Telugu govt jobs   »   Current Affairs   »   Telangana Police was awarded FICCI Smart...
Top Performing

Telangana Police was awarded FICCI Smart Policing Award | తెలంగాణ పోలీస్ కు  ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు లభించింది

Telangana Police was awarded FICCI Smart Policing Award | తెలంగాణ పోలీస్ కు  ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు లభించింది

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ ఇటుక బట్టీ కార్మికుల పిల్లలకు విద్యను అందించడంలో చేసిన ప్రశంసనీయమైన కృషికి ప్రతిష్టాత్మక FICCI అవార్డుతో సత్కరించారు. సెప్టెంబర్ 16న ఢిల్లీలో FICCI వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన ‘హోంల్యాండ్ సెక్యూరిటీ- 2023 కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు.

ఉత్తమ సేవలు అందించిన పోలీసు విభాగాలకు అవార్డులు ఇచ్చేందుకు FICCI గతేడాది ‘స్మార్ట్ పోలీసింగ్-22’ పేరుతో దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 17 రాష్ట్రాల్లోని 23 వివిధ పోలీసు విభాగాల నుంచి 117 దరఖాస్తులు అందగా వాటిలో మహేశ్ భగవత్ నిర్వహించిన ‘పని ప్రదేశంలోనే పాఠశాల’ కార్యక్రమానికి ఆవార్డు దక్కింది.

ఆయన రాచకొండ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆపరేషన్ స్మైల్ పథకంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, బొమ్మలరామారం మండలాల్లోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 8550 మంది ఒరిస్సా, మహారాష్ట్రకు చెందిన కార్మికుల పిల్లల్ని సంరక్షించారు. ఆపరేషన్ స్మైల్ పథకంలో భాగంగా ఇది సాధించబడింది. వారి విద్యను సులభతరం చేయడానికి, ఒరియా మరియు మరాఠీ ఉపాధ్యాయులను చేర్చుకున్నారు మరియు స్థానిక అధికారుల సహకారంతో మరియు ఎయిడ్ ఎట్ యాక్షన్ నుండి ఉమా డేనియల్ మరియు సురేష్ విలువైన సహాయంతో, ఈ పిల్లలకు వారి మాతృభాషలో చదువు చెప్పించారు. ఇందుకుగాను మహేశ్ భగవతకు FICCI అవార్డు దక్కింది.

ఢిల్లీలో జరిగిన ఒక వేడుకలో మాజీ డిజి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రకాశ్సంగ్ వంటి ప్రముఖులతో పాటు ఇతర గౌరవనీయమైన అధికారుల సమక్షంలో ఈ అవార్డును మహేష్ భగవత్‌కు అందజేశారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana Police was awarded FICCI Smart Policing Award_4.1

FAQs

TS పోలీసు చిహ్నాన్ని ఎవరు రూపొందించారు?

ఈ లోగోను ASCI నుండి నిపుణుల పర్యవేక్షణలో శ్రీ లక్ష్మణ్ ఏలే రూపొందించారు. దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపి ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.