Telugu govt jobs   »   Monthly & Weekly Current Affairs   »   AP and Telangana state Weekly Current...

AP and Telangana states June Weekly Current affairs Part 1, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జూన్ వారాంతపు కరెంట్ అఫైర్స్ పార్ట్ 1

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. The banking or state govt examinations comprise a section of “General Awareness” to evaluate how much the aspirant is aware of the daily happenings taking place around the world. To complement your preparation, we are providing you with a compilation of the  Current affairs of June 1st and 2nd week.

AP and Telangana state Weekly Current affairs, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారాంతపు కరెంట్ అఫైర్స్

Weekly current Affairs PDF in Telugu : APPSC, TSPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో  జనరల్ అవేర్‌నెస్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  GA మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు జనరల్ అవేర్నెస్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా   నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని వారాంతపు సమకాలీన అంశాలు 2022 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

AP and Telangana state June Weekly Current affairs Part 1_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana state June Weekly Current affairs

 

1. వినూత్న వాహనాల తయారీకి ఐక్యాట్‌తో ఐఐటీహెచ్‌(IITH) ఒప్పందం

AP and Telangana state June Weekly Current affairs Part 1_50.1

డ్రైవర్‌ లేకుండానే దూసుకుపోయే వాహనాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్‌ వడివడిగా అడుగులేస్తోంది. ఆ దిశగా పరిశోధనలను ముమ్మరం చేసే ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ (ఐక్యాట్‌) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్వతంత్రంగా నడిచే వాహనాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా ఐఐటీలో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ (టీహాన్‌)ను నెలకొల్పారు. ఈ హబ్‌ ద్వారా టెస్టింగ్‌ ట్రాక్‌తో పాటు పరిశోధనలకు అవసరమైన అన్ని వ్యవస్థలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. రానున్న రోజుల్లో డ్రైవర్‌ లేకుండానే నేలపై, ఆకాశంలో నడిచే వాహనాలను సిద్ధం చేయాలనేది దీని ఏర్పాటు లక్ష్యం. ‘ఐక్యాట్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు. ఇకపై రెండు సంస్థలు పరిశోధనా, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణ అంశాల్లో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతాయని’ ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తి అన్నారు.

2. కాలుష్యరహిత స్టవ్‌లు, స్టీమ్‌ యంత్రాల తయారీకి ఒప్పందం

తెలంగాణలో కాలుష్యరహిత వంట స్టవ్‌లు, మొబైల్‌ స్టీమ్‌ యంత్రాల తయారీకి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీ వర్క్స్, సామాజిక సేవా సంస్థ కేర్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. టీవర్క్స్‌ సీఈవో సుజయ్‌ కారంపురి, కేర్‌ ఇండియా సీఈవో మనోజ్‌ గోపాలకృష్ణలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

3. అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ గ్లోబల్‌ కేపెబిలిటీ సెంటర్‌ ప్రారంభం

AP and Telangana state June Weekly Current affairs Part 1_60.1

వాహన రంగంలో తెలంగాణకు అద్భుత భవిష్యత్తు ఉందని, హైదరాబాద్‌ నగరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తొలి ‘ఫార్ములా ఈ’ (విద్యుత్‌ వాహనాల) రేసుకు ఆతిథ్యమివ్వనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విద్యుత్‌ వాహన తయారీ రంగంపై చర్చించేందుకు శిఖరాగ్ర సదస్సు (ఈవీ సమ్మిట్‌)నూ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రముఖ వాహన రంగ సంస్థ అడ్వాన్స్‌ ఆటో పార్ట్స్‌ ప్రపంచస్థాయి సామర్థ్య కేంద్రం (గ్లోబల్‌ కేపెబిలిటీ సెంటర్‌)ను కేటీఆర్‌ హైదరాబాద్‌లోని కోకాపేట జీఏఆర్‌ ఇన్‌ఫోబాన్‌ ఐటీ భవనంలో ప్రారంభించారు.

4. జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీ ‘ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ ప్రారంభం

AP and Telangana state June Weekly Current affairs Part 1_70.1

భారతదేశంలో పెట్టుబడులకు ముఖద్వారం తెలంగాణ రాష్ట్రమని ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అభివర్ణించారు. మాదాపూర్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌ కంపెనీకి చెందిన ‘ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ను ఆయన ప్రారంభించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోంది. జాన్సన్‌ కంట్రోల్స్‌ వంటి కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. టీ హబ్, టీ వర్క్స్, ఐమేజ్‌ టవర్స్, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం, సచివాలయం వంటి భవనాలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

5. తెలంగాణలో తొలిసారిగా వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో జనపనార పరిశ్రమల ఏర్పాటు  

AP and Telangana state June Weekly Current affairs Part 1_80.1

పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో ఇప్పటివరకూ జనపనార (జూట్‌) పరిశ్రమలు లేవు. మరోవైపు ధాన్యం సేకరణ, నిల్వ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 కోట్లకు పైగా జనపనార గోనె సంచులను ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తోంది. ఒక్కోసారి సంచుల కొరతతో ధాన్యం సేకరణకు సమస్యలూ ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోనే గోనె సంచుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మూడు సంస్థలు జూట్‌ మిల్లుల ఏర్పాటుకు ముందుకురాగా, వాటితో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా గ్లోస్టర్‌ లిమిటెడ్‌ సంస్థ వరంగల్‌లో, కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో, ఎంబీజీ కమాడిటీస్‌ లిమిటెడ్‌ కామారెడ్డిలో ఈ మిల్లులను ఏర్పాటు చేయనున్నాయని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు.

6. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)ల ఏర్పాటు

AP and Telangana state June Weekly Current affairs Part 1_90.1

ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి టీఎస్‌ఆర్టీసీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. టికెట్ల జారీని మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే టిమ్‌ (టికెట్‌ ఇష్యూ మిషన్‌) సేవలను అందిస్తోంది. ఇపుడు మరింత ఆధునికంగా దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఐ-టిమ్‌ (ఇంటెలిజెంట్‌ టికెట్‌ ఇష్యూ మిషన్‌)లను అందుబాటులోకి తెచ్చింది.

7. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2021 – 22 వార్షిక నివేదిక విడుదల

తెలంగాణలో పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) ద్వారా ఇప్పటివరకు రూ.2,32,311 కోట్ల పెట్టుబడులతో 19,454 భారీ పరిశ్రమలకు అనుమతులిచ్చామని, వీటి ద్వారా 16.48 లక్షల మందికి ఉపాధి లభించిందని 2021 – 22 రాష్ట్ర పరిశ్రమల వార్షిక నివేదిక వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే రూ.17,867 కోట్ల పెట్టుబడులు, 96,863 మందికి ఉపాధి కల్పన కోసం 3,938 పరిశ్రమలు అనుమతి పొందాయని వెల్లడించింది. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం.. దేశంలో తెలంగాణ అత్యుత్తమ వాణిజ్య వాతావరణ నగరంగా వంద మార్కులను సాధించిందని, ఎగుమతుల్లో దేశంలో అయిదో ర్యాంకు, గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో వాణిజ్య, పారిశ్రామిక ర్యాంకుల్లో మొదటి స్థానంలో, సృజనాత్మకత, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కుల్లో అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. ఈ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు.

నివేదికలోని ముఖ్యాంశాలు.

  • తెలంగాణ జీఎస్‌డీపీ 2021 – 22లో 19.1% వృద్ధి రేటుతో రూ.11.54 లక్షల కోట్లు. 2014 – 15 నుంచి 2021 – 22 వరకు జీఎస్‌డీపీ 128.3 శాతం వృద్ధి చెందింది. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం.
  • 2021 – 22లో రాష్ట్రంలో 13 కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధి.

8. ఐఐసీటీ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్ డి శ్రీనివాస రెడ్డి బాధ్యతలు స్వీకరించారు

AP and Telangana state June Weekly Current affairs Part 1_100.1

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) డైరెక్టర్‌గా డాక్టర్ డి శ్రీనివాస రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అతను డిసెంబర్ 2021 నుండి డైరెక్టర్ అదనపు ఛార్జీగా వ్యవహరిస్తున్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) డైరెక్టర్ డాక్టర్ VM తివారీ నుండి బాధ్యతలు స్వీకరించారు.

 

AP and Telangana state June Weekly Current affairs Part 1_110.1

 

Andhra Pradesh state Weekly Current affairs

1. ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూ 

AP and Telangana state June Weekly Current affairs Part 1_120.1

ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి చట్టంలో చేసిన సవరణలు జూన్‌ 16 నుంచి అమలులోకి వచ్చినట్లుగా పేర్కొంది. ఈ మేరకు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2. జిందాల్‌ పవర్‌ ప్రాజెక్టు ప్రారంభం 

AP and Telangana state June Weekly Current affairs Part 1_130.1

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఓబులునాయుడుపాలెం (నాయుడుపేట) వద్ద రూ.340 కోట్లతో నిర్మించిన వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే జిందాల్‌ పవర్‌ ప్రాజెక్టును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సంబంధిత పైలాన్‌ను ఆవిష్కరించారు. గంటకు 15 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాజెక్టులో 28 మున్సిపాలిటీల నుంచి సేకరించే పొడి చెత్తను వినియోగిస్తారు.

3. విశాఖకు ఇన్ఫోసిస్‌

AP and Telangana state June Weekly Current affairs Part 1_140.1

దేశంలో అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో భారీ క్యాంపస్‌ ఏర్పాటు చేయనుంది. ప్రారంభంలో సుమారు 1,000 సీటింగ్‌ సామర్థ్యంతో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్‌ ముందుకు వచ్చినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. దాదాపు 1,000 సీట్లతో ప్రారంభించి రానున్న కాలంలో మరింతగా విస్తరించి మూడువేల సీట్లకు  పెంచే విధంగా ఇన్ఫోసిస్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి ఆ సంస్థ గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హెడ్‌ నీలాద్రిప్రసాద్‌ మిశ్రా, రీజనల్‌ హెడ్‌ అమోల్‌ కులకర్ణి మంత్రి అమర్‌నాథ్‌తో పాటు అధికారులతో సమావేశమయ్యారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌ కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే విధానానికి మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

4. ఏపీకి నాలుగు స్కోచ్‌ అవార్డులు

AP and Telangana state June Weekly Current affairs Part 1_150.1

ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు స్కోచ్‌ అవార్డులు వరించాయి. 2021 సంవత్సరానికి గాను జౌళి, పశు సంవర్ధక, మత్స్యసంపద, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ అవార్డులు దక్కాయి. ఢిల్లీలోని ఇండియా హాబిటాట్‌ సెంటర్‌లో జరిగిన 83వ స్కోచ్‌ సమ్మిట్‌లో ఇండియా గవర్నెన్స్‌ ఫోరం అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక, మత్య్స సంపద, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవార్డును అందుకున్నారు.

5. AP: మహిళా మార్ట్స్‌

AP and Telangana state June Weekly Current affairs Part 1_160.1

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ‘చేయూత’ మహిళా సూపర్‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సెర్ప్‌ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రతి జిల్లాకు ప్రయోగాత్మకంగా రెండు మహిళా మార్ట్‌లు ఏర్పాటు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది.

వీటికి ఆదరణ లభిస్తే భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒకటి చొప్పున విస్తరించాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలో మార్ట్‌లు ఏర్పాటుకు స్థానిక వెలుగు ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి.  స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళలకు సుస్థిర ఆదాయం కల్పనే లక్ష్యంగా వైఎస్సార్‌ చేయూత రిటైల్‌ స్టోర్లను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ దుకాణాలకు తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేసేలా రిలయన్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ వంటి కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. పరిమితంగా ఉన్న ఈ వ్యాపారాన్ని విస్తరించి నిర్వాహకులకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా మార్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందించేలా చర్యలు తీసుకోనున్నారు. నగరాల్లోని మాల్స్‌కు దీటుగా వీటిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

6. Khelo India 2022: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో  ఏపీ క్రీడాకారుల సత్తా

AP and Telangana state June Weekly Current affairs Part 1_170.1

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌–2021లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు సత్తాచాటారు. 19 క్రీడాంశాల్లో పోటీపడగా 13 (4 స్వర్ణ, 4 రజత, 5 కాంస్య) పతకాలు కైవసం చేసుకున్నారు. అత్యధికంగా స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రాల జాబితాలో ఏపీ 15వ స్థానంలో నిలిచింది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హరియాణాలోని పంచ్‌కులలో అండర్‌–18 బాలబాలికల ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు.

విజేతలు వీరే

వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగాల్లో ఎస్‌.పల్లవి (స్వర్ణం), సీహెచ్‌.శ్రీలక్ష్మి (స్వర్ణం), ఎస్‌కే లాల్‌ భషీర్‌ (రజతం), పి.ధాత్రి (రజతం), డీజీ వీరేష్‌ (రజతం), ఆర్‌.గాయత్రి (కాంస్యం), అథ్లెటిక్స్‌ విభాగాల్లో కుంజా రజిత (స్వర్ణం), ఎం.శిరీష (కాంస్యం), కబడ్డీలో మహిళల జట్టు కాంస్యం, ఆర్చరీలో కుండేరు వెంకటాద్రి (స్వర్ణం), మాదాల సూర్యహంస (కాంస్యం), ఘాట్కాలో బాలురు జట్టు కాంస్యం, బాక్సింగ్‌లో అంజనీకుమార్‌ (రజతం).

7. APSSDC: ఏపీఎస్‌ఎస్‌డీసీకి జాతీయ గుర్తింపు

AP and Telangana state June Weekly Current affairs Part 1_180.1

నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) అమలు చేస్తోన్న కొత్త విధానాలకు జాతీయ గుర్తింపు లభించింది. కర్ణాటకలో జరుగుతున్న 2వ ఇండిగ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్కిల్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న నూతన స్కిల్‌ విధానాలను అభినందిస్తూ అవార్డు వచ్చినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ  ప్రకటన విడుదల చేసింది.

5 రాష్ట్రాలకు చెందిన 20కిపైగా యూనివర్సిటీ విద్యార్థులు, 20 రంగాలకు చెందిన పరిశ్రమలు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో న్యూ ఆక్టివిటీస్‌ అండ్‌ క్యాస్కేడింగ్‌ స్కిల్‌ సిస్టమ్‌ గురించి ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. దానికి అవార్డు లభించడంపై ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎస్‌ సత్యనారాయణ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.

8. ఏపీలో ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000

AP and Telangana state June Weekly Current affairs Part 1_190.1

ఏ తరహా ప్రసవాలు జరిగినా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద తల్లులకు రూ.ఐదు వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్‌ జరిగినా ఈ మొత్తాన్ని అందించాలన్నారు. గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3 వేలే ఇస్తున్నారని, దీన్ని రూ.5 వేలకు పెంచాలని సూచించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు.

సహజ ప్రసవాల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్, కోవిడ్‌ తదితరాలపై సీఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

****************************************************************

Also check Previous : AP and Telangana state Weekly Current affairs

 

AP and Telangana state June Weekly Current affairs Part 1_200.1

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

AP and Telangana state June Weekly Current affairs Part 1_220.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP and Telangana state June Weekly Current affairs Part 1_230.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.