Telugu govt jobs   »   ఆంధ్ర ఉద్యమంలో పత్రికా, వార్తా పత్రికల పాత్ర

Role of Press and Newspapers in Andhra Movement | ఆంధ్ర ఉద్యమంలో పత్రికా, వార్తా పత్రికల పాత్ర

APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కోసం సన్నద్దమయ్యే అభ్యర్ధుల కోసం ADDA 247 తెలుగు APPSC గ్రూప్-2 మెయిన్స్ స్టడీ మెటీరీయల్ ని పరిచయం చేస్తోంది. APPSC గ్రూప్-2 సిలబస్ ఆధారంగా అన్నీ అంశాలు తనిఖీ చేసి అందించిన స్టడీ మెటీరీయల్ తో సన్నద్దమవ్వండి. APPSC గ్రూప్-2 పరీక్ష రాసిన అభ్యర్ధులు మెయిన్స్ పరీక్ష కోసం ముందునుంచే సన్నద్దమవ్వలి మరియు అన్నీ అంశాలను క్షుణ్ణంగా కూలంకషంగా తెలుసుకోవాలి. ఫిబ్రవరి 25, న జరిగిన APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ని గమనించి మెయిన్స్ పరీక్ష ప్రణాళిక సిద్దం చేసుకోవాలి మరియు ప్రశ్నల క్లిష్టత స్థాయిని బట్టి వారి ప్రాణాళికని మెరుగుపరచుకోవాలి. APPSC గ్రూప్-2 మెయిన్స్ స్టడీ మెటీరీయల్ లోని విస్తృతమైన అంశాలు తెలుసుకుని సిలబస్ ప్రకారం సన్నద్దమైతే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ కధనంలో ఆంధ్ర ఉద్యమంలో పత్రికా, వార్తా పత్రికల పాత్ర గురించి తెలుసుకోండి.

Adda247 APP

Adda247 APP

Role of Press and Newspapers in Andhra Movement:

ఆంధ్ర ఉద్యమంలో పత్రికా, వార్తా పత్రికల పాత్ర గురించి APPSC గ్రూప్-2 లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కావున ఈ అంశం గురించి తెలుసుకోండి. 1801లో కోస్తా, రాయలసీమ ప్రాంతాలను కర్ణాటకలో కలుపుతూ అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశారు. ప్రజలు 1953 వరకూ తమిళులతో కలసి ఉండేవారు కానీ ఆంధ్రప్రజలకు గౌరవం, మర్యాద, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. తెలుగు వారికి జరుగుతున్న అన్యాయం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి అడుగులు పడ్డాయి.
ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పత్రికలు అందులో వచ్చే వ్యాసాలు ప్రజలను చైతన్యవంతలను చేయడమే కాకుండా అప్పటి ఆంగ్లేయుల తీరుని తెలియజేశాయి. జాతీయోద్యమం తెలుగు వారిపై ప్రభావం చూపింది అనడానికి ఆశ్చర్యంలేదు. ఆంధ్ర పత్రికల గురించి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన నిఘంటువులో తెలియజేశాడు. విద్యా, ఉద్యోగం తో పాటు అన్నీ చోట్ల తెలుగు వారికి అన్యాయం జరిగినది.
1911 నుంచి తెలుగు పత్రికలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం వివిధ వ్యాసాలు ప్రచురించాయి. హిందుస్థాన్ రివ్యూ, మాడ్రన్ రివ్యూ ఆఫ్ కలకత్తా, మరియు రివ్యూ ఆఫ్ రివ్యూస్ పత్రిక కూడా ఆంధ్రోద్యమం గురించి ప్రచురించాయి.

ఆంధ్ర ఉద్యమంలో వార్తా పత్రికలు

ఆంధ్ర ప్రకాశిక 1885:

  • ఈ పత్రిక ని 1885లో పార్ధసారధి నాయుడు గారు మద్రాసు కేంద్రంగా స్థాపించారు
  • ఈ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురితమయ్యేవి
  • తెలుగువారిని ఏకం చేయడం ఈ పత్రిక యొక్క ముఖ్యలక్షణం

దేశాభిమాని 1887:

  • ఇది విజయవాడలో ప్రారంభించబడిన మొదటి ఆంగ్లో-తెలుగు వార పత్రిక
  • దేశాభిమాని ముందు పేరు కృష్ణా న్యూస్, మరియు సంపాదకుడు దేవగుప్త శేషచలపతిరావు.
  • 1908లో ఇది దినపత్రికగా మారింది మరియు ప్రధాన కార్యాలయం గుంటూరుకి మారింది.
  • 1911 లో భారతదేశానికి వచ్చిన ఇంగ్లండ్ రాజు జార్జ్-V కి డిల్లీలో పట్టాభిషేకం జరిపి ఇంగ్లీషు లో ఒక వ్యాసాన్ని కూడా ప్రచురించింది.
  • స్వంత ప్రభుత్వం గురించి ఆంధ్రుల సంస్కృతి గురించి తెలియజేసింది.
హిందూ పత్రిక: 
  • 1911 లో వరుసగా 6 వ్యాసాలు ప్రచురించి తెలుగు వారు పడే అవస్థలను తెలియజేశారు
  • 1911 ఏప్రిల్ 15న తెలుగు వారు వెనుకబడిన వారా అనే శీర్షిక ప్రచురించారు.
  • 1912లో ఆగస్టు 29న హిందూ లో విశ్వామిత్ర అనే లేఖ ప్రచురితమైంది.

కృష్ణా పత్రిక:

  • దీనిని 1902లో మచిలీపట్నంలో ప్రారంభించారు.
  • 1912 నవంబర్ 30న ఆంధ్రోధ్యమం, జాతీయోధ్యమం గురించి ప్రచురించింది.
  • ది క్రై ఆఫ్ మదర్ ఇండియా గేయాన్నిఈ పత్రిక ప్రచురించిచింది.

ఆంధ్ర కేసరి

  • దీనిని 1904లో చిలుకూరి వీరభద్రరావు, రాజమండ్రిలో స్థాపించారు.
  • వెంకట లక్ష్మణ రావుగారు మరియు వీరభద్రరావు గారు కలిపి 1906లో విజ్ఞాన చంద్రిక మండలిని స్థాపించి ఆంధ్రుల చరిత్ర అనే గ్రంధాన్ని రచించారు. వీరికి చరిత్ర చుతరసన అనే బిరుదు లభించింది

ఆంధ్రా పత్రిక

  • ఆంధ్రా పత్రిక 1908 సెప్టెంబర్ 9 న కాశీనాధుని నాగేశ్వరరావుగారు ముంబాయి కేంద్రంగా స్థాపించారు.
  • ఇది వార పత్రికగా మొదలై 1914లో దినపత్రికగా మారింది
  • ఆంధ్రపత్రిక ప్రచురణ సంస్థకి ఆంధ్ర గ్రంధమాల అని నాగేశ్వర రావుగారు పేరు పెట్టారు
  • 1910 నుంచి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉగాది సంచికలు అనే శీర్షికని ప్రచురించారు.
  • 1910లో మొదటి ఉగాది సంచిక ప్రచురితమైంది మరియు ఈ సంచిక లో విన్నపం అనే వ్యాసంలో ఆంధ్ర రాష్ట్ర ప్రాముఖ్యత గురించి తెలిపారు
  • నాగేశ్వర రావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి తెలియజేస్తూ ఆంధ్ర మహాజనులకో విన్నపం అనే శీర్షిక ప్రచురించారు

స్వదేశీ మిత్రన్

  • ఇది ప్రధానంగా ఒక తమిళ పత్రిక మరియు ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసింది
  • రాజారమణీయం గారు విశాఖపట్నంలో 1915న 3వ ఆంధ్ర సభ గురించి అందులో మాతృభాషలో విద్యాభోదన గురించి తెలిపిన తీర్మానం ని ఈ తమిళ పత్రిక సమర్ధించింది.

గోష్టి పత్రిక:

  • ఈ పత్రికని ప్రారంభించింది జి.వి. సుబ్బారావుగారు
  • రాయలసీమ, తెలంగాణ ప్రజలు, తెలుగు వారు అందరూ 1936 మార్చి 24న ఉగాది పండుగ జరుపుకున్నారు.
  • ఈయన ఉగాదిని పురస్కరించుకుని ఒక కవితని కూడా ప్రచురించారు.
  • 1936 మార్చిలో గోష్టి పత్రిక ఆంధ్ర దేశ పటాన్ని ప్రచురించింది.

ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రచురణ అయిన ఇతర శీర్షికలు:

  • ఆంధ్రా పత్రిక మహాత్మ గాంధీ గారు చేపట్టిన నూలు వస్తారలు తయారు చేసుకోవాలి అని సూచించింది.
  • మరియు 1938లో జరిగిన ఉగాది సంచికలో ఆంధ్ర అభ్యుదయం అనే శీర్షికని నాగేశ్వరరావుగారు రచించారు
  • 1920లో భాషా రాష్ట్రాల స్వయం పరిపాలన అనే శీర్షిక ప్రచురితమైంది
  • నెహ్రూగారు 1953 లో ఆంధ్ర రాష్ట్ర ప్రారంభోత్సవం చేసినపుడు ఆంధ్రరాజ్య అవతరణ అనే శీర్షికని ఆంధ్రా పత్రిక ప్రచురించింది.
  • 1956లో మహాంధ్ర సాక్షాత్కారం అనే శీర్షిక ప్రచురితమైంది.

APPSC Group 2 Mains Success Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!