PM inaugurated the Global Maritime India Summit 2023 in Visakhapatnam | ప్రధాన మంత్రి గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ను విశాఖపట్నంలో ప్రారంభించారు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (GMIS) 2023 ను ప్రారంభించారు. ఈ సమ్మిట్ అక్టోబర్ 17 నుంచి 19 వరకు సమ్మిట్ ముంబైలోని ఎంఎంఆర్డీఏ గ్రౌండ్స్లో జరిగినది. మూడు రోజుల గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్లో మొదటి రోజు రూ. 3.24 లక్షల కోట్ల విలువైన 34 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి, ఇది భారతదేశాన్ని సముద్ర శక్తిగా మార్చడానికి వివిధ వాటాదారుల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి భారత నగర నీలి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాల బ్లూప్రింట్ ‘అమృత్ కాల్ విజన్ 2047’ని ఆవిష్కరించారు. విశాఖ పోర్టు లో 655 కోట్లతో Q7, WQ 6,7,8, బెర్తు లను యాంత్రికరణ పనులను ప్రదాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ పనుల రెండవ దశ పనులను జాతికి అంకితం చేశారు, ఈ పనులను 633కోట్లతో పూర్తిచేశారు.
గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ (GMIS) 2023లో గుడివాడ అమరనాథ్ సమక్షంలో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, NHAI అధికారులు వివిధ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ప్రస్తుతం షీలా నగర్ లో ఉన్న 4 లేన్ల రహదారి ని 6 లేన్ల రహదారిగా మార్చానున్నారు వీటికోసం పోర్టు నుంచి 501కోట్లను అందించనున్నారు. భారత నౌకాదళం ట్రాయాన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో 900 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లో సాలగ్రామ పురం లో ఉన్న భూమి ని ట్రాయాన్ కు లీజు కు అభివృద్ధి చేయడానికి ఇవ్వనున్నారు. మొత్తం 1400కోట్ల ఒప్పందాలను మొదటి రోజు కార్యక్రమం లో నమోదు చేసుకున్నాయి.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |