Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Telangana State GK – ప్రశ్నలు
Q1. ఢిల్లీ సామ్రాజ్యంలో భాగమైన తర్వాత ‘సుల్తాన్పూర్’గా మారిన ప్రాంతం?
(A) హనుమకొండ
(B) కొలనుపాక
(C) ఓరుగల్లు
(D) గోల్కొండ
Q 2. పల్నాటి యుద్ధం ఎవరి కాలంలో జరిగింది?
(A). రుద్రమ దేవి
(B). గణపతిదేవుడు
(C) రెండో ప్రతాప రుద్రుడు
(D) రుద్ర దేవ
Q3. కాకతీయుల కాలంలో చిత్రశాలను నిర్మించినవారు ఎవరు ?
(A) లీలావతి
(B) గౌతమి బాలశ్రీ
(C) మాచలదేవి
(D) లలితాంబ
Q4. కాయస్థ వంశ మూలపురుషుడు?
(A) బేతరాజు
(B) గంగయ సాహిణి
(C) ఎర్రనరేంద్రుడు
(D) సారంగధరుడు
Q5. మొదటగా కాకతీయులను ఎదిరించి స్వతంత్ర పాలనకు పూనుకున్న పాలకుడు ఎవరు?
(A) అంబదేవుడు
(B) గంగయసాహిణి
(C) ఎర్రనరేంద్రుడు
(D) సారంగధరుడు
Q6. కాకతి రుద్రమదేవి ఎవరి చేతిలో మరణించింది?
(A) గంగయసాహిణి
(B) జన్నికదేవ
(C) అంబదేవుడు
(D) కాపయ నాయక
Q7. కాకతీయ రాజ్యంలో శ్రేష్టమైన వస్త్రాలు ఉన్నాయని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు?
(A) మెగస్తనీస్
(B) ప్లీని
(C) మార్కోపోలో
(D) నికోలో కాంటి
Q8 .గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు రాసిన విదేశీ యాత్రికుడు?
(A) టాలెమి
(B) మార్కోపోలో
(C) ప్లీని
(D) కొలంబస్
Q9. కాకతీయుల కాలంలో వేశ్యలపై విధించిన పన్ను ఏంటి
(A) భూమి పన్ను
(B) గణాచారి పన్ను
(C) వృత్తి పన్ను
(D) పైవేవి కావు
Q10. కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు ?
(A) పెరికె ఎండ్ల సుంకం
(B) అమ్మబడి సుంకం
(C) అరి
(D) పెన్టు సుంకం
Solutions:
Q1. Ans : C
జునాఖాన్ కాకతీయ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ రాజ్యంతో కలిపి ఓరుగల్లు పేరును ‘సుల్తాన్పూర్’ గా మార్చివేశాడు. ఈ విధంగా క్రీ.శ. 1323లో కాక తీయ రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది.
Q2 Ans : A
ప్రఖ్యాత పల్నాటి యుద్ధం రుద్రదేవుని కాలంలోనే జరిగింది. ఈ యుద్ధంలో రుద్రదేవుడు నలగామరాజుకు సహకరించాడు. క్రీ.శ. 1195 ప్రాంతంలో రుద్రదేవుడు యాదవరాజైన జైతుగి చేతిలో హతుడయ్యాడు.
Q3. Ans : C
రెండవ ప్రతాపరుద్రుడు (1289 – 1323) కాలంలో “మాచల్దేవి” అనే కళాకారిణి వుండేది. మాచల్దేవి ప్రముఖ పేరిణి నృత్యకారిణి. మాచల్దేవి చిత్రశాలను నిర్మించినది.
Q4 Ans : B
గంగయసాహిణి కాయస్థ రాజుల్లో మొదటివాడు. కాకతి గణపతి దేవుని ఆదరణ పొంది, కొంతకాలం అశ్వికసాహిణిగా అనంతరం మాండలిక ప్రభు వుగా నియమితుడైనాడు. ఇతని కాలంలో త్రిపురాంతకంలో శాసనం వేయించారు. గంగయసాహిణికి మహా మండలేశ్వర, చాతు ర్వర్గ సముద్ధరణ. నాయక నారాయణ, వీరావతార వంటి బిరుదులు న్నట్లు తెలుస్తుంది.
Q5.Ans: A
అంబదేవుడు కాయస్థ వంశస్థుల్లో ఘనుడు. క్రీ.శ. 1272 1303 మధ్య పాలించినట్లు తెలుస్తుంది. ఇతడు గంగయసాహిణి మూడో మేనల్లుడు. మొదటగా కాకతీయులను ఎదిరించి స్వతంత్ర పాలనకు పూనుకున్నాడు. రుద్రమదేవికి సమకాలికుడు.
Q 6. Ans (C)
రుద్రమదేవి కాలంలో రాజకీయాధిపత్యాన్ని ధిక్కరించి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న సామంతుడు కాయస్థ అంబదేవుడు. కాకతీయులపై అంబదేవుడు విజయం సాధించినట్లు ‘చందుపట్ల శాసనం’ తెలుపుతుంది. కాయస్థ అంబదేవుడితో జరిగిన పోరులో రుద్రమతో పాటు ప్రధానసేనాని మల్లిఖార్జునుడు మరణించినట్లు తెలుస్తుంది.
Q 7. Ans (C)
పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఇరవైకి మించిన రకరకాల వస్ర్తాలను పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖ్మల్ వస్ర్తాలు నేసేవారు. పాల్కురికి బసవపురాణంలో యాభై రకాల బట్టల పేర్లను పేర్కొనడాన్ని బట్టి, కాకతీయుల రాజ్యంలో శ్రేష్టమైన సన్నని వస్ర్తాలు నేసేవారని ఆ బట్టలు సాలెపురుగు జాలెవలే ఉండేవని మార్కోపోలో ప్రశంసించడాన్ని బట్టి ఆనాటి పద్మశాలీలు గొప్ప నైపుణ్యం గలవారని తెలుస్తుంది.
Q 8. Ans (B)
పల్లకీల మీద చెక్కిన నగిషీల వర్ణను బట్టి ఆ నాటి వడ్రంగులు మంచి నైపుణ్యంగలవారని తెలుస్తుంది. పంచలోహాలతో పలు రకాల వస్తువులు తయారుచేసేవారు. నిర్మల్లో తయారైన కత్తులకు డెమాస్కస్లో కూడా మంచి పేరుండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రపు గనులున్నట్లు మార్కోపోలో రాశాడు.
Q 9. Ans (B)
కాకతీయుల కాలం లో వైశ్యలపై మరియు బిచ్చగాళ్లపై గణాచారి పన్ను విధించేవారు. పశువుల మేతపై పుల్లరీ పన్ను విధించేవారు. రాజదర్శనం కోసం దరిశనం అనే పన్ను చెల్లించేవారు.
Q 10. Ans (c)
రాజ్య ఆదాయానికి భూమిశిస్తు ప్రధాన మార్గం. భూమిని గడ / దండ /కోల అనే ప్రమాణంతో కొలిచేవారు. భూమి శిస్తును అరి అనేవారు. సాధారణంగా భూమి శిస్తు 1/6 వ వంతు ఉండేది. పన్నులు ధాన్య, ధనరూపంలో చెల్లించేవారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |