Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Telangana State GK MCQs Questions And Answers in Telugu.
Q1. ఈ క్రింది వానిలో హైదరాబాద్ రాష్ట్రంలో లేని భూస్వామ్య పద్ధతి
(a) ఇనాందారీ పద్ధతి
(b) జాగీర్దారీ పద్ధతి
(c) జమీందారీ పద్ధతి
(d) సంస్థానాలు
Q2. ‘బండేనక బండి గట్టి 16 బండ్లు గట్టి.. నైజాం సర్కరోడ‘ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు?
(a) గద్దర్
(b) బండి యాదగిరి
(c) దాశరథి రంగాచార్యులు
(d) దేవులపల్లి వెంకటేశ్వరరావు
Q3. సాలార్జంగ్ ప్రధానిగా వచ్చిన సమయంలో దేశముఖు, భూస్వాములు, రోహిల్లాలు, తాలుకార్లు మొదలగు వారు రైతులను దోపిడీలు, లూటీలు చేసేవారు. ప్రధాని పదవి చేపట్టక ముందే సాలార్జంగ్ ఎక్కడ పనిచేశాడు?
- మెదక్ తాలూకాదారుగా పనిచేశాడు
- రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశాడు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1, 2 కాదు
Q4. కింది ప్రకటనలు పరిశీలించండి.
- తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన వారు ఏలె లక్ష్మణ్.
- రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రచించినది అందెశ్రీ (అందె ఎల్లయ్య).
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1, 2 కాదు
Q5. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TNGC) సంబంధించి కింది వాటిలో సరైనవి?
- కలప ఆధారిత పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి తోటలను పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.
- ఈ సంస్థ నీలగిరి మరియు వెదురు వంటి వివిధ జాతులను పెంచుతుంది.
- స్థానిక సమాజాలు, గిరిజనులు మరియు గ్రామీణ ప్రజలకు లాభదాయకమైన ఉపాధిని అందించి ప్రజలలో పర్యావరణ అవగాహన పెంచుతుంది.
- ఫారెస్ట్ స్టీవార్షిప్ కౌన్సిల్ (అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ) కింద తోటలను దృవీకరించడానికి టిఎస్ఎఫ్ఎసి ఒక కొత్త చొరవ తీసుకుంది.
(a) 3 మాత్రమే
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 1, 2, 3, 4
(d) 1, 3 మరియు 4
Q6. ప్రాణహిత నది కి సంబంధించి ఈ కింది వాటిలో ఏది అసత్యం?
- పెనంగా, వార్ధా, వెయిన్ గంగా నది యొక్క మిశ్రమ జలాలను అందిస్తున్న ప్రాణహిత కృష్ణా నది యొక్క అతిపెద్ద ఉపనది.
- భారతదేశంలో 7వ అతిపెద్ద ఉప పరివాహక ప్రాంతమైన ప్రాణహిత నది 1,09,078 చ.కి.మీ కలిగి ఉంది.
- ప్రాణహిత జలవిద్యుత్ ప్రాజెక్టు మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో కౌతాల (సిర్పూర్ కాగజ్నగర్) సమీపంలో ఉంది
(a) 1, 2 మాత్రమే
(b) 1, 3 మాత్రమే
(c) 2, 3 మాత్రమే
(d) 1, 2 & 3
Q7 జిల్లాలవారీగా చూసినప్పుడు చాలా జిల్లాలలో ఎంత శాతం మంది వ్యవసాయరంగం & సేవారంగంపై ఆధారపడి ఉన్నారు?
- 53% & 54%
- 50% & 20%
- 29% & 18 %
- 17% & 13.4%
Q8. ‘నిర్మల్ కొయ్య బొమ్మల’ను ఏ కలపతో తయారు చేస్తారు?
- ఇండియన్ రోజ్వుడ్
- పుణికి
- కాజురైనా
- టేకు
Q9. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత కొరకు 1940 సెప్టెంబర్ 11 న వ్యక్తిగత సత్యాగ్రహం చేసినది ఎవరు?
- స్వామి రామానంద తీర్థ
- కాశీనాథ్ రావు వైద్య
- భాగ్యరెడ్డి వర్మ
- జి .రామాచారి
Q10. జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం:
- ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా ఏపీలో కలిపారు, పూర్తిగా కోల్పోయిన మండలాలు :
1. కుకునూరు 2. కూనవరం 3. వేలేరుపాడు 4. VR పురం (వర రామచంద్రాపురం) 5. చింతూరు - ఖమ్మం జిల్లాలోని 2 మండలాలను పాక్షికంగా ఏపీలో కలిపారు. పాక్షికంగా కోల్పోయిన మండలాలు – 1. భద్రాచలం 2. బూర్గంపహాడ్.
దిగువ ఇవ్వబడిన కోడ్ల నుండి సరైన ఎంపికను ఎంచుకోండి
- 1 మాత్రమే
- 2 మాత్రమే
- 1 మరియు 2 రెండూ
- 1, 2 కాదు
Solutions:
S1. Ans (c)
Sol: హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ రకాల భూ స్వామ్య విధానాలు ఉండేవి.
a) జాగీర్లు
b) సంస్థానాలు
C) ఇనాందార్లు
d) సర్ఫేఖాస్
e) ఖల్సా/దివానీ/రైత్వారీ
S2. Ans (b)
Sol: ‘బండేనక బండి గట్టి 16 బండ్లు గట్టి.. నైజాం సర్కరోడ‘ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు- బండి యాదగిరి.
S3. Ans (c)
Sol: ప్రధానిగా ఉన్న తన మామ సిరాజ్-ఉల్-ముల్క్ మరణాంతరం నిజాం నాసిరుద్దాలకు ప్రధానిగా సాలార్జంగ్ ను 1853లో నిజాం నియమించుకున్నాడు. సాలార్జంగ్ ప్రధానిగా వచ్చిన సమయంలో దేశముఖు, భూస్వాములు, రోహిల్లాలు, తాలుకార్లు మొదలగు వారు రైతులను దోపిడీలు, లూటీలు చేసేవారు. ప్రధాని పదవి చేపట్టక ముందే సాలార్జంగ్ :
- మెదక్ తాలూకాదారుగా పనిచేశాడు
- రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశాడు.
ఇతను 30 సం. లు దివాన్ గా ముగ్గురు నిజాంల వద్ద పనిచేశాడు.
1) నాసిరుద్దాలా – 1853-57
2) అఫ్టలుద్దాలా – 1857-69
3) మీర్ మహబూబ్ అలీ ఖాన్ – 1869-83
S4. Ans (c)
Sol:
- తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన వారు ఏలె లక్ష్మణ్. లక్ష్మణ్ ఏలె (జూన్ 8 , 1965) ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు. ఇతను నల్గొండ జిల్లా కు చెందినవాడు.
- రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రచించినది అందెశ్రీ (అందె ఎల్లయ్య). ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య
S5. Ans (c)
Sol: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TNGC):
- కలప ఆధారిత పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి తోటలను పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.
- ఈ సంస్థ నీలగిరి మరియు వెదురు వంటి వివిధ జాతులను పెంచుతుంది.
- స్థానిక సమాజాలు, గిరిజనులు మరియు గ్రామీణ ప్రజలకు లాభదాయకమైన ఉపాధిని అందించి ప్రజలలో పర్యావరణ అవగాహన పెంచుతుంది.
- ఫారెస్ట్ స్టీవార్షిప్ కౌన్సిల్ (అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ) కింద తోటలను దృవీకరించడానికి టిఎస్ఎఫ్ఎసి ఒక కొత్త చొరవ తీసుకుంది.
S6. Ans (b)
Sol: ప్రాణహిత :
- పెన గంగా, వార్ధా, వెయిన్ గంగా నది యొక్క మిశ్రమ జలాలను అందిస్తున్న ప్రాణహిత గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది.
- ఈ నది కాలువలు విదర్భ మరియు సాత్పూరా యొక్క దక్షిణ వాలులో విస్తరించి ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు వెంట ప్రవహిస్తుంది.
- భారతదేశంలో 7వ అతిపెద్ద ఉప పరివాహక ప్రాంతమైన ప్రాణహిత నది 1,09,078 చ.కి.మీ’ కలిగి ఉంది.
- ప్రాణహిత జలవిద్యుత్ ప్రాజెక్టు మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో కౌతాల (సిర్పూర్ కాగజ్నగర్) సమీపంలో ఉంది
S7. Ans (b)
Sol: జిల్లాలవారీగా చూసినప్పుడు చాలా జిల్లాలలో 50% మంది పనిచేసేవారు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. తరవాత స్థానంలో 20% మంది సేవారంగంపై ఆధారపడి ఉన్నారు. సేవారంగంలో చూపిన హోటళ్ళు – రెస్టారెంటులు, వ్యాపారాలలో అత్యధికంగా ఉద్యోగం – ఉపాధి అవకాశం లభించాయి. హైదరాబాద్ నగరంలో 83% మంది సేవారంగంలో పనిచేస్తున్నారు. సాంఘిక, స్వంత సంస్థలలో పనిచేసేవారు 29%, రెస్టారెంట్, హోటళ్ళు – 21.71 రవాణా రంగం, 17%, నిర్మాణ రంగంలో 13.4% మంది కార్మికులు పనిచేస్తున్నారు. 5% మంది మాత్రమే ఐటిరంగంలో ఉన్నారు.
S8. Ans (b)
Sol: తెలంగాణలో నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. వీటి తయారీకి స్థానికంగా దొరికే కలప, రంగులను వాడతారు. వీటికి వాడే కలప ‘పునిక కర్ర’ ఇది తేలికగా, అందంగా తీర్చిదిద్దడానికి అనువుగా ఉంటుంది. పేయింటింగ్స్ కోసం డ్యూకో పేయింట్స్ వాడతారు.
ఈ కళాకారులు “గనిజా” అనే ప్లేయింగ్ కార్డ్స్ తయారుచేస్తారు. వీటిపై పేటెంట్ పొందిన సంవత్సరం 2010. నిర్మల్ ఫర్నీచర్పై భౌగోళిక గుర్తింపు (G.I) పొందిన సంవత్సరం 2009
S9 . Ans (a)
Sol: హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం ఎత్తివేత కొరకు 1940 సెప్టెంబర్ 11 న రామానందతీర్థ వ్యక్తిగతంగా మళ్లీ సత్యాగ్రహం ప్రారంభించినాడు.
S10. Ans (c)
Sol: జూలై 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 5 మండలాలను పూర్తిగా, 2 మండలాలను పాక్షికంగా ఏపీలో కలిపారు.
- పూర్తిగా కోల్పోయిన మండలాలు – 1. కుకునూరు 2. కూనవరం 3. వేలేరుపాడు 4. VR పురం (వర రామచంద్రాపురం) 5. చింతూరు
- పాక్షికంగా కోల్పోయిన మండలాలు – 1. భద్రాచలం 2. బూర్గంపహాడ్
- భద్రాచలం మండలం నుంచి భద్రాచలం పట్టణం మినహా 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలను, బూర్గంపహాడ్ మండలం నుంచి 6 రెవెన్యూ గ్రామాలను, 4 గ్రామ పంచాయతీలు ఏపీలో కలిశాయి.
- మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 327 రెవెన్యూ గ్రామాలను, 87 గ్రామ పంచాయతీలను కోల్పోయింది.
- 46 మండలాలకుగాను 5 మండలాలను పూర్తిగా కోల్పోవడంతో ఖమ్మం జిల్లాలో 41 మండలాలు మిగిలాయి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |