Telugu govt jobs   »   Latest Job Alert   »   జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పూర్తి వివరాలు తెలుగులో

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా చేపట్టిన “వన్‌ టైమ్ సెటిల్‌మెంట్‌.”  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు  గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణం, వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. 21 డిసెంబర్ 2021న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం 2023ని ప్రారంభించారు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు లబ్ధిదారులు నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ కధనంలో  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పూర్తి వివరాలు అందించాము. మరిన్ని వివరాల కోసం కధనాన్ని పూర్తిగా చదవండి.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (OTS)

‘AP Housing Corporation’ నుంచి రుణాలు తుసుకున్న వారికి, తీసుకొని వారికి, సొంత ఖర్చులతో హౌసింగ్ సైట్ లో గృహాలను నిర్మించుకున్న వారికి  ఈ స్కీం వర్తిస్తుంది. అందులో భాగం గా సొంత ఖర్చులతో నిర్మించుకున్న వారికి ఉచితంగా, మిగతా వారు రుసుము చెల్లిస్తే వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వారి పరిధిలోని గ్రామ వార్డు సచివాలయం లోనే ఇస్తారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పేరు “జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం”.

Adda247 TeluguAPPSC/TSPSC Sure Shot Selection Group

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వివరాలు

పథకం పేరు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
ప్రారంభించినది  YS జగన్మోహన్ రెడ్డి
ఉదేశ్యం  ‘రుణ విముక్తి – శాశ్వత భూ హక్కు బధళాయింపు’
రిజిస్ట్రేషన్  అక్టోబర్ నుంచి డిసెంబర్ 2021 లోపు
రిజిస్ట్రేషన్ విధానం  ఆఫ్ లైన్
పథకం ప్రారంభ తేది  21 డిసెంబర్ 2021

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ చార్జీలు

1983 నుంచి 2011 సంవత్సరం మధ్యలో గృహం నిర్మించుకున్న వారికి మొదట అవకాశం ఉంటుంది. తక్కువ చెల్లింపులతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందించటం జరుగుతుంది. రుసుముల వివరాలు చూసుకున్నట్టు అయితే

కేటగిరి 1:

గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోటానికి గ్రామీణ ప్రాంతాల్లో ₹10,000/-, నగర పంచాయితీల్లో ₹15,000/-, నగర కార్పొరేషన్ లో ₹20,000/- గా ఉంటుంది. అధికారి మరణిస్తే వారి వారసులకు పై రుసుము మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.

కేటగిరి 2: 

ఇతరులకు రిజిస్ట్రేషన్ కు మాత్రం రెట్టింపు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ₹20,000/-, నగర పంచాయితీల్లో  ₹30,000/-, నగర కార్పొరేషన్ లో ₹40,000/- గా ఉంటుంది.

వన్ టైం సెటిల్ మెంట్ చేసుకున్న లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ రిటర్న్ చేయడంతో పాటు రిజిస్టర్ టైటిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అమ్ముకోవాలన్నా, రుణాలు తెచ్చుకోవాలన్నా లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం

  • బ్యాంకుల్లో తాకట్టు చేసి.. 75 శాతం వరకూ లోన్స్ తీసుకోవచ్చని తెలిపారు.
  • డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం కానీ, స్టాంప్ డ్యూటీ గానీ, యూజర్ ఛార్జీలు గానీ ఉండవని తెలిపారు. ఈ పథకం కింద గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. 22 (A) లో ఉన్నవాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నవారికి 22(A) జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నారు.
  • ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా భవిష్యత్ లో కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు సచివాయాల్లో 10 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్ పక్రియ అంతా పూర్తవుతుందన్నారు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా తీసుకుని.. హౌసింగ్ కార్పోరేషన్ నుండి ఎటువంటి రుణం తీసుకోని వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద కేవలం రూ.10తో రిజిస్ట్రేషన్‌ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ ను పొందవచ్చనన్నారు.
  • దీని ద్వారా లబ్ధిపొందేవారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారన్నారు

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం  అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన పత్రాలు

  • దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి
  • ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల కోసం దరఖాస్తుదారు తప్పనిసరిగా రుణం తీసుకుని ఉండాలి
  • ఆధార్ కార్డు
  • మొబైల్ నంబర్
  • రేషన్ కార్డు
  • ఇమెయిల్ ID
  • నివాస ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • ముందుగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • హోమ్ పేజీ మీ ముందు కనిపిస్తుంది
  • హోమ్‌పేజీలో, మీరు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం దరఖాస్తుపై క్లిక్ చేయాలి
  • మీ ముందు కొత్త పేజీ కనిపిస్తుంది
  • ఈ పేజీలో మీరు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాలి
  • ఇప్పుడు మీరు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి
  • ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి
  • ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద నమోదు చేసుకోవాలి

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం  యొక్క ప్రయోజనాలు 

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం 2021 లో  ప్రారంభించింది .
  • ఈ పథకం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రుణాలను మరియు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లపై వారి వడ్డీని మాఫీ చేస్తుంది మరియు లబ్ధిదారులకు వారి ఆస్తిపై పూర్తి హక్కులను అందించబోతోంది.
  • ఈ పథకం ప్రయోజనాన్ని పొందేందుకు, లబ్ధిదారులు నామమాత్రపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ పథకం ద్వారా దాదాపు 5.2 మిలియన్ కుటుంబాలు లబ్ధి పొందుతాయి.
  • వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ప్లాన్ కింద నామమాత్రపు మొత్తాన్ని చెల్లించిన తర్వాత ప్రభుత్వం రిజిస్టర్డ్ టైటిల్ డీడ్‌ను అందించబోతోంది.
  • లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అందజేస్తారు
  • నామమాత్రపు విలువను చెల్లించిన తర్వాత లబ్ధిదారులు ఆస్తిని తరువాతి తరానికి బదిలీ చేయవచ్చు, రుణం పొందవచ్చు మరియు మార్కెట్ ధరకు వారి ఆస్తిని విక్రయించవచ్చు.
  • ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల గృహ రుణాలను మాఫీ చేయబోతోంది.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఎప్పుడు ప్రారంభించారు?

21 డిసెంబర్ 2021న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం 2023ని ప్రారంభించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లక్ష్యం ఏమిటి?

గనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు  గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణం, వడ్డీతో కలిపి చెల్లిస్తుంది.