Telugu govt jobs   »   Current Affairs   »   గుంటూరు మిర్చి కి అంతర్జాతీయ గుర్తింపు

గుంటూరు మిర్చి కి అంతర్జాతీయ గుర్తింపు

2022-23 ఆర్థిక సంవత్సరంలో గుంటూరు మిర్చి ఎగుమతుల్లో రూ.10,445 కోట్ల మైలురాయిని సాధించడం ద్వారా ధర మరియు ఎగుమతులు రెండింటిలోనూ తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ఎగుమతి పరిమాణంలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ, అధిక ధరల ఫలితంగా అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 1,861 కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. 2022-23లో 84,881 హెక్టార్ల గరిష్ట సాగు విస్తీర్ణంతో సుమారు 78,000 హెక్టార్లలో మిర్చి సాగు చేయబడిన గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో మిర్చి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉంది.

చైనా, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్, స్పెయిన్, అమెరికా, ఇంగ్లండ్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఇండోనేషియా మరియు బంగ్లాదేశ్‌తో సహా 20 దేశాలకు ఎగుమతులు చేరుకోవడంతో భారతీయ మిరపకాయలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. భవిష్యత్తులో మరిన్ని దేశాలను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు ఉన్నాయి. జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళిక (డీఈఏపీ)లో పేర్కొన్న విధంగా రెండేళ్లలో గుంటూరు జిల్లాను అన్ని రకాల మిర్చి ఎగుమతుల హబ్‌గా మార్చేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. మిరపతో పాటు, పత్తి, నూలు, పసుపు, అల్లం మరియు ఇతర మసాలా ఉత్పత్తులను ఎగుమతి చేయడంపై దృష్టి సారించింది అని తెలిపారు.

మిరప పంట ద్వారా వచ్చే గణనీయమైన విదేశీ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం ఉన్న సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రధానంగా పంట కోత అనంతర ఎగుమతులపై దృష్టి సారిస్తుంది మరియు పరిశోధన మరియు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం వంటి క్లిష్టమైన అంశాలను విస్మరిస్తోంది కాబట్టి, కేంద్రం ప్రత్యేక మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలని మిర్చి రైతు సంఘాలు కోరుతున్నాయి. ప్రత్యేక బోర్డు ద్వారా మిరప యొక్క అవసరాలను తిరుస్తూ పరిశోధనలు కూడా చేసి మంచి విత్తనాలను రైతులకు అందిస్తుంది, మరియు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మిరప నిరంతర విజయానికి దోహదం చేస్తుంది.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!