AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.
AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్ అవేర్నెస్ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్ అఫైర్స్ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu
AP State GK – ప్రశ్నలు తెలుగులో
Q1. క్రింది వాటిలో దత్త మండలాలు ఏవి?
- పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీకాకుళం , ప్రకాశం
- శ్రీకాకుళం , ప్రకాశం జిల్లాలు
- కర్నూలు , అనంతపురం జిల్లాలు
- కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం జిల్లాలు.
Q2. ఆంధ్రరాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు?
(a) కోకా సుబ్బారావు
(b) పట్టాభి సీతారామయ్య
(c) మాడపాటి హనుమంతరావు
(d) అయ్యదేవర కాళేశ్వరరావు
Q3. ఆంధ్రలో వందేమాతర ఉద్యమం”ను ప్రచారం చేసిన బెంగాలీ నాయకుడు ఎవరు
(a) బిపిన్ చంద్రపాల్
(b) సురేంద్రనాథ్ బెనర్జీ
(c) అరవింద ఘోష్
(d) బాల గంగాధర తిలక్
Q4. “ఇండియా ఒక్కటి కాదు, రెండు రాజ్యాలు” అని పేర్కొనినది ఎవరు?
(a) మహ్మద్ ఆలీ జిన్నా
(b) మహ్మద్ ఇక్బాల్
(c) సయ్యద్ అహ్మద్ ఖాన్
(d) మౌలానా అబుల్ కలామ్
Q5. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఎక్కువగా ఏ జిల్లాల్లో ఉంది?
- విశాఖపట్నం, అనంతపురం
- విజయనగరం, కర్నూలు
- పైవి రెండూ
- పైవేవి కాదు
Q6. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టము, 2014లోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏ పరిచ్ఛేదము, ప్రభుత్వ రంగ ఆస్థుల పంపకపు పద్ధతిని తెలియజేస్తుంది?
- పరిచ్ఛేదము 51
- పరిచ్ఛేదము 52
- పరిచ్ఛేదము 53
- పరిచ్ఛేదము 54
Q7. ఇటివల కృష్ణ పట్టణం పోర్టు యొక్క 100% వాటాను ఏ సంస్థ కైవసం చేసుకున్నది?
- రిలయన్స్ లిమిటెడ్
- అధాని పోర్ట్స్ లిమిటెడ్
- సి పోర్ట్స్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్
- ఎవరూ కాదు
Q8. మాచ్-ఖండ్ నదికి గల ఇతర పేరుని ఈ క్రింది వాటిలో గుర్తించండి?
- లాంగుల్యా
- ముచికుంద
- సరస్వతి
- హంసదీవి
Q9. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు వలన ఏర్పడే పరిపాలనా, ఆర్ధిక పరమైన సమస్యలను పరిష్కరించడానికి క్రింది ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది?
- వాంచూ కమిటీ
- కేల్కర్ కమిటీ
- ఎల్. ఎన్. మిశ్రా కమిటీ
- ధార్ కమిటీ
Q10. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని(2014) ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 అని పిలవవచ్చని చట్టంలోని ఏ భాగంలో పేర్కొనడం జరిగింది?
- పార్ట్-2
- పార్ట్-3
- పార్ట్-6
- పార్ట్-1
Solutions:
S1. Ans (d)
Sol. కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం జిల్లాలను నిజాం అలీ 1800, అక్టోబరు 12న సైన్య సహకార పద్ధతిలో చేరినందుకుగాను ఆంగ్లేయులకు దత్తం చేశాడు. అందుకే వాటిని దత్త మండలాలు అంటారు. ఈ ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో తర్వాత మొగలుల ఆధీనంలో ఉండేవి. వీటిని హైదర్ అలీ, టిప్పు సుల్తానులు ఆక్రమించారు. చివరికి నాలుగో మైసూర్ యుద్ధం తర్వాత హైదరాబాద్ నిజాం ఆధీనంలోకి వచ్చాయి.
S2 : Ans(d)
Sol: అయ్యదేవర కాళేశ్వర రావు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ (1956-1962) మొదటి స్పీకర్.
S3: Ans(a)
Sol: ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ ఉద్యమాన్ని వందేమాతర ఉద్యమం అని పిలిచేవారు. బిపిన్ చంద్రపాల్ 1907లో ఆంధ్రాలో “వందేమాతర ఉద్యమం” ను ప్రచారం చేశారు. బిపిన్ చంద్రపాల్ విప్లవాత్మక ఆలోచనల పితామహుడిగా పిలుస్తారు.
S4 : Ans(b)
Sol: మహ్మద్ ఇక్బాల్ :”భారతదేశం ఒకటి కాదు రెండు దేశాలు” అని చెప్పిన వ్యక్తి ఆయన.
S5. ANS. (D)
Sol. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఎక్కువగా అనంతపురం (1084.7 వేల హెక్టార్లు) , కర్నూలు ( 914.2 వేల హెక్టార్లు) జిల్లాల్లో ఉంది. అయితే నికర సాగు విస్తీర్ణంలో సగం భూమికి పైగా సాగుదలతో నెల్లూరు , తూర్పు గోదావరి , కృష్ణా జిల్లాలు ప్రధమ, ద్వితీయ , తృతీయ స్థానాల్లో ఉన్నాయి.
S6. Ans(c)
సోల్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం , 2014లోని పరిచ్ఛేదం 53 ప్రభుత్వ సంస్థల పంపకపు ప్రక్రియ ప్రారంభమైంది.
S7.Ans(b)
Sol. ఇటివల కృష్ణ పట్టణం పోర్టు యొక్క 100% వాటాను అధాని పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ కైవసం చేసుకున్నది. ఇప్పటి వరకు కేవలం 75% వాటాను మాత్రమే వీరు కలిగి ఉండగా ఇప్పుడు పూర్తీ వాటాను సొంతం చేసుకున్నారు.
S8.ANS.(B)
Sol. మాచ్ ఖండ్ నది విశాఖపట్నం జిల్లాలోని మాడుగ కొండల్లో జన్మించింది. ఒడిశా లోని ఉత్తర దిశగా పయనించి బంగాళాఖాతంలో కలుస్తుంది. “ముచికుంద” అనేది మాచ్ ఖండ్ నదికు గల మరొక పేరు. మాచ్-ఖండ్ నదిపై ఉన్న జలపాతం డుడుమా జలపాతం.
S9. Ans(a)
Sol. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటులో ఏర్పడే పరిపాలనా మరియు ఆర్ధిక పరమైన సమస్యల పరిష్కారానికి రాజస్థాన్ హై కోర్ట్ న్యాయమూర్తి కైలాష్ నాద్ వాంచూ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1953లో తన నివేదికను సమర్పించినది.
S10. Ans(d)
Sol. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని (2014) ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 అని పిలవవచ్చని చట్టంలోని 1 వ భాగం(పార్ట్-1)లో పేర్కొనడం జరిగింది. దీనిలో కొన్ని పదాలకు నిర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |