Telangana State GK MCQs Questions And Answers in Telugu : Practice General awareness Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions, Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
Telangana State GK MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana State GK MCQs Questions And Answers in Telugu
Q 1. దిగువ పేర్కొన్నవి పరిగణనలోకి తీసుకోండి.
- కళా సాహిత్యానికి గొప్ప పోషకుడైన ఆయన సంస్కృతంలో ‘నితిసార‘ అనే రచన చేశారు.
- అనమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
రుద్రదేవుడు గురించి దిగువ పేర్కొన్న ప్రకటన (లు) ఏది సరైనది/సరైనది?
(a) I మాత్రమే
(b) II మాత్రమే
(c) I మరియు II రెండూ
(d) I, II కాదు
Q 2. దిగువ వాటిని జతచేయండి
జాబితా I (రచయితలు ) జాబితా II (రచనలు)
- నేబతి కృష్ణమంత్రి 1. కుముదవల్లీ విలాసం
- ఎలకూచి బాలసరస్వతి 2. తోతినామా (అనువాద కథలు)
- గవాసి 3. యాదవ రాఘవ పాండవీయం
- పొనుగోటి జగన్నాథరాయలు 4. రాజనీతి రత్నాకరం
Code:
a b c d
(a) 4 3 2 1
(b) 1 2 3 4
(c) 3 2 4 1
(d) 1 4 2 3
Q 3. 1957-66 మధ్య ఫ్యాక్టరీల చట్టం కింద నమోదయిన ఫ్యాక్టరీల సంఖ్య ఆంధ్ర మరియు తెలంగాణలో వరుసగా ఎంత శాతం?
(a) 2.2% & 12.7%
(b) 15% & 10%
(c) 12.7% & 15%
(d) 12.7% & 2.2
Q 4. వ్యవసాయ పరపతి 2019-20 జులై బడ్జెట్లో 12 లక్షల కోట్లు ఉండగా , 2020-21 బడ్జెట్లో ఎన్ని కోట్లు లక్ష్యంగా నిర్ధేశించెను?
(a) 13 లక్షల కోట్లు
(b) 15 లక్షల కోట్లు
(c) 10 లక్షల కోట్లు
(d) 18 లక్షల కోట్లు
Q 5. ప్రతిపాదన (A): వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.
కారణము (R) : మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది.
సమాధానం :
(a) (A) మరియు (R) నిజం (R). (A) కు సరియైన వివరణ
(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.
(c) (A) నిజం (R) తప్పు
(d) (A) తప్పు కాని (R) నిజం
Q 6. ఈ క్రింది వానిలో హైదరాబాద్ రాష్ట్రంలో లేని భూస్వామ్య పద్ధతి
(a) ఇనాందారీ పద్ధతి
(b) జాగీర్దారీ పద్ధతి
(c) జమీందారీ పద్ధతి
(d) సంస్థానాలు
Q 7. ‘బండేనక బండి గట్టి 16 బండ్లు గట్టి.. నైజాం సర్కరోడ‘ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు?
(a) గద్దర్
(b) బండి యాదగిరి
(c) దాశరథి రంగాచార్యులు
(d) దేవులపల్లి వెంకటేశ్వరరావు
Q 8. సాలార్జంగ్ ప్రధానిగా వచ్చిన సమయంలో దేశముఖు, భూస్వాములు, రోహిల్లాలు, తాలుకార్లు మొదలగు వారు రైతులను దోపిడీలు, లూటీలు చేసేవారు. ప్రధాని పదవి చేపట్టక ముందే సాలార్జంగ్ ఎక్కడ పనిచేశాడు?
- మెదక్ తాలూకాదారుగా పనిచేశాడు
- రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశాడు.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1, 2 కాదు
Q 9. కింది ప్రకటనలు పరిశీలించండి.
- తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన వారు ఏలె లక్ష్మణ్.
- రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రచించినది అందెశ్రీ (అందె ఎల్లయ్య).
(a) 1 మాత్రమే
(b) 2 మాత్రమే
(c) 1 మరియు 2 రెండూ
(d) 1, 2 కాదు
Q10. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TNGC) సంబంధించి కింది వాటిలో సరైనవి?
- కలప ఆధారిత పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి తోటలను పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.
- ఈ సంస్థ నీలగిరి మరియు వెదురు వంటి వివిధ జాతులను పెంచుతుంది.
- స్థానిక సమాజాలు, గిరిజనులు మరియు గ్రామీణ ప్రజలకు లాభదాయకమైన ఉపాధిని అందించి ప్రజలలో పర్యావరణ అవగాహన పెంచుతుంది.
- ఫారెస్ట్ స్టీవార్షిప్ కౌన్సిల్ (అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ) కింద తోటలను దృవీకరించడానికి టిఎస్ఎఫ్ఎసి ఒక కొత్త చొరవ తీసుకుంది.
(a) 3 మాత్రమే
(b) 2 మరియు 3 మాత్రమే
(c) 1, 2, 3, 4
(d) 1, 3 మరియు 4
Solutions:
S1. Ans (c)
Sol: కళ్యాణి చాళుక్యులు బలహీన మవ్వడంతో రుద్రదేవుడు హనుమకొండలో పూర్తి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతను పూర్తి స్వతంత్ర పాలన చేసిన మొదటి కాకతీయ రాజు. కళా సాహిత్యానికి గొప్ప పోషకుడైన ఆయన సంస్కృతంలో ‘నితిసార‘ అనే రచన చేశారు. అనమకొండలో రుద్రేశ్వర ఆలయం / వేయిస్తంభాల గుడిని నిర్మించాడు.
S2. Ans: (b)
Sol: నేబతి కృష్ణమంత్రి – రాజనీతి రత్నాకరం
ఎలకూచి బాలసరస్వతి – యాదవ రాఘవ పాండవీయం
పొనుగోటి జగన్నాథరాయలు – కుముదవల్లీ విలాసం
గవాసి – తోతినామా (అనువాద కథలు)
S3. Ans(d)
Sol: ప్రాంతాలవారిగా పరిశ్రమల మీద కేంద్రం పెట్టిన పెట్టుబడులు తెలంగాణలో 84.86కోట్లు ఆంధ్రలో 41.71 కోట్లు అదేవిధంగా 1957-66 మధ్య ఫ్యాక్టరీల చట్టంకింద నమోదయిన ఫ్యాక్టరీల సంఖ్య ఆంధ్రలో 12.7% కాగా తెలంగాణలో 2.2% మాత్రమే.
S4. Ans (b)
Sol: వ్యవసాయ పరపతి 2019-20 జులై బడ్జెట్లో 12 లక్షల కోట్లు ఉండగా, 2020-21 బడ్జెట్లో 15 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ధేశించెను
S5. Ans( a)
Sol: ముఖ్యంగా మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూబదలాయింపులను ఈ చట్టం నిషేధించింది. వలస వచ్చిన గిరిజనేతరులు, గిరిజనులకు చెందిన భూములను ఆక్రమించుకొని వాటికి పట్టాలు కూడా పొందగలిగారు. హద్దులేర్పర్చే సమయానికి డుగా పడిఉన్న భూములను, అంతకుముందు వాటిని ‘శివాయి జమాబంది‘ (ఆక్రమణ) పద్ధతిలో గిరిజనులు సాగుచేస్తూ న్నప్పటికీ, రిజర్వ్ ఫారెస్ట్ కలిపేశారు. విశాలమైన అటవీభూభాగాల నుంచి జనవాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ మాలను కూడా తొలగించడం సాయుధపోరాటాలకు దారితీసింది.
S6. Ans (c)
Sol: హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ రకాల భూ స్వామ్య విధానాలు ఉండేవి.
- a) జాగీర్లు
- b) సంస్థానాలు
- C) ఇనాందార్లు
- d) సర్ఫేఖాస్
- e) ఖల్సా/దివానీ/రైత్వారీ
S7. Ans (b)
Sol: ‘బండేనక బండి గట్టి 16 బండ్లు గట్టి.. నైజాం సర్కరోడ‘ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు- బండి యాదగిరి.
S8. Ans (c)
Sol: ప్రధానిగా ఉన్న తన మామ సిరాజ్-ఉల్-ముల్క్ మరణాంతరం నిజాం నాసిరుద్దాలకు ప్రధానిగా సాలార్జంగ్ ను 1853లో నిజాం నియమించుకున్నాడు. సాలార్జంగ్ ప్రధానిగా వచ్చిన సమయంలో దేశముఖు, భూస్వాములు, రోహిల్లాలు, తాలుకార్లు మొదలగు వారు రైతులను దోపిడీలు, లూటీలు చేసేవారు. ప్రధాని పదవి చేపట్టక ముందే సాలార్జంగ్ :
- మెదక్ తాలూకాదారుగా పనిచేశాడు
- రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశాడు.
ఇతను 30 సం. లు దివాన్ గా ముగ్గురు నిజాంల వద్ద పనిచేశాడు.
1) నాసిరుద్దాలా – 1853-57
2) అఫ్టలుద్దాలా – 1857-69
3) మీర్ మహబూబ్ అలీ ఖాన్ – 1869-83
S9. Ans (c)
Sol:
- తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను రూపొందించిన వారు ఏలె లక్ష్మణ్. లక్ష్మణ్ ఏలె (జూన్ 8 , 1965) ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడు. ఇతను నల్గొండ జిల్లా కు చెందినవాడు.
- రాష్ట్ర అధికారిక గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం రచించినది అందెశ్రీ (అందె ఎల్లయ్య). ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య
S10. Ans (c)
Sol: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TNGC):
- కలప ఆధారిత పరిశ్రమల డిమాండ్ను తీర్చడానికి తోటలను పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ స్థాపించబడింది.
- ఈ సంస్థ నీలగిరి మరియు వెదురు వంటి వివిధ జాతులను పెంచుతుంది.
- స్థానిక సమాజాలు, గిరిజనులు మరియు గ్రామీణ ప్రజలకు లాభదాయకమైన ఉపాధిని అందించి ప్రజలలో పర్యావరణ అవగాహన పెంచుతుంది.
- ఫారెస్ట్ స్టీవార్షిప్ కౌన్సిల్ (అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థ) కింద తోటలను దృవీకరించడానికి టిఎస్ఎఫ్ఎసి ఒక కొత్త చొరవ తీసుకుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |