Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana History MCQs Questions And Answers...

Telangana History MCQs Questions And Answers in Telugu, 12th September 2023 For TSPSC GROUPs

Telangana History MCQs Questions And Answers in Telugu : Practice Telangana History Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of Telangana History. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana History MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana History MCQs Questions And Answers in Telugu.

Q1. ఏ అసఫ్ జాహి పాలకుడు వెట్టిచాకిరిని నిషేదిస్తూ ఫర్మాన జారీ చేసాడు?

  1. మహబూబ్ ఆలీఖాన్
  2. నాసిరుద్దౌల
  3. అఫ్జలుద్దౌల
  4. ఉస్మాన్ ఆలీఖాన్

Q2. కాకతీయ పాలకులు వేయించిన క్రింది శాసనాలలో సరికాని జత ఏది?

  1. మోటుపల్లి అభయ శాసనం – గణపతి దేవుడు
  2. దుర్గీ శాసనం   – జన్నిగదేవుడు 
  3. హనుమకొండ శాసనం   – మైలాంబ
  4. మాగల్లు శాసనం   – దానర్ణవుడు 

Q3. గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో ఎవరి కాలంలో విలీనమయింది ?

  1. అబ్దుల్లా కుతుబ్ షా
  2. హసన్ తానీషా 
  3. జంషీద్ కులీకుతుబ్ షా 
  4. ఇబ్రహీం కులీకుతుబ్ షా 

Q4. నిజాం పాలనను ఖండిస్తూ , స్వ పరిపాలనను డిమాండ్ చేస్తూ ఆర్యసమాజం హైదరాబాద్ – డే లను ఏ సంవత్సరంలో నిర్వహించింది?

  1. 1937
  2. 1938
  3. 1939
  4. 1940

Q5. ‘దళిత పులి’ అని క్రింది ఎవరిని అంటారు?

  1. మాదిరి భాగ్యరెడ్డి వర్మ
  2. బి.ఎస్. వెంకట్రావు
  3. ఎం.ఎల్.ఆదయ్య
  4. వీరన్న

Q6. వైజయంతి విలాసం రచయిత ఎవరు?

  1. కుతుహలుడు
  2. సోమదేవ సూరి 
  3. సారంగ తమ్మయ్య 
  4. కందుకూరి రుద్రకవి

Q7. శాతవాహనుల కాలంలో ‘వస్సారక’ అనే పదానికి అర్ధం ఏమిటి?

  1. ఇనుము పనివారు 
  2. వైద్యుడు
  3. వెదురు పనివారు 
  4. నేత పనివారు 

Q8. ఈ క్రిందివానిలో మహమ్మద్ కులీకుతుబ్ షా కు సంబంధంలేని నిర్మాణం ఏది?

  1. దాద్ మహల్
  2. గగన్ మహల్
  3. దారుల్ షిఫా 
  4. మక్కా మసీద్

Q9. క్రింది వారిలో ఓరుగల్లును ఆక్రమించుకొని “సుల్తాన్ పూర్” గా పేరు పెట్టిన ఢిల్లీ పాలకుడు ఎవరు?

  1. జునాఖాన్
  2. గియజుద్దిన్ తుగ్లక్
  3. అల్లావుద్దీన్ ఖిల్జీ 
  4. ఫిరోజ్ షా తుగ్లక్ 

Q10. సమ్మక్క, సారలమ్మలకు సమకాలికుడు అయిన కాకతీయ రాజు ఎవరు?

  1. గణపతి దేవుడు
  2. రుద్ర దేవుడు 
  3. 2వ ప్రతాప రుద్రుడు 
  4. మహా దేవుడు 

Solutions:

S1. Ans. (d)

Sol. 1928 మార్చి 20న తన జన్మదినం సందర్భంగా నిజాం రాజు ఉస్మాన్ ఆలీఖాన్ వెట్టి చాకిరిని నిషేదిస్తూ ఫర్మానా జారీ చేసాడు.

S2. Ans. (c)

Sol. మోటుపల్లి అభయ శాసనం – గణపతి దేవుడు

      దుర్గీ శాసనం                           – జన్నిగదేవుడు 

      హనుమకొండ శాసనం           – రుద్రదేవుడు/1 వ ప్రతాప రుద్రుడు 

     మాగల్లు శాసనం                      – దానర్నవుడు 

     బయ్యారం చెరువు శాసనం    – మైలాంబ 

S3. Ans. (b)

Sol. కుతుబ్ షాహి పాలకుడైన హసన్ తానీషా కాలంలో ఔరంగజేబ్ గోల్కొండ కోటపై దాడి చేసాడు.

1687 అక్టోబర్ 3 వ తేదీన గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమయింది. గోల్కొండ కోటపై మొదటిసారిగా అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో షాజహాన్ దాడి చేసాడు. అప్పుడు అబ్దుల్లా కుతుబ్ షా షాజహాన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని ప్రఖ్యాత కోహీనూర్ వజ్రాన్ని, లక్షల విలువైన బహుమానాలను షాజహాన్ కు ఇచ్చాడు.

S4. Ans. (c)

Sol. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా స్వ పరిపాలనను డిమాండ్ చేస్తూ ఆర్యసమాజం హైదరాబాద్ – డే లను 1939వ సంవత్సరంలో నిర్వహించింది. 1892లో ఆర్యసమాజ్ శాఖను హైదరాబాద్లో దయానంద సరస్వతి స్థాపించారు.

S5. Ans. (a)

Sol. తెలంగాణలో జరిగిన దళిత ఉద్యమాలను ఆది హిందూ ఉద్యమాలు అంటారు. ఈ ఉద్యమం చేపట్టినవారు – భాగ్యరెడ్డి వర్మ. ఇతను దళిత పులి గా పిలవబడ్డాడు.

దళిత భీష్ముడు – ఎం.ఎల్.ఆదయ్య 

S6. Ans. (c)

Sol. వైజయంతి విలాసంని రచించినది – సారంగ తమ్మయ్య. ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలానికి చెందినవాడు.

S7. Ans. (c)

Sol. శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తి పనివారు ఉండేవారు.

కొలిక           నేతపనివాడు

కులరిక      కుమ్మరివాడు

వెజ             వైద్యుడు 

వస్సాకర   – వెదురు పనివాడు 

వధిక          వడ్రంగి 

హాలక        వ్యవసాయదారుడు 

S8. Ans. (d)

Sol. కుతుబ్ షాహీలలో అతిగొప్ప పాలకుడు – మహమ్మద్ కులీ కుతుబ్ షా 

ఇతను 1591లో హైదరాబాద్ను నిర్మించాడు.

ఇతని నిర్మాణాలు : దాద్ మహల్ , గగన్ మహల్, దార్ ఉల్ షిఫా(ఆసుపత్రి), చార్మినార్(1591-94).

సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా మక్కా మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించగా, ఔరంగజేబ్ దానిని పూర్తి చేసాడు.

S9. Ans. (a)

Sol. ఓరుగల్లును ఆక్రమించి దానికి “సుల్తాన్ పూర్” అని పేరు పెట్టిన ఢిల్లీ సుల్తాన్- జునాఖాన్. ఇతని అసలు పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్ . 2వ ప్రతాప రుద్రుని మరణం తర్వాత ఇతను కాకతీయ రాజ్యాన్ని అంతం చేసి ఓరుగల్లును ఆక్రమించుకున్నాడు. 

S10. Ans. (c)

Sol. సమ్మక్క, సారలమ్మలకు సమకాలికుడు అయిన కాకతీయ రాజు – 2 వ ప్రతాప రుద్రుడు. రుద్రమ దేవికి కుమారులు లేకపోవడంతో తన మనవడు అయిన 2వ ప్రతాప రుద్రున్ని దత్తత తీసుకోని వారసుడిగా ప్రకటించింది. సమ్మక్క, సారలమ్మలు మేడారంలో 2వ ప్రతాప రుద్రుని సైన్యానికి వ్యతిరేకంగా భీకర పోరాటం చేసారు. 

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website