Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana History MCQs Questions And Answers...

Telangana History MCQs Questions And Answers in Telugu, 26th September 2023 For TSPSC Group 2 & TSPSC Group 3

Telangana History MCQs Questions And Answers in Telugu : Practice Telangana History Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of Telangana History. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana History MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana History MCQs Questions And Answers in Telugu.

Q1. నిజాం రాజ్య కోశాగారంలో ప్రభుత్వ ఖర్చుతో ఏ దేవత పూజ చేసేవారు?

  1. సరస్వతిదేవి
  2. పార్వతిదేవి
  3. దుర్గాదేవి
  4. లక్ష్మిదేవి

Q2. క్రింది శాతవాహన రాజులలో సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరు?

  1. గౌతమిపుత్ర శాతకర్ణి
  2. 2వ శాతకర్ణి 
  3. కుంతల శాతకర్ణి
  4. 2వ పులోమావి

Q3. హైదరాబాద్ రాజ్యంలో హలిసిక్కా అనే వెండి నాణెంను ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు?

  1. అఫ్జల్ఉద్దౌలా 
  2. నిజాం అలీ ఖాన్
  3. సికిందర్ జా
  4. ఎవరు కాదు 

Q4.  తెలంగాణలో తొలి కావ్యమైన గాథాసప్తశతిని రచించింది ఎవరు?

  1. హాలుడు
  2. గుణాడ్యుడు
  3. శర్వవర్మ
  4. విష్ణుశర్మ

Q5. క్రింది తెలంగాణను పరిపాలించిన రాజులను వారియొక్క బిరుదులతో జతపరచండి.

  1. 1వ బేతరాజు                         a. త్రివరనగర భువన యువతి ప్రియుడు 
  2. గౌతమీపుత్ర శాతకర్ణి             b. అరిగజకేసరి
  3. 2వ మాధవ వర్మ                   c. శతసహస్ర హాలక
  4. శ్రీ శాంతమూలుడు             d. దక్షిణాది అశోకుడు

                                                     e. క్షత్రియ దర్పమాణమర్ధన

సరియైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. I-a, II-c, III-e, IV-d
  2. I-c, II-b, III-a, IV-d
  3. I-b, II-e, III-a, IV-c
  4. I-a, II-c, III-e, IV-d

Q6. కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర అనే ఘటికను ఏర్పాటు చేసిన విష్ణుకుండిన రాజు ఎవరు?

  1. విక్రమాశ్రయుడు
  2. ఇంద్రభట్టారక వర్మ
  3. 1వ విక్రమేంద్ర వర్మ
  4. 2వ మాధవవర్మ

Q7. నిజాం కాలంలో క్రింది వారిలో ఎవరికి  ఖిద్మతి ఇనాము భూములను ఇచ్చేవారు?

  1. శివాలయ పూజారులు 
  2. విష్ణు ఆలయ పూజారులు 
  3. దేవదాసీలు 
  4. జోగినీలు 

Q8. తెలంగాణను పరిపాలించిన క్రింది ఏ వంశస్థులను శ్రీ పర్వతీయులు అంటారు?

  1. శాతవాహనులు 
  2. విష్ణుకుండీనులు 
  3. ఇక్ష్వాకులు
  4. ముదిగొండ చాళుక్యులు 

Q9. హైదరాబాద్ సంస్థానం “హైదరాబాద్ రాష్ట్రం”గా ఎప్పుడు మారింది?

  1. 1948 సెప్టెంబర్17
  2. 1948 సెప్టెంబర్ 16
  3. 1949 నవంబర్ 26
  4. 1950 జనవరి 26

Q10. మొదటి సాలార్ జంగ్ సంస్కరణల ఫలితంగా సంభవించిన పరిణామాలకు సంబంధించి సరియైనది?

  1. లోటు బడ్జెట్లో ఉన్న నిజాం రాజ్యం మిగులు బడ్జెట్ గా మారింది. 
  2. రైతులకు మరియు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 
  3. పై రెండూ సరైనవే 
  4. ఏదీ కాదు

Solutions:

S1. Ans. (d)

Sol. నిజాం రాజ్య కోశాగారంలో ప్రభుత్వ ఖర్చుతో లక్ష్మీ దేవత పూజ చేసేవారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు దాన ధర్మాలు చేసేవారు. నిజాం తన దర్బారులో ఈద్, దుస్సేరత్, దీపావళి, హోలీ, వసంత పంచమి పండగలను నిర్వహించేవారు.

S2. Ans. (b)

Sol. శాతవాహన రాజులలో సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది 2వ శాతకర్ణి. ఇతను శాతవాహన రాజులలో ఐదవవాడు. ఇతను అత్యధికంగా 56 సంవత్సరాలు పాలించాడు.

S3. Ans. (a)

Sol. హైదరాబాద్ రాజ్యంలో హలిసిక్కా అనే వెండి నాణెంను  అఫ్జల్ఉద్దౌలా కాలంలో ప్రవేశపెట్టారు. అఫ్జల్ఉద్దౌలా ప్రధాని 1వ సాలార్ జంగ్ ఈ నాణెములను ముద్రించాడు. అఫ్జల్ఉద్దౌలా 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటీష్ వారికి మద్దతు పలికి స్టార్ అఫ్ ఇండియా అనే బిరుదును పొందాడు.

S4. Ans. (a)

Sol. తెలంగాణలో తొలి కావ్యమైన గాథాసప్తశతిని రచించింది హాలుడు. ఇతని బిరుదు కవి వత్సలుడు.

ఇతను గాథాసప్తశతిని ప్రాకృతంలో రచించాడు.ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.

S5. Ans. (c)

Sol.

     1వ బేతరాజు                అరిగజకేసరి   

గౌతమీపుత్ర శాతకర్ణి        – క్షత్రియ దర్పమాణమర్ధన

2వ మాధవ వర్మ                త్రివరనగర భువన యువతి ప్రియుడు

     శ్రీ శాంతమూలుడు     శతసహస్ర హాలక

     వీర పురుషదత్తుడు     దక్షిణాది అశోకుడు 

S6. Ans. (b)

Sol. కీసరగుట్ట సమీపంలో ఘటికేశ్వర అనే ఘటికను ఏర్పాటు చేసిన విష్ణుకుండిన రాజు ఇంద్రభట్టారక వర్మ.

ఇతను విక్రమేంద్రవర్మ కుమారుడు. ఇతను ఘటిక అనే విద్యాసంస్థలను ఏర్పాటు చేసిన మొదటి రాజు. ఘటికలో బ్రాహ్మిణ పండితులు విద్యాభోధన చేసేవారు. 

S7. Ans. (a)

Sol. నిజాం కాలంలో వందలాది శివాలయాలు నిర్మితమయ్యాయి. జంగాలు, వీరముష్టి వారు, స్మార్త బ్రాహ్మణులు శివాలయాల్లో పూజారులుగా ఉండేవారు. వీరికి ప్రభుత్వం దేవాల్ ఇనాము, ఖిద్మతి ఇనాము పేరుతో భూములను ఇచ్చేది. ప్రజలు ఆలయ జాతరలలో ఎక్కువగా పాల్గొనేవారు. 

S8. Ans. (c)

Sol. ఇక్ష్వాకులు శ్రీపర్వతం నుండి పాలించారు కాబట్టి వీరిని శ్రీ పర్వతీయులు అని కూడా అంటారు. ఇక్ష్వాకులు నాగార్జునకొండ దగ్గర గల విజయపురిని రాజధానిగా చేసుకొని పాలించారు. విజయపురి అనగా 

శ్రీ పర్వతం లేదా నాగార్జునకొండ ప్రాంతం.

S9. Ans. (d)

Sol. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీన  హైదరాబాద్ సంస్థానం “హైదరాబాద్ రాష్ట్రం”గా మార్చబడింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని పార్ట్ ‘b’ రాష్ట్రాల జాబితాలో చేర్చారు.

S10. Ans. (c)

Sol. మొదటి సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా లోటు బడ్జెట్లో ఉన్న నిజాం రాజ్యం మిగులు బడ్జెట్ గా మారింది. రైతులకు మరియు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1వ సాలార్ జంగ్ అసలు పేరు – మీర్ తురబ్ ఆలీఖాన్. 1853 సంవత్సరం నుండి 1883 సంవత్సరం వరకు హైదరాబాద్ రాజ్యానికి ప్రధానిగా వ్యవహరించి వివిధ సంస్కరణలు ప్రవేశ పెట్టాడు.  

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website