b, IV-d

Q6. గస్తీ నిషాన్ 53 రద్దుకోసం ఏర్పడిన కమిటీకి నాయకత్వం వహించినది ఎవరు?

  1. రామచంద్ర నాయక్
  2. బాలముకుంద్ రాయ్
  3. సర్ సయ్యద్ అలీ ఇమామి
  4. ఏది కాదు

Q7. 2011 ఫిబ్రవరి 20న విద్యార్ధి ఐ.కా.స. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చింది?

  1. చలో హైదరాబాద్
  2. చలో పార్లమెంట్
  3. చలో ఢిల్లీ
  4. చలో అసెంబ్లీ

Q8. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం స్థానిక నియామకాలు పొందాలంటే తెలంగాణా ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి?

  1. 15 సంవత్సరాలు
  2. 12 సంవత్సరాలు
  3. 7 సంవత్సరాలు
  4. 5 సంవత్సరాలు

Q9. నిజాం ప్రభుత్వం  ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత ప్రభుత్వం పై చేసిన ఫిర్యాదుకు సంబంధించి సరికానిది ఏది?

  1. భారత ప్రభుత్వం తరుపున ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో సర్ రామ స్వామి మొదలియార్ పాల్గొన్నారు.
  2. నిజాం ప్రభుత్వం తరుపున ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో నవాబ్ మోయిన్ జంగ్ పాల్గొన్నారు.
  3. ఐక్యరాజ్యసమితి భద్రత మండలి అధ్యక్షుడు – సర్ అలెగ్జాండర్ కాడోగాన్
  1. I,II సరైనవి
  2. I,III సరైనవి
  3. II,III సరైనవి
  4. మూడు సరైనవే 

Q10. తెలంగాణలో సహాయ నిరాకరణ కార్యక్రమం ఎన్ని రోజులు జరిగింది?

  1. 20 రోజులు
  2. 16 రోజులు
  3. 42 రోజులు
  4. 15 రోజులు

Solutions: 

S1. Ans (c)

Sol. రాష్ట్రాల పునర్వ్యవస్తికరణ కమీషన్ 1953 డిసెంబర్ 29న నియమించబడింది.

ఈ కమిషన్ చైర్మన్- సయ్యద్ ఫజల్ అలీ (ఒడిషా రాష్ట్ర గవర్నర్ )

సభ్యులు-

  1. హృదయనాథ్ కుంజ్రు (రాజ్యసభ సభ్యుడు)
  2. కవలం మాధవ ఫణిక్కర్ (భారతదేశ ఈజిప్ట్ రాయబారి)

ఈ కమీషన్ తన నివేదికను సెప్టెంబర్ 30, 1955న సమర్పించింది.

S2. Ans(a)

Sol. హైదరాబాద్ రాజ్యంలో ముల్కిల పక్షాన మరియు నాన్ ముల్కీల పక్షాన ప్రచారం చేసిన పత్రికలు వరుసగా హైదరాబాద్ రికార్డు & ఇలాహి బక్ష్.

S3. Ans(a)

Sol. ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం ఉద్యమం 1938వ సంవత్సరం నవంబర్29న అచ్యుత రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభం అయింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ‘బి’ హాస్టల్ లో విద్యార్థులు వందేమాతరం  గీతాన్ని ఆలపించేవారు. నవంబర్ 28, 1938న యూనివర్సిటీలో వందేమాతరం  గీతాన్ని ఆలపించడాన్ని నిషేధించారు. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 29 నుండి డిసెంబర్ 10 వరకు సమ్మె కొనసాగింది.

S4. Ans(a)

Sol. “మా భూమి నాటకం” తెలంగాణా సాయుధ పోరాటంలో అమరుడైన షేక్ బందగీ వీరత్వం గురించి తెలుపుతుంది. ఈ నాటకాన్ని రచించినది సుంకర సత్యనారాయణ రావు, వాసిరెడ్డి భాస్కర రావు. షేక్ బందగీ జూలై 26, 1940న కామారెడ్డి గూడెంలో హత్య చేయబడ్డాడు. ఇతను విసునూరు దేశముఖ్ కు వ్యతిరేకంగా పోరాడాడు.

S5. Ans (b)

Sol.  సరియైన జతలు:

గ్రంథాలయోద్యమ పిత                                  కొమర్రాజు వెంకట లక్ష్మణరావు  

హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు         స్వామి రామానందతీర్థ  

తెలంగాణ వైతాళికుడు                                 మాడపాటి హనుమంతరావు

హైదరాబాద్ అంబేద్కర్                              బి.యస్. వెంకట్రావ్ 

S6. Ans (c)

Sol. గస్తీ నిషాన్ 53 సర్కిల్ అనగా నిజాం రాజ్యంలో సభలు సమావేశాలు రద్దు. దీని రద్దు కోసం ఏర్పడిన కమిటీకి నాయకత్వం వహించింది రామచంద్రనాయక్ .

S7. Ans (d)

Sol. 2011 ఫిబ్రవరి 20న విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితి “ఛలో అసెంబ్లీ” కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇది 2011 ఫిబ్రవరి 17న ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జరిగింది. 

S8. Ans (b)

Sol. విశాలాంధ్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల భయాలు పోగొట్టడానికి, తెలంగాణా ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకై రక్షణలు కల్పించటానికి అప్పటి కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ సమక్షంలో ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో ఫిబ్రవరి 20,1956న పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణా నుండి నలుగురు, ఆంధ్ర నుండి నలుగురు ప్రతినిధులు హాజరు అయ్యారు.  ఈ ఒప్పందంలో తెలంగాణా ప్రాంతానికి రక్షణ కల్పించే 14 అంశాల పై సంతకాలు చేసారు. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం స్థానిక నియామకాలు పొందాలంటే తెలంగాణా ప్రాంతంలో 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి.

S9. Ans (d)

Sol. నిజాం ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో భారత ప్రభుత్వం పై 1948 ఆగష్టు 21న ఫిర్యాదు చేసింది. 

భారత ప్రభుత్వం తరుపున ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో సర్ రామ స్వామి మొదలియార్ పాల్గొన్నారు.

నిజాం ప్రభుత్వం తరుపున ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో నవాబ్ మోయిన్ జంగ్ పాల్గొన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రత మండలి అధ్యక్షుడు – సర్ అలెగ్జాండర్ కాడోగాన్

S10. Ans (b)

Sol. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా సహాయ నిరాకరణోద్యమం 2011 ఫిబ్రవరి 17 న ప్రారంభమై మార్చి 04 వరకు 16 రోజుల పాటు జరిగింది. 

సహాయ నిరాకరణ ఉద్యమంలోని నిరసనలు:

  • పన్నుల నిరాకరణ
  • విద్యుత్, నీటి బిల్లుల నిరాకరణ 
  • ఆర్.టి.సి. బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణం 
  • టోల్ గేట్ ఛార్జీలు కట్టకపోవడం 
  • గవర్నర్, రాష్ట్రపతుల ప్రసంగాలను అడ్డుకోవడం మొదలగు చర్యలు చేపట్టారు.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 Telugu website