Telugu govt jobs   »   Telugu Current Affairs   »   PRC in Andhra Pradesh implemented for...

ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ ఐదేళ్లకోసారి అమలు , PRC in Andhra Pradesh Implemented For Five Years

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని పదేళ్లకు బదులు ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా పీఆర్సీ అమలు ఉత్తర్వుల్లో పలు సవరణలకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐదేళ్లకోసారి పీఆర్సీ ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై ఉత్తర్వులు జారీ చేసింది.

పీఆర్సీ బకాయిలను రిటైర్‌మెంట్‌ సమయంలో ఇచ్చేందుకు ఒక జీవో జారీ చేసింది. పెండింగ్‌లోని ఐదు స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లను ఇచ్చేలా జీవో ఇచ్చింది. ఐఆర్‌ రికవరీ చేయకుండా మరో ఉత్తర్వును జారీ చేసింది. ఉద్యోగుల ట్రావెలింగ్‌ అలవెన్స్‌ పెంపు, అంత్యక్రియలకు రూ. 25 వేలు ఇచ్చేలా వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఇలా మొత్తం ఆరు అంశాలపై 8 జీవోలను ఇచ్చింది.

ఉద్యోగుల ప్రతినిధులకు జీవో ప్రతులు
బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో జీవోల ప్రతులను వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు అధికారులు అందజేశారు. పీఆర్సీ అమలుకు సంబంధించిన ఈ సమావేశం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్‌) హెచ్‌.అరుణ్‌కుమార్‌ల సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో ఎస్‌.ఎస్‌.రావత్‌ మాట్లాడుతూ పీఆర్సీ  పెండింగ్‌ అంశాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.పెండింగ్‌ బిల్లులను కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లించనున్నట్లు తెలిపారు.

శశిభూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ పీఆర్సీ అమలుకు సంబంధించి మరో రెండు జీవోలను కూడా బుధవారం రాత్రి లేదా గురువారం విడుదల చేయనున్నట్లు చెప్పారు. మరికొన్ని జీవోలు త్వరలో విడుదలవుతాయన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సకాలంలో పరిష్కరించాలని కోరారు.

********************************************************************************************

PRC in Andhra Pradesh implemented for five years_40.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
PRC in Andhra Pradesh implemented for five years_50.1

Download Adda247 App

Sharing is caring!

Download your free content now!

Congratulations!

PRC in Andhra Pradesh implemented for five years_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

PRC in Andhra Pradesh implemented for five years_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.