RBI ICICI బ్యాంకునకు రూ.3 కోట్ల జరిమానా విధించింది
సెక్యూరిటీలను ఒక వర్గం నుండి మరొక వర్గానికి మార్చే విషయంలో ఐసిఐసిఐ బ్యాంక్ తన ఆదేశాలను పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 3 కోట్ల ద్రవ్య జరిమానా విధించింది. ‘బ్యాంకుల వర్గీకరణ, మూల్యాంకనం మరియు పెట్టుబడి పోర్ట్ఫోలియో యొక్క ఆపరేషన్ కోసం ప్రుడెన్షియల్ నిబంధనలు’ అనే అంశంపై మాస్టర్ సర్క్యులర్లో ఉన్న కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు బ్యాంకుకు ద్రవ్య జరిమానా విధించబడింది.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (చట్టం) లోని నిబంధనల ప్రకారం ఆర్బిఐకి ఉన్న అధికారాలను ఉపయోగించడం ద్వారా జరిమానా విధించబడింది. సెక్యూరిటీలను ఒక వర్గం నుండి మరొక వర్గానికి బదిలీ చేసే విషయంలో కరస్పాండెన్స్ను పరిశీలించినప్పుడు, అది జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు బయటపడింది. ఈ చర్య రెగ్యులేటరీ సమ్మతిలోని లోపాలపై ఆధారపడి ఉంటుంది మరియు బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క ప్రామాణికతను గురించి తెలుసుకొనుటకు ఉద్దేశించినది కాదు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర.
ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి & సిఇఒ: సందీప్ బక్షి.
ఐసిఐసిఐ బ్యాంక్ ట్యాగ్లైన్: హమ్ హై నా, ఖయాల్ అప్కా.