Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana State GK MCQs Questions And...

Telangana State GK MCQs Questions And Answers in Telugu,28 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable

Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Telangana State GK MCQs Questions And Answers in Telugu,26 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana State GK MCQs Questions And Answers in Telugu

Q1. సిలికాన్‌ వ్యాలీలో జరిగే గ్లోబల్‌ స్టార్టప్‌ ఎమర్షన్‌ ప్రోగ్రాంకోసం అమెరికాకు చెందిన ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థతో తెలంగాణకు చెందిన ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది?

(a) టీ హబ్‌

(b) టీ – వర్క్స్

(c) IIT – H

(d) WE -HUB

 

Q2. 2020–21 సంవత్సరానికి నిధులు వినియోగంపై ఆన్లైన్‌ ఆడిటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసింది. గ్రామ పంచాయతీల ఆన్లైన్‌ ఆడిటింగ్‌లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన రాష్ట్రము ఏది?

  1. ఆంధ్రప్రదేశ్ 
  2. గుజరాత్
  3. తెలంగాణ 
  4. కేరళ  

 

Q3. జర్మనీకి చెందిన లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?

  1. ఆంధ్రప్రదేశ్ 
  2. గుజరాత్
  3. కేరళ
  4. తెలంగాణ  

 

Q4. తెలంగాణ ప్రభుత్వం 2014లో టిఎస్-ఐపాస్ పేరుతో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. కింది వానిలో ఒకటి దాని లక్షణం కాదు?

(a) అప్లికేషన్ ప్రక్రియలో జాప్యం చేస్తున్న అధికారులను శిక్షించడం

(b) సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు

(c) మెగా ప్రాజెక్టులకు రెండు వారాల్లో క్లియరెన్స్ ఇవ్వడం

(d) ప్రతి స్థాయిలో సమగ్ర పర్యావరణ అనుమతులు పొందేందుకు పద్ధతుల ఏర్పాటు

 

Q5. సాలర్జుంగ్ 1862లో న్యాయశాఖను ఏర్పాటు చేశాడు. మొదటి న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దేలా ను నియమించాడు. నగరాల్లో నూతనంగా మూడు కోర్టులను ఏర్పాటు చేశారు. కింది వాటిలో సరిగ్గా జతకానిది ఏది?

  1. అదాలత్ – ఎ – పాదా షాహి –  1860  
  2. సైన్య వివాదాలకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు –  1855
  3. ఇలాకా పేష్కారీ ప్రాంతంలో వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి గోవిందరావ్ నేతృత్వంలో కోర్టును ఏర్పాటు చేశాడు 1853

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

 

Q6. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొంది, దేశవ్యాప్తంగా జరిగే హస్తకళానైపుణ్య మేళాలో పెంబర్తి ఇత్తడి వస్తువులు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తాయి. ఈ కళకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఇతర కుటీర పరిశ్రమలకు ప్రసిద్ధిపొందిన ప్రాంతాలను జతపరుచుము.

జాబితా – I జాబితా – II

  1. అగరవత్తులు 1. అసిఫాబాద్
  2. తుంగ చాపలు 2. మునేరు (మెదక్)
  3. టస్సర్ సిల్క్ 3. హైదరాబాదు
  4. పట్టు 4.  మహబూబ్నగర్ జిల్లా

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

 

Q7. సెమి సింథటిక్ పెన్సిలిన్ తయారు చేయడంలో మొదటిస్థానం సంపాదించడమేకాక హృదయ చికిత్స విభాగాలలో, న్యూరోసైన్స్ చికిత్స విభాగాలలో దిగువ పేర్కొన్న ఏ కంపెనీ తయారుచేసే ఔషదాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి?

  1. అరబిందో ఫార్మా లిమిటెడ్
  2. రెడ్డీస్ లాబొరేటరీస్
  3. హెటిరో ఫార్మసీ
  4. శాంతా బయోటిక్స్

 

Q8. ఎవరినీ గ్రేట్ ముస్లిం, గ్రేట్ ఇండియన్, గ్రేట్ మాన్ గా సరోజినీ నాయుడు వర్ణించారు?

(a) మోల్వీ మోహిత్ హుస్సేన్

(b) ముల్లా అబ్దుల్ ఖయ్యుం

(c) అఘోరనాధ్ ఛటోపోధ్యాయ

(d) మహ్మద్ అక్రామ్

 

Q9. ఖిలాఫత్ ఉద్యమంలో హైద్రాబాద్లోని విద్యావంతులైన ముస్లింలు టర్కులపట్లతమ సానుభూతిని ప్రకటించిన సంస్థ ఏది?

(a) ద రెడ్ క్రిసెంట్ సొసైటీ

(b) తబ్లిక్

(c) ఆర్య సమాజ్

(d) ఖలీఫా పీఠం

 

Q10. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?

  1. నిఖత్‌ జరీన్‌
  2. జిత్‌పాంగ్‌ జుతమాస్‌
  3. మేరీకోమ్‌
  4. డిమెట్రియస్ ఆండ్రేడ్

Solutions:

S1. Ans (a)

Sol: సిలికాన్‌ వ్యాలీలో జరిగే గ్లోబల్‌ స్టార్టప్‌ ఎమర్షన్‌ ప్రోగ్రాంకోసం అమెరికాకు చెందిన ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థతో టీహబ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లోని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వీలు కలగనుంది. ఐదు వారాల ప్రాజెక్టులో భాగంగా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఉంటాయని టీహబ్‌ సీఈవో ఎం.ఎస్‌.ఆర్‌. తెలిపారు.తొలి మూడు స్థానాల్లో నిలిచిన స్టార్టప్‌లకు ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థ నుంచి లక్ష అమెరికా డాలర్ల వ్యూహాత్మక నిధులు అందుతాయన్నారు.

 

S2. Ans (c)

Sol: 2020–21 సంవత్సరానికి నిధులు వినియోగంపై ఆన్లైన్‌ ఆడిటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నాయి. కేంద్రం విధించిన నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతం తో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్ర ప్రదేశ్, 59శాతంతో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్‌ ఎడిటింగ్‌ పూర్తి చేశాయి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. వరుసగా రెండోసారి రాష్ట్రం ఆన్లైన్‌ ఆడిటింగ్‌లో నంబర్‌వన్‌గా నిలవడం విశేషం.

 

S3. Ans (d)

Sol: ఇండో జర్మన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6న హైదరాబాద్‌లో సంయుక్తంగా నిర్వహించిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జర్మనీకి చెందిన లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె.లిండ్నర్, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ ఎంవోయూ కుదిరింది. ఒప్పందం ప్రకారం తెలంగాణలో జీఎంబీహెచ్‌ సంస్థ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఆధునిక డిజైనింగ్, తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఎలక్ట్రిక్, ఐసీఈ వాహన రంగంలో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహనాలకు అవసరమైన మెగ్నీషియం ఉత్పత్తులను తయారు చేస్తుంది.

 

S4. Ans (d)

Sol: తెలంగాణ ప్రభుత్వం 2014లో టిఎస్-ఐపాస్ పేరుతో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి స్థాయిలో సమగ్ర పర్యావరణ అనుమతులు పొందేందుకు పద్ధతుల ఏర్పాటు అనేది దాని లక్షణం కాదు.

 

S5. Ans (a)

Sol: సాలర్జుంగ్ 1862లో న్యాయశాఖను ఏర్పాటు చేశాడు. మొదటి న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దేలా ను నియమించాడు.

న్యాయపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను న్యాయ శాఖ మంత్రి దివాన్ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి.

నగరాల్లో నూతనంగా మూడు కోర్టులను ఏర్పాటు చేశారు.

  • అదాలత్ – ఎ – పాదా షాహి (1853)
  • సైన్య వివాదాలకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు (1855)
  • ఇలాకా పేష్కారీ ప్రాంతంలో వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి గోవిందరావ్ నేతృత్వంలో కోర్టును ఏర్పాటు చేశాడు (1860)

 

S6. Ans (c)

Sol: కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతంగా కళాఖండాలు చెక్కే కళ వరంగల్లోని పెంబర్తి అనే గ్రామంలో పుట్టింది. పెంబర్తి ఇత్తడి కళ ప్రపంచ ప్రఖ్యాతి పొంది, దేశవ్యాప్తంగా జరిగే హస్తకళానైపుణ్య మేళాలో పెంబర్తి ఇత్తడి వస్తువులు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తాయి. ఈ కళకు భౌగోళిక గుర్తింపు లభించింది. ఇతర కుటీర పరిశ్రమలకు ప్రసిద్ధిపొందిన ప్రాంతాలు

  • అగరవత్తులు హైదరాబాదు
  • పట్టు మునేరు (మెదక్), వరంగల్, ఆదిలాబాద్
  • తుంగ చాపలు మహబూబ్నగర్ జిల్లా
  • టస్సర్ సిల్క్ అసిఫాబాద్ (ఆదిలాబాద్), మహదేవపూర్ (కరీంనగర్)

 

S7. Ans (a)

Sol: అరబిందో ఫార్మా లిమిటెడ్: ఈ ఔషద తయారీ సంస్థ పి.వి. రామప్రసాదొడ్డి గారీచే 1986లో హైదరాబాదులోని హైటెక్ సిటీలో స్థాపించబడింది. కె. నిత్యానందరెడ్డి మొదలైన వారితో ఒక సమూహంగా ఏర్పడి 1988-89లో ఈ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ 1992లో పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి 1995 లో స్టాక్ ఎక్సేంజ్లో తన షేర్లను నమోదు చేసుకొంది.

సెమి సింథటిక్ పెన్సిలిన్ తయారు చేయడంలో మొదటిస్థానం సంపాదించడమేకాక హృదయ చికిత్స విభాగాలలో, న్యూరోసైన్స్ చికిత్స విభాగాలలో ఈ కంపెనీ తయారుచేసే ఔషదాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి

 

S8. Ans (b)

Sol: హైదరాబాద్ హిందూ-ముస్లిం ఐక్యతకు జాతీయ భావస్ఫూర్తితో పనిచేసిన ముస్లిం మేధావుల్లో ముల్లా అబ్దుల్ ఖయ్యుంను ముఖ్యుడిగా పేర్కొనవచ్చు. ఆయనను గ్రేట్ ముస్లిం, గ్రేట్ ఇండియన్, గ్రేట్ మాన్ గా సరోజినీ నాయుడు వర్ణించారు.

 

S9. Ans(a)

Sol: 1912 బాల్కన్ యుద్ధంలో టర్కీల ఓటమి వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలు ఆంగ్లేయులపట్ల వ్యతిరేక వైఖరి ఎంచుకొన్నారు. హైదరాబాద్ ముల్లా అబ్దుల్ బాసిద్ ద రెడ్ క్రీసెంట్ సొసైటీలో ప్రధానపాత్ర వహించాడు. హైదరాబాద్ లోని విద్యావంతులైన ముస్లింలు టర్కుల పట్ల తమ సానుభూతిని ప్రకటించారుS9. 

 

S10. Ans (a)

Sol: టర్కీలోని ఇస్తాంబుల్‌ వేదికగా జరుగుతోన్న 12వ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌–2022లో భారత మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం గెలిచింది. మే 19న జరిగిన 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీ ఫైనల్లో తెలంగాణకి చెందిన నిఖత్‌ 5–0తో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌పై విజయం సాధించింది. దీంతో భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ రికార్డులకెక్కింది. మేరీకోమ్‌ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్‌ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.

 

**************************************************************************

General Awareness MCQS Questions And Answers in Telugu, 27 July 2022, For APPSC Group-4 And AP Police Recruitment_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!