కేంద్ర మాజీ మంత్రి, ఆర్.ఎల్.డీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ మరణించారు
మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ (RLD) వ్యవస్థాపకుడు, నాయకుడు అజిత్ సింగ్ కోవిడ్ -19 తో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు.
అజిత్ సింగ్, ప్రధాన మంత్రి వి. పి. సింగ్ ఆధ్వర్యంలో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశారు; పి. వి. నరసింహారావు మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి; అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి మరియు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.