Industrial development at Ramayapatnam Port | రామాయపట్నం పోర్ట్ వద్ద పారిశ్రామిక అభివృద్ధి
రామాయపట్నం పోర్ట్ ని డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. AP మారిటైమ్ బోర్డ్ పోర్ట్ సమీపంలో సుమారు 8000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది పనులు చేపట్టనుంది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం భూ సమీకరణ జరుగుతోంది అని ఎండీ, సిఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మొదటి దశ కింద 4,850 ఎకరాలలో పారిశ్రామిక పార్కు నెల్లూరు జిల్లాలో చేవూరులో 1312.58 ఎకరాలు మరియు రావూరు లో 951.77 ఎకరాలు సేకరించనున్నారు. ఇప్పటికే రామాయపట్నం తొలిదశ పనులు 2,634.65 కోట్లతో నవయుగ-అరబిందో భాగస్వామ్య కంపెనీ జూన్ 2022లో చేపట్టింది. ఈ పనుల వలన సంవత్సరానికి దాదాపుగా 34 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉంటుంది. ఈ పనులలో బల్క్ కార్గో బర్త్ను AP మారిటైమ్ బోర్డ్ కు అందించనుంది. రామాయపట్నం పోర్టు పక్కన కార్గో ఆధారిత ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై దృష్టి పెట్టింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్ట్ వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంభందించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |