APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా మీకు అందించబడుతుంది.
జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్ పిఎస్) కింద పెన్షన్ ఫండ్ నిర్వహణలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49% నుండి 74%కి పెంచాలని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ చర్య ఈ రంగంలో అనుభవజ్ఞులైన విదేశీ భాగస్వాములకు అవకాశాన్ని ఇస్తుంది మరియు ఈ విభాగంలో మరింత పోటీని సులభతరం చేస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పిఎఫ్ ఆర్ డిఎ) చట్టం బీమా రంగంలో ఎఫ్ డిఐ పరిమితిని అనుసంధానిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పిఎస్) ప్రారంభించబడింది మరియు తరువాత 2009లో ఇది అందరికీ అందించడం జరిగింది. ఎన్ పిఎస్ లో రెండు రకాల ఖాతాలు ఉన్నాయి – టైర్ 1 మరియు టైర్ 2. ఒకవేళ ఒక వ్యక్తి టైర్ 1 అకౌంట్ లో పెట్టుబడి పెట్టినట్లయితే, అతడు/ఆమెకు రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది. జాతీయ పెన్షన్ పథకాన్ని పిఎఫ్ ఆర్ డిఎ నియంత్రిస్తుంది.
ఎన్ పిఎస్ లో 7 పెన్షన్ ఫండ్లు:
- హెచ్ డిఎఫ్ సి పెన్షన్ మేనేజ్ మెంట్
- ఐసిఐసిఐ ప్రూ పెన్షన్ ఫండ్స్ మేనేజ్ మెంట్
- కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్ మేనేజ్ మెంట్
- ఎల్ ఐసి పెన్షన్ ఫండ్
- ఎస్ బిఐ పెన్షన్ ఫండ్స్
- యుటిఐ రిటైర్ మెంట్ సొల్యూషన్స్
- ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ మేనేజ్ మెంట్
పెన్షన్ ఫండ్స్ లో ఎఫ్ డిఐ యొక్క ప్రయోజనం:
- చాలా కంపెనీలకు వాటి విస్తరణకు మూలధనం అవసరం మరియు ఎఫ్ డిఐ పరిమితి పెరగడం వల్ల, వారికి ఎక్కువ డబ్బు లభిస్తుంది.
- ఇప్పటికే ఉన్న ఫండ్ హోల్డర్లు కూడా తమ అదనపు వాటాను విక్రయించగలుగుతారు.
- విదేశీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీని అందించగలుగుతాయి.
- పెన్షన్ల వ్యాప్తిని పెంచడంలో సహాయపడతాయి.
జనరల్ స్టడీస్-పాలిటి నోట్స్ PDF తెలుగు లో
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి