Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana History MCQs Questions And Answers...

Telangana History MCQs Questions And Answers in Telugu, 22nd September 2023 For TSPSC GROUP 2 & TSPSC GROUP 3

Telangana History MCQs Questions And Answers in Telugu : Practice Telangana History Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of Telangana History. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana History MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana History MCQs Questions And Answers in Telugu.

Q1. ఈ కింది వాటిలో హాలుని ఆస్థానంలోని ప్రసిద్ద కవులు  ఎవరు?

  1. గుణాడ్యుడు
  2. శర్వ వర్మ
  3. (a) మరియు (b)
  4. పైనవేవి కావు

Q2. దక్కన్ సంస్కృతిని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన రాజ వంశం ఏది?

  1. విష్ణుకుండినులు
  2. ఇక్ష్వాకులు 
  3. వాకాటకులు
  4. శాలంకాయనులు

Q3. శాతవాహనుల ముఖ్య ఆదాయ వనరు భూమి శిస్తు. పండిన పంటలో ఎంత శాతాన్ని భూమి శిస్తు గా విధించేవారు?

  1. 1/4వ వంతు
  2. 1/7వ వంతు
  3. 1/6వ వంతు
  4. 1/2వ వంతు

Q4. వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు ఎవరు?

  1. వినయాదిత్య యుద్ధమల్లుడు
  2. పృధు విక్రముడు
  3. పృథ్వీపతి
  4. మొదటి అరికేసరి

Q5. వేములవాడ చాళుక్య వంశంలో చివరివాడు ఎవరు?

  1. మూడవ అరికేసరి
  2. బద్దెగ
  3. మొదటి అరికేసరి
  4. రెండవ అరికేసరి

Q6. కళ్యాణి చాళుక్యులను ఏమని పిలుస్తారు?

  1. పశ్చిమ చాళుక్యులు
  2. వేములవాడ చాళుక్యులు
  3. ముదిగొండ చాళుక్యులు
  4. వేంగి చాళుక్యులు

Q7. ముసునూరి నాయకులు ఏ ప్రాంతం రాజధానిగా పాలన ప్రారంభించారు?

  1. రేఖపల్లి
  2. ఓరుగల్లు
  3. వల్లూరు
  4. రాజమహేంద్రవరం

Q8. సంస్కృతంలో వసంత రాజీయంఅనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు?

  1. రాచ వేమారెడ్డి
  2. కాటయ వేమారెడ్డి
  3. కుమారగిరి రెడ్డి
  4. అనవేమారెడ్డి

Q9. 1350లో హసన్ గంగూ తెలంగాణలోని ఏ దుర్గంపై దండయాత్ర చేసి ఆక్రమించాడు?

  1. రాచకొండ
  2. భువనగిరి
  3. కౌలాస్
  4. నల్లగొండ

Q10. ‘తెలంగాణాఅనే పదం వీళ్ల కాలం నుండే బహుళ ప్రచారం పొందింది.?

  1. కుతుబ్‌షాహీ యుగం
  2. కాకతీయ యుగం
  3. ఖిల్జీ యుగం
  4. శాతావాహన యుగం

Solutions : 

S1.ANS.(c)

Sol.  హాలుని ఆస్థానంలోని ప్రసిద్ద కవులు  : గుణాడ్యుడు, శర్వ వర్మ.

  1. గుణాడ్యుడు: ఇతడుబృహత్ కథగ్రంధాన్ని ‘ ‘పైశాచికపాకృతంలో రచించాడు. ఇతడు తొలి తెలంగాణ కవి.
  2. శర్వ వర్మ :  ‘కాతంత్య్ర వ్యాకరణంగ్రంథకర్త. సులభపద్ధతిలో సంస్కృతం నేర్చుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది.

S2. ANS (c)

Sol. క్రీ.శ. మూడో శతాబ్దం మధ్య భాగం నుంచి ఆరో శతాబ్దం మధ్య భాగం వరకు దక్కను పరిపాలించిన రాజ వంశాలన్నింటిలో వాకాటకులకు ప్రత్యేకమైన స్థానముంది. దక్కన్ సంస్కృతిని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన రాజ వంశం వాకాటకులది, శాతవాహన సామ్రాజ్యం పతనమయిన తరువాత మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో అభీరులు, బీరార్ ప్రాంతంలో వాకాటకులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు.

S3. ANS (c)

Sol. శాతవాహనుల కాలం నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ముఖ్య ఆదాయ వనరు భూమి శిస్తు. పండిన పంటలో 1/6వ వంతు లేదా 18 శాతం భూమి శిస్తు (దేవమేయ) విధించేవారు.

S4. ANS (a)

Sol. వినయాదిత్య యుద్ధమల్లుడు (క్రీ.శ.750-775) వేములవాడ చాళుక్యుల నిజమైన స్థాపకుడు. ఇతని రాజధాని బోధన్. గోదావరి నదికి దక్షిణాన గల మంజీరా నది నుండి మహాకాళేశ్వర పర్వంతం వ్యాపించి ఉన్న చూభాగమే పోదనపాడుదీనినే సపదాలక్షదేశం అంటారు. ఇదే నేటి వేములవాడ చాళుక్య రాజ్యం. ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడు యొక్క సేనాధిపతి, తరువాత సామంత రాజు అయ్యాడు.

S5. Ans (a)

Sol. మూడవ అరికేసరి (క్రీ.శ.965-973) వేములవాడ చాళుక్య వంశంలో చివరివాడు. ఇతను ఫర్భిణి శాసనం (క్రీ.శ.966), కరీంనగర్ తామ్రశాసనం (క్రీ.శ.966) అనే రెండు తామ్రశాసనాలు వేయించాడు. ఇతని యొక్క రాజధాని వేములవాడ. ఇతని తరువాత తెలంగాణ ప్రాంతం కళ్యాణి చాళుక్యుల చేతుల్లోకి వెళ్ళింది. తెలంగాణాలో క్రీ.శ.940 నాటి కర్మాల శాసనంలో మొదటిసారి పద్యాలు లభించాయి.

S6. Ans (a)

Sol. కళ్యాణి చాళుక్యులు(క్రీ.శ.973-1157) వీరిని పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటారు. వీరి మొదటి రాజధాని మాన్యఖేటం, తరువాత కళ్యాణి ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు.

S7. Ans (A)

Sol. ప్రోలయ నాయకుడు (క్రీ.శ. 1325-1330) ముసునూరి నాయక రాజుల్లో మొదటివాడు. ఇతడు రాజమహేంద్ర వరం నుంచి ముస్లింలను పారద్రోలి గోదావరి-కృష్ణ నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు. రేఖపల్లికేంద్రంగా పరిపాలించాడు. 

S8. Ans (C)

Sol. కుమారగిరి రెడ్డి (క్రీ.శ. 13861402) స్వయంగా సంస్కృతంలో వసంత రాజీ యంఅనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇతని ఆస్థాన నర్తకి లకు మాదేవి‘.

S9. Ans (C)

Sol. సుదీర్ఘకాలం తెలంగాణకు పక్కలో బల్లెంలా తయారయింది బహామనిరాజ్యం. అనేక సార్లు తెలంగాణ మీద దండయాత్ర చేసింది. క్రీ.శ. 1350 ప్రాంతంలో హసన్ గంగు దండయాత్ర చేసి కౌలాస్ (నిజామాబాద్ జిల్లా) దుర్గాన్ని ఆక్రమించినాడు. పానగల్లు కోటను ఆక్రమించి వాడపల్లి చాటి అమరావతి దాకా ఆక్రమించినాడు. నీలగిరి కోటను కూడా ఆక్రమించినాడు. నీలగిరి అప్పటి నుండి నల్లగొండ అని పిలువబడింది). 

S10. Ans(a)

Sol. కుతుబ్షాహీలు స్వతంత్రించింది క్రీ.శ.1518లోనే అయినా ఈ రాజ్యస్థాపకుడు సుల్తాన్ కులీకుతుబ్ షా 1496 నుండి 1518 వరకు తెలంగాణా సుబేదార్ గా పాలించినాడు. కనుక తెలంగాణాకు సంబంధించినంత వరకు 1496 నుండే కుతుబ్షాహీల యుగంగా భావించవచ్చు. తెలంగాణాఅనే పదం వీళ్ల కాలం నుండే బహుళ ప్రచారం పొందింది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website