Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q1. కాకతీయుల కాలంలో ధాన్యాన్ని కొలిచే సాధనాలను _____ అని పిలిచేవారు?
- కపిల
- ఖండుగ
- A మరియు B
- పైనవేవి కావు
Q2. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసి దేశంలోనే జాతీయజెండా ఏర్పాటు చేసిన తొలి రైల్వే స్టేషన్ గా ఏ రైల్వే స్టేషన్ నిలించింది?
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- కొలకత్తా స్టేషన్
- చెన్నై రైల్వే స్టేషన్
- ముంబై రైల్వే స్టేషన్
Q3. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల భూమి పరిరక్షణకు ఉద్దేశించిన ఏ చట్టం రాజ్యాంగ బద్ధంగా ఉందని సుప్రీంకోర్టు 1988లో స్పష్టం చేసింది?
- 1 of 70 చట్టం
- తెలంగాణా ప్రాంత గిరిజన ప్రాంతాల నిబంధనలు 1949
- 1959 షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నిబంధన
- 1917 ఏజెన్సీ ప్రాంతాల ప్రయోజనాలు, భూ బదలాయిపు చట్టం
Q4. కింది వాటిని జతపరుచుము.
జాబితా – I జాబితా – II
- సింహగర్జన 1. వికారాబాద్
- ప్రజాగర్జన 2. హైదరాబాద్
- శంఖారావ 3. ఖమ్మం
D.తెలంగాణ గర్జన 4. కరీంనగర్
(a) A – 2, B – 1, C – 4, D – 3
(b) A – 4, B – 3, C – 1, D – 2
(c) A – 3, B – 4, C – 1, D – 2
(d) A – 4, B – 3, C – 2, D – 1
Q5. హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం) కౌలు వ్యవసాయ భూముల చట్టం -1950 ఏ కమిటీ సూచనల ఆధారంగా తీసుకురావడం జరిగింది?
(a) హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ
(b) హైదరాబాద్ కౌలుదారుల పరిరక్షణ కమిటీ
(c) హైదరాబాద్ భూ గరిష్ట పరిమితి కమిటీ
(d) పైవేవీ కావు
Q6. సర్వోదయ కి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది?
- సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని అర్థం.
- గాంధీజీ నిర్మాణాత్మక విధానాల్లో సర్వోదయ ఒకటి. మహాత్మాగాంధీ స్వరాజ్య, సర్వోదయ అనే లక్ష్యాల కోసం నిరంతరం కృషిచేసాడు.
- సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి ఉద్భవించాయి.
(a) 1 మరియు 3
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 3 మాత్రమే
(d) 1, 2, 3
Q7. దిగువ వాటిని జతచేయండి
జాబితా I జాబితా II
- పుల్లరి సుంకం 1. వర్తక సరుకుల మీద, ఎగుమతి, దిగుమతులపై, తయారైన వస్తువు మీద వేసే పన్ను
- దరిశనం 2. రాజదర్శనం కోసం వేసే పన్ను
- గణాచారి పన్ను 3. పశువుల మేతపై వేసే పన్ను
- సుంకం 4. వేశ్యలపై మరియు బిచ్చగాళ్లపై వేసే పన్ను
Code:
a b c d
- 1 2 3 4
- 4 3 2 1
- 1 4 2 3
- 3 2 4 1
Q8. ముసునూరి నాయకులు ఏ ప్రాంతం రాజధానిగా పాలన ప్రారంభించారు?
- రేఖపల్లి
- ఓరుగల్లు
- వల్లూరు
- రాజమహేంద్రవరం
Q9. ‘లక్ష మంది ముస్లిమేతరులను సంహరించే దాకా కత్తి దించను’ అని ప్రతిజ్ఞ చేసింది?
- రెండో మహ్మద్షా
- అహ్మద్షా
- ఒకటో మహ్మద్షా
- హుమాయూన్
Q10. చందా రైల్వే స్కీమ్ ఆందోళన లో ప్రముఖ పాత్ర వహించినది ఎవరు?
(a) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
(b) ముల్లా అబ్దుల్ ఖయ్యుం
(c) a మరియు b రెండూ
(d) పైనవేవి కావు
Solutions:
S1. Ans (c)
Sol: కాకతీయుల కాలంలో ధాన్యాన్ని కొలిచే సాధనాలను కపిల, ఖండుగ అని పిలిచేవారు. రాజ్య ఆదాయానికి భూమిశిస్తు ప్రధాన మార్గం. వృత్తి పన్నులుండేవి. భూమిని నాలుగు రకాలుగా విభజించారు. పనికిరాని భూములు, పంట భూములు, తోట భూములు, పచ్చికబయళ్లు. భూమిని గడ(కోల)తో కొలిచేవారు. పన్నులు ధాన్య, ధనరూపంలో చేలించేవారు.
S2. Ans(a)
Sol: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ సంవత్సరం: 1874.
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ” దేశంలోనే జాతీయజెండా ఏర్పాటు చేసిన తొలి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరుపొందింది.
- కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్-ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా గ్రీన్ రేటింగ్ ఆఫ్ ప్లాటినం అవార్డు సికింద్రాబాద్ స్టేషన్ కు లభించింది.
S3. Ans (a)
Sol: 1 ఆఫ్ 70 చట్టం రాజ్యాంగబద్ధం: ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల గిరిజనుల భూమి పరిరక్షణకు ఉద్దేశించిన 1ఆఫ్ 70 చట్టం రాజ్యాంగ బద్ధంగా ఉందని సుప్రీంకోర్టు 1988లో స్పష్టం చేసింది. గిరిజనుల ప్రయోజనాలకు ఉద్దేశించబడిన ఈ చట్టాన్ని బినామీ, ఇతర అక్రమ లావాదేవీల ద్వారా గిరిజనేతరులు వమ్ము చేసారని కోర్టు అభిప్రాయపడింది. 1 ఆఫ్ 70 చట్టం గతంలో గిరిజనులు పోగొట్టుకున్న భూమిని తిరిగి గిరిజనేతరుల నుంచి రాబట్టుకోవడానికి ఉద్దేశించబడిందని, అందువల్ల 1 ఆఫ్ 70 చట్టం రాజ్యాంగ విరుద్ధమని అనడానికి వీలులేదని గిరిజనేతరుల వాదనను తోసిపుచ్చింది.
S4. Ans (b)
Sol:
- మే 17, 2001న “సింహగర్జన” పేరుతో కరీంనగర్లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు
- నవంబరు 17, 2001న ఖమ్మంలో ‘ప్రజాగర్జన’ సభను నిర్వహించారు.
- టీఆర్ఎస్ పార్టీ మార్చి 27, 2002న రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్లో “శంఖారావ” సభను నిర్వహించారు.
- హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్స్లో జనవరి 6, 2003 ” తెలంగాణ గర్జన పేరుతో” భారీ బహిరంగసభను నిర్వహించింది.
S5. Ans (a)
Sol: హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు జూన్, 1950లో కౌలు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టానికి 1951 లో రెండు సవరణలు, ఆ తరువాత మరికొన్ని సవరణలు చేస్తూ 1952లో హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల (ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్) ఆర్డినెన్స్ తీసుకువచ్చారు
S6. Ans(d)
Sol:
- సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని అర్థం.
- గాంధీజీ నిర్మాణాత్మక విధానాల్లో సర్వోదయ ఒకటి. మహాత్మాగాంధీ స్వరాజ్య, సర్వోదయ అనే లక్ష్యాల కోసం నిరంతరం కృషిచేసాడు.
- సర్వోదయ సిద్ధాంతం ఆధారంగా భూదానం, గ్రామదానం, సంపత్తి దానం, జీవనదానం, శ్రమదానం అనేవి ఉద్భవించాయి.
S7. Ans (d)
Sol: పశువుల మేతపై పుల్లరీ పన్ను విధించేవారు.
రాజదర్శనం కోసం దరిశనం అనే పన్ను చెల్లించేవారు.
గణాచారి పన్ను- వైశ్యలపై మరియు బిచ్చగాళ్లపై వేసే పన్ను
సుంకం – వర్తక సరుకుల మీద, ఎగుమతి, దిగుమతులపై, తయారైన వస్తువు మీద వేసే పన్ను
S8. Ans (A)
Sol: ప్రోలయ నాయకుడు (క్రీ.శ. 1325-1330) ముసునూరి నాయక రాజుల్లో మొదటివాడు. ఇతడు రాజమహేంద్ర వరం నుంచి ముస్లింలను పారద్రోలి గోదావరి-కృష్ణ నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. ‘రేఖపల్లి’ కేంద్రంగా పరిపాలించాడు.
S9. Ans (C)
Sol: బహమనీ సుల్తానులు మతావేశాన్ని ప్రదర్శించినారు. 1వ మహ్మద్షా 1368లో లక్షమంది ముస్లిమేతరులను సంహరించేదాకా కత్తిని దించను అని ప్రతిజ్ఞ చేయడం.
S10. Ans(c)
Sol: సామాజిక సంస్కరణల ప్రభావంతో హైద్రాబాద్లో తమ వంతు పాత్రవహించి హైద్రాబాద్లో సంస్కరణలకు నాందిపలికిన ఆధునిక భావాలు గల నాయకులు, తొలి కాంగ్రెస్ వాదులైన ముల్లా అబ్దుల్ ఖయ్యుం, అఘోరనాథ్ ఛటోపాధ్యాయ లాంటి వారు హైద్రాబాద్లో తొలి ప్రజాబాహుళ్య ఉద్యమానికి నాయకత్వం వహించి స్థానిక ప్రజలలో స్వాతంత్ర్య సమరానికి శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. అదే ‘చాందానగర్ రైల్వే సంఘటన’.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |