కేవీ రాజేంద్రనాథరెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు , KV Rajendranath Reddy Appointed As New AP DGP :
కొత్త డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులైన కేవీ రాజేంద్రనాథరెడ్డిది కడప జిల్లా. ఆయన 1992 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ ఏఎస్పీగా 1994లో తొలి పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా జనగామ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.
వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అదనపు ఎస్పీగా పనిచేశారు. విశాఖపట్నం రూరల్, నెల్లూరు జిల్లాల ఎస్పీగా, సీఐడీ, గుంతకల్లు, విజయవాడ రైల్వే యూనిట్ల ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ కమిషనరేట్లో సిటీ సెక్యూరిటీ, తూర్పు జోన్ డీసీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా వ్యవహరించారు. 2008 నుంచి 2010 మధ్య విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పనిచేశారు. విశాఖపట్నం జోన్ ఐజీగా, హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పోలీసు గృహనిర్మాణ సంస్థ ఎండీ, డ్రగ్ కంట్రోల్ డీజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ తదితర పోస్టుల్లో కొనసాగారు. 2020 ఆగస్టు 12 నుంచి నిఘా విభాగం అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా కొనసాగనున్నారు. 2026 ఏప్రిల్ మాసాంతం వరకూ ఆయనకు సర్వీసు ఉంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్ జగన్మోహన్రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************