తప్పిపోయిన ఇండోనేషియా జలాంతర్గామి “KRI Nanggala-402” ని కనుగోనే సహాయక చర్యల్లో పాల్గొంటున్న భారత్
4 రోజుల క్రితం తప్పిపోయిన ఇండోనేషియా జలాంతర్గామి మరియు దాని 53 మంది సిబ్బంది కోసం భారత నావికాదళం సహాయక చర్యలో చేరింది. బాలి ద్వీపానికి ఉత్తరాన టార్పెడో డ్రిల్ నిర్వహిస్తున్నప్పుడు 44 ఏళ్ల జలాంతర్గామి KRI Nanggala-402 తప్పిపోయిన తరువాత ఇండోనేషియా, భారతదేశం సహాయం కోరింది. నేవీ యొక్క డీప్-సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెసెల్ (DSVR) విశాఖపట్నం నుండి బయలుదేరింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఇండోనేషియా అధ్యక్షుడు: జోకో విడోడో;
- ఇండోనేషియా రాజధాని: జకార్తా;
- ఇండోనేషియా కరెన్సీ: ఇండోనేషియా రూపియా.