Telugu govt jobs   »   Daily Quizzes   »   General Knowledge Quiz In Telugu

AP State GK MCQs Questions and Answers in Telugu ,25th May 2023 For APPSC Groups & AP Police

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

Q1. మొదటి ప్రణాళికలో వేటిపై ఎక్కువ మొత్తం నిధులు కేటాయించారు(రాష్ట్రానికి సంబంధించి)?

(a) విద్యుత్ రంగం

(b) వ్యవసాయ రంగం

(c) నీటిపారుదల

(d) వైద్య రంగం

Q2. రాష్ట్ర ప్రణాళిక సలహా కమిటీలో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులుగా ఉంటారు?

(a) రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రణాళిక మంత్రి

(b) MPలు మరియు MLAలు

(c) నిష్ణాతులైన 11 మంది అనధికార ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

(d) పైవన్నీ

Q3. రాష్ట్ర ప్రణాళికలు ఎవరి ఆధ్వర్యంలో తయారుచేయడం జరుగుతుంది?

(a) ప్రణాళికా సంఘం

(b) రాష్ట్ర ప్రణాళికా బోర్డు

(c) NITI ఆయోగ్

(d) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో

Q4. క్రింది వానిలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడిన సంస్థలు ఏవి?

(a) AP స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(1956)

(b) APIDC(AP ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్-1960)

(c) స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ (1961)

(d) పైవన్నీ

Q5. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేనికి అధిక ప్రాధాన్యం ఇవ్వబడినది?

(a) స్వయం పరిపాలన

(b) సుస్తిరాభివ్రుద్ది లక్ష్యాలు

(c) సంతులిత ప్రాంతీయాభివృద్ది

(d) పైవన్నీ

Q6. ఏ తేదిన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయింది?

(a) 1911 అక్టోబర్ 1

(b) 1939 నవంబర్ 1

(c) 1953 అక్టోబర్ 1

(d) 1956 నవంబర్ 1

Q7. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమాలు ప్రారంభించ బడ్డాయి?

(a) సామాజికాభివ్రుద్ది పధకం( 1952)

(b) మాచఖండ్ జలవిధ్యుత్ ప్రాజెక్ట్ (విశాఖ)-

(c) హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( విశాఖ – 1952)

(d) పైవన్నీ

Q8. మూడవ పంచవర్ష ప్రణాళిక లో అభివృద్ధి లక్ష్యం ఎంత?

(a) 5.6 %

(b) 2.4%

(c) 7.9%

(d) 6%

Q9. కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతి కొరకు రాష్ట్ర పంచవర్ష ప్రణాళికా ముసాయిదాను ఎవరు కేంద్రం ముందు ఉంచుతారు?

(a) రాష్ట్ర ఆర్ధిక మంత్రి

(b) గవర్నర్

(c) ముఖ్యమంత్రి

(d) ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్

Q10. రాష్ట్ర ప్రణాళిక మరియు అభివృద్ధి బోర్డులో ఈ క్రింది ఏ శాఖ సభ్యత్వాన్ని కలిగి లేదు?

(a) పౌర సరఫరాల శాఖ

(b) అవినీతి నిరోధక శాఖ

(c) న్యాయ శాఖ

(d) ఏది కాదు

Solutions:

Q1. Ans(a)

Sol. మొదటి పంచవర్ష ప్రణాళికలో సుమారు 39.1 % నిధులు విధ్యుత్ రంగంపై ఖర్చు చేసారు. తరువాతి స్థానంలో నీటిపారుదల ఉన్నది. మొత్తానికి అవస్థాపనా మరియు సామాజిక సంక్షేమాలకు ఎక్కువ నిధులు మళ్ళించారు.

Q2. Ans(d)

Sol. ప్రణాళికా సలహా కమిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా, ప్రణాళిక మంత్రి ఉపాధ్యక్షుడుగా, నలుగురు MPలు మరియు నలుగురు MLAలతో పాటు 11 మంది నిష్ణాతులైన అనధికార సభ్యులు ఉంటారు.

Q3. Ans(b)

Sol. రాష్ట్ర ప్రణాళిక బోర్డు సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక రచన జరుగుతుంది. ఈ సంఘంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గాను, ఆర్ధిక మంత్రి మరియు ప్రణాళికా మంత్రి మరియు ఇతర సాంకేతిక నిపుణులతో కలిపి ఈ బోర్డు ఏర్పాటు చేయబడుతుంది. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రణాలికా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ‘రాష్ట్ర ప్రణాలికా ముసాయిదాను తయారు చేస్తారు’.

S4. Ans(d)

Sol. పై సంస్థలతో పాటు 7 జిల్లాలలో IADP( Intensive Agricultural Districts Program) పధకం ప్రారంభించారు. మన రాష్ట్రంలో కూడా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు. దీనితో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ(1958) లో ఏర్పాటు చేయడం జరిగింది.

S5. Ans(c)

sol.మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, ప్రతి ప్రాంతంలో నీటిపారుదల, విద్యుత్ సౌకర్యాలు వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం జరిగింది. అందుకే ఈ ప్రణాళిక లో కూడా అధిక కేటాయింపులు నీతిపారుదల వసతులకు వెచ్చించడం జరిగింది.

Q6. Ans(c)

Sol. 1953 అక్టోబర్ 1 న కోస్తా మరియు రాయలసీమలతో కూడిన ఆంధ్రరాష్ట్రం, మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడినది.

Q7. Ans(d)

Sol. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో పై అన్ని ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు 1954 హైదరాబాద్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

S8. Ans(a)

sol. మూడవ పంచవర్ష ప్రణాలికా కాలంలో అభివృద్ధి లక్ష్యం 5.6% గా నిర్ణయించడం జరిగింది, కాని అదే సమయంలో 1962 మరియు 1965 సంవత్సరాలలో వరుసగా చైనా మరియు పాకిస్తాన్ దేశాలతో యుద్ధం కారణంగా ఆ నిధులను సహాయక చర్యలకోసం తరలించిన కారణంగా వృద్ది శాతం కేవలం 2.72% గా నమోదు అయింది

Q9. Ans(c)

Sol. రాష్ట్ర పంచవర్ష ప్రణాళికా ముసాయిదాను కేంద్ర ప్రణాళిక సంఘ అనుమతి కోసం ముఖ్యమంత్రి కేంద్రం ముందు ఉంచుతారు.

Q10. Ans(c)

Sol. రాష్ట్ర ప్రణాళికలు అమలు చేయడంలో ముఖ్య కార్యదర్శి సమక్షంలో న్యాయ శాఖ మినహా మిగిలిన అన్ని శాఖల కార్యదర్శులు మరియు ప్రణాళిక కార్యదర్శి సెక్రటరీగా ప్రణాళిక మరియు అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేస్తారు

TSPSC గ్రూప్-1 Score Booster Batch | Top 10 Mock Tests Discussion | Online Live Classes By Adda247
మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website