Telugu govt jobs   »   State GK   »   AP State GK Mega quiz MCQs...

AP State GK MCQs Mega quiz Questions And Answers in Telugu ,26 March 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

AP State GK MCQs Questions And Answers in Telugu ,26 March 2022, For APPSC Group 4 And APPSC Endowment OfficerAPPSC/TSPSC Sure shot Selection Group

 

AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

Q1. ఎవరి ఆమరణ నిరాహార దీక్ష కారణంగా మద్రాసు రాష్ట్రము లోని తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంగా విభజించారు?

  1. కందుకూరి వీరేశలింగం పంతులు
  2. పొట్టి శ్రీరాములు
  3. టంగుటూరి ప్రకాశం
  4. గాడిచర్ల హరి సర్వోత్తమరావు

 

Q2. రాష్ట్రాల పునర్విభజన చట్టం ను అనుసరించి హైదరాబాద్ రాజ్యంలోని మరాఠీ జిల్లాలు ఏ రాష్ట్రంలో కలిశాయి?

  1. మధ్యప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక 
  4. పైవేవి కాదు

 

Q3. కర్నాటక రాష్ట్రము ఏ జిల్లాలను సరిగాద్దుగా కలిగి ఉంది?

  1. కర్నూలు
  2. అనంతపురం
  3. ఒడిస్సా
  4. చిత్తూరు 
  1. 1,2 మాత్రమే
  2. 2,3 మరియు 4.
  3. 1, 2 మరియు 4.
  4. 1,2,3 మరియు 4.

 

Q4. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల జిల్లాలోని కొన్ని మండలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటం తో వీటిని ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలలో విలీనం చేసారు?

  1. పశ్చిమగోదావరి
  2. తూర్పు గోదావరి
  3. పైవి రెండూ
  4. పైవేవి కాదు

 

Q5. ఈ క్రింది వాటిలో ఏ మండలాలు ఆంద్రప్రదేశ్ లో విలీనం చేసిన మండలాలు?

  1. వేలురుపాడు 
  2. కూనవరం
  3. చింతూరు 
  4. కుక్కనూరు
  5. వరరామచంద్రాపురం
  1. 1, 2 మరియు 3
  2. 2, 3 మరియు 4
  3. 3,4 మరియు 5
  4. 1,2,3,4 మరియు 5

 

Q6. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కేటాయింపుల(outlay) మొత్తం ఎంత?

  1.  64.23 కోట్లు
  2.  94 కోట్లు
  3. 75 కోట్లు
  4. ఏది కాదు

 

Q7. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమాలు ప్రారంభించ బడ్డాయి?

  1.  సామాజికాభివ్రుద్ది పధకం( 1952) 
  2. మాచఖండ్ జలవిధ్యుత్ ప్రాజెక్ట్ (విశాఖ)
  3. హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ( విశాఖ – 1952)
  4. పైవన్నీ

 

Q8. IADP పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ని బ్లాకులలో ప్రవేశపెట్టడం జరిగింది?

  1.  100
  2.  150
  3. 117
  4. 120

 

Q9. వార్షిక ప్రణాళికలు లేదా ప్రణాళిక విరామం ఈ క్రింది ఏ సంవత్సరాల మధ్య చోటుచేసుకున్నాయి?

  1.  1966-1968 
  2. 1976-1979 
  3. 1966-1969
  4.  1965-1968 

 

Q10. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత ఎంత(చదరపు కిలోమీటరుకు)?

  1. 384
  2. 332
  3. 304
  4. 982

 

Q11. పోర్చుగీసువారు తొలి వర్తక స్తావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసారు ?

  1. మచిలీపట్నం
  2. పులికాట్
  3. భీమునిపట్నం
  4. విశాఖపట్నం

 

Q12. మొదటి కర్ణాటక యుద్ధం ఎపుడు జరిగింది ?

  1. 1745 – 1748
  2. 1742 – 1753
  3. 1740 – 1748
  4. 1710 – 1728

 

Q13. బొబ్బిలియుద్ధం ఎవరెవరి మద్య జరిగింది ?

  1. విజయరామరాజు & రంగారావు
  2. విజయరామరాజు & తాండ్ర పాపారాయుడు
  3. రంగారావు & ఆనంద గజపతి
  4. విజయరామరాజు & ఆనంద గజపతి

 

Q14. ఉత్తర సర్కారులు అనగానేమి ?

  1. కంపెనీ పాలకులు
  2. ఒక నిర్దేశిత ప్రాంతం
  3. జమిందారులు
  4. రాజులు

 

Q15. క్రింది వాటిలో దత్త మండలాలు ఏవి?

  1. పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీకాకుళం , ప్రకాశం 
  2. శ్రీకాకుళం , ప్రకాశం జిల్లాలు
  3. కర్నూలు , అనంతపురం జిల్లాలు
  4. కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం జిల్లాలు.

 

Q16. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి  వచ్చింది?

  1.  2013
  2. 2014
  3. 2015
  4. 2012

 

Q17. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎన్ని భాగాలు,ఎన్ని షెడ్యూళ్లు మరియు ఎన్నిఅధికరణలు ఉన్నాయి?

  1. 10,12 మరియు 108
  2. 15,13 మరియు 106
  3. 12,13 మరియు 108
  4. 11,13 మరియు 107

 

Q18. రెండు రాష్ట్రాల్లోని  అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజక వర్షాలను గురించి ఏ షెడ్యూల్లో  పేర్కొన్నారు?

  1. మూడో షెడ్యూల్‌ 
  2. నాలుగో షెడ్యూల్‌ 
  3. అయిదో షెడ్యూల్‌ 
  4. రెండో షెడ్యూల్‌

 

Q19. రెండు రాష్ట్రాల్లోని  శాసనమండలి సభ్యులను గురించి ఏ షెడ్యూల్లో  పేర్కొన్నారు?

  1. మూడో షెడ్యూల్‌ 
  2. నాలుగో షెడ్యూల్‌ 
  3. అయిదో షెడ్యూల్‌ 
  4. రెండో షెడ్యూల్‌

 

Q20. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పెన్షన్‌ చెల్లింపుల బాధ్యతల గురించి ఏ షెడ్యూల్లో  పేర్కొన్నారు?

  1. మూడో షెడ్యూల్‌ 
  2. ఎనిమిదో షెడ్యూల్‌ 
  3. అయిదో షెడ్యూల్‌ 
  4. రెండో షెడ్యూల్‌

 

Q21. నమామి గంగా కార్యక్రమం కోసం అధికారిక చిహ్నంగా ఏ కార్టూన్ పాత్రను ఎంచుకున్నారు?

  1.  శక్తిమాన్
  2.  చోటా భీమ్
  3. మోటు పాట్లు
  4. చాచా చౌదరి

 

Q22. కింది వాటిలో ఏ జట్టు డ్యూరాండ్ కప్ 2021 గెలుచుకుంది?

  1. FC బెంగళూరు
  2. FC ఆర్మీ రెడ్
  3. FC గోవా
  4. FC మహమ్మదన్

 

Q23. ఆస్ట్రేలియన్ నావికాదళం మరియు భారతీయ నౌకాదళ ద్వైపాక్షిక వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ – ‘AUSINDEX’ సెప్టెంబర్ 2021 లో నిర్వహించబడింది?

  1.  1 వ
  2. 2 వ
  3. 3 వ
  4. 4 వ

 

Q24. ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన ‘Azadi@75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్ ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్’ కాన్ఫరెన్స్ కమ్ ఎక్స్ పో ఏ నగరంలో ప్రారంభం అయ్యింది?

  1. హైదరాబాద్
  2. అహ్మదాబాద్
  3. లక్నో
  4. కోల్ కతా

 

Q25. కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్థి విద్యార్థులకు బ్రాండెడ్ శానిటరీ న్యాప్‌కిన్‌లను అందించడానికి ‘స్వేచ్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది?

  1.  ఆంధ్ర ప్రదేశ్
  2. తెలంగాణ
  3. కర్ణాటక
  4. కేరళ

 

Q26. రసాయన శాస్త్రంలో 2021 నోబెల్ బహుమతి విజేతలను పేర్కొనండి.

  1.  రిచర్డ్ హెండర్సన్ మరియు బెన్ ఫెరింగా
  2.  జెన్నిఫర్ దౌద్నా మరియు అకీరా యోషినో
  3. బెంజమిన్ జాబితా మరియు డేవిడ్ మాక్‌మిలన్
  4.  విలియం E. మోయర్నర్ మరియు పాల్ L. మోడ్రిచ్

 

Q27. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా వేసిన GDP వృద్ధి రేటు ఎంత?

  1.  7.2%
  2.  9.1%
  3.  7.5%
  4.  8.3%

 

Q28. 5 సంవత్సరాలలో ఏర్పాటు చేయడానికి ఎన్ని PM MITRA మెగా టెక్స్‌టైల్ ఉద్యానవనాలను ప్రభుత్వం ఆమోదించింది?

  1.  5
  2. 15
  3.  12
  4.  7

 

Q29. ఉప-సహారా ఆఫ్రికాలోని పిల్లలలో RTS, S/AS01 (RTS, S) వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉపయోగించాలని WHO సిఫార్సు చేసింది. RTS, S అనేది ________________ కి వ్యతిరేకంగా పనిచేసే టీకా.

  1. HIV/AID లు
  2.  చికెన్ పాక్స్
  3.  స్మాల్ పాక్స్
  4.  మలేరియా

 

Q30. కన్యాకుమారి లవంగానికి ఇటీవల ఏ రాష్ట్రం జిఐ ట్యాగ్‌ను పొందింది?

  1.  కేరళ
  2.  ఆంధ్రప్రదేశ్
  3.  కర్ణాటక
  4. తమిళనాడు

Solutions: 

S1.Ans (2)

Sol. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953, అక్టోబర్1 న  మద్రాసు రాష్ట్రము లోని తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము అవిర్భించింది.

 

S2.Ans (2)

Sol. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 ను అనుసరించి హైదరాబాద్ రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకు, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకాకు పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసింది. అలా 1956 నవంబర్ 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతాన్ని, మద్రాసు నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా తొలి బాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. 

 

S3.Ans (3)

Sol కర్ణాటక రాష్ట్రము కర్నూలు,చిత్తూరు, అనంతపురం జిల్లాలను సరిహద్దుగా కలదు. విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలను సరిహద్దుగా గల రాష్ట్రం ఒడిస్సా. చిత్తూరు, నెల్లూరు తమిళనాడు రాష్ట్రాన్ని సరిహద్దుగా కలవు.

 

S4.Ans.(3)

Sol. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో వీటిని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో విలీనం చేసారు.

 

S5.Ans.(4)

Sol. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండటంతో వీటిని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో విలీనం చేసారు. అవి 1. వేలురుపాడు 2.భూర్గంపాడు పాక్షికంగా (6 రెవెన్యూ గ్రామాలు, 4 పంచాయితీలు) 3. చింతూరు 4. కుక్కనూరు 5. వరరామచంద్రాపురం 6.కూనవరం 7.భద్రాచలం (70 రెవెన్యూ గ్రామాలు, 21 పంచాయితీలు).

 

S6. Ans(1)

Sol. మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56) కాలంలో ఆంధ్రరాష్ట్రానికి సుమారుగా 64.23 కోట్లు కేటాయించడం జరిగింది. Outlay అంటే కేటాయించిన మొత్తం. Expenditure అంటే వాస్తవంగా ఖర్చు పెట్టిన మొత్తం.

 

S7. Ans(4)

Sol. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో పై అన్ని ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. వీటితో పాటు 1954 హైదరాబాద్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

 

S8. Ans(3)

sol. IADP(intensive Agricultural District Program) ను విస్తరించి IAAP(intensive agricultural Area Program) గా దేశంలో 114 జిల్లాలలో ప్రారంభించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పధకాన్ని 117 బ్లాకులలో ప్రారంభించడం జరిగింది. 

 

S9. Ans(3)

sol. 1966 లో ఆర్ధిక సంక్షోభం కారణంగాను, రాజకీయంగా యుద్దాలను ఎదుర్కోవడం కారణంగా ప్రణాళికలను రూపొందించలేకపోయారు. అందుకే ఈ కాలాన్ని ప్రణాళిక సెలవు కాలం లేదా ప్రణాళిక విరామం లేదా వార్షిక ప్రణాళిక కాలం అని అంటారు. 

 

S10. Ans(3)

Sol. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన సాంద్రత చదరపు కిలో మీటరుకు 304 గా ఉన్నది. ఇది అఖిల భారత స్థాయిలో 382 గా ఉన్నది. 

 

S11. Ans (1)

Sol. పోర్చుగీసువారు తొలి స్థావరాన్ని మచిలిపట్నం (1670)లో ఏర్పాటు చేసుకున్నారు. . తర్వాత డచ్చివారు 1610లో పులికాట్‌లో శాశ్వత వర్తక కేంద్రాన్ని నెలకొల్పారు. ఆంగ్లేయులు 1611లో గ్లోబ్‌ నౌకలో హిప్పన్‌ నాయకత్వంలో వచ్చి మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరాన్ని (1622) స్టాపించారు. 

 

S12. Ans (3)

Sol. ఐరోపాలో ప్రారంభమైన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఇంగ్లండ్‌, ప్రాన్‌స్‌ల జోక్యం వల్ల భారతదేశంలో రెండు కంపెనీల మధ్య యుద్దం మొదలైంది. నాటి ఫ్రెంచి గవర్నర్‌ డూప్లే ఆంగ్ల గవర్నర్‌ నికోలస్‌ మోర్స్‌. డూప్లే మద్రాసుపై దాడి చేసి ఆంగ్లేయులను ఓడించాడు. ఆంగ్లేయులు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌కు ఫిర్యాదు చేయగా, అతడు తన సైన్యంతో ఫ్రెంచివారిపై సైన్యాన్ని నడిపి శాంధథోమ్‌ యుద్దం (1746)లో ఫ్రెంచివారి చేతిలో ఓటమి నొందాడు. 1748లోఎక్‌స్‌లా ఛాపెల్‌ సంధి ద్వారా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది

 

S13. Ans (2)

Sol. బుస్సీ సలహాతో విజయనగర జమీందారు విజయరామరాజు బొబ్బిలిపై యుద్ధాన్ని ప్రకటించాడు. బొబ్బిలి జమీందారు రంగారావు చనిపోగా, అతడి మిత్రుడు తాండ్ర పాపారాయుడు విజయరామరాజును హత్య చేశాడు. తర్వాత ఆనంద గజపతి విజయనగర జమీందారుగా నియమితుడయ్యాడు.

 

S14. Ans (2)

Sol. నేటి కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న ప్రాంతాన్ని ఉత్తర సర్కారులు అనేవారు. సలాబత్‌జంగ్‌ వీటిని మొదట ఫ్రెంచివారికి (1754) తర్వాత ఆంగ్లేయులకు (1759) ఇచ్చాడు. 

 

S15. Ans (4)

Sol. కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం జిల్లాలను నిజాం అలీ 1800, అక్టోబరు 12న సైన్య సహకార పద్ధతిలో చేరినందుకుగాను ఆంగ్లేయులకు దత్తం చేశాడు. అందుకే వాటిని దత్త మండలాలు అంటారు. ఈ ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో తర్వాత మొగలుల ఆధీనంలో ఉండేవి. వీటిని హైదర్‌ అలీ, టిప్పు సుల్తానులు ఆక్రమించారు. చివరికి నాలుగో మైసూర్‌ యుద్ధం తర్వాత హైదరాబాద్‌ నిజాం ఆధీనంలోకి వచ్చాయి.

 

S16. Ans (2)

Sol. 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి  వచ్చింది. ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది.

 

S17.Ans(3)

Sol. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ  చట్టంలో 12 భాగాలు (పార్పు), 108 అధికరణలు (సెక్షన్‌లు), 13 షెడ్యూళ్లు ఉన్నాయి.

 

S18. Ans(1)

Sol. మూడో షెడ్యూల్‌ (24వ అధికరణ) లో  రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజక వర్షాలను గురించి పేర్కొన్నారు.

 

S19. Ans(2)

Sol. నాలుగో షెడ్యూల్‌ (22(2)వ అధికరణ) లో రెండు రాష్ట్రాల్లోని శాసనమండలి సభ్యులను గురించి పేర్కొన్నారు.

 

S20. Ans(2)

Sol. ఎనిమిదో షెడ్యూల్‌ (59వ అధికరణ) లో పెన్షన్‌ చెల్లింపుల బాధ్యతల గురించి తెలియజేస్తుంది.

 

S21. Ans.(4)

Sol. ఐకానిక్ ఇండియన్ కామిక్ బుక్ కార్టూన్ క్యారెక్టర్, చాచా చౌదరి, అతని మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పని చేస్తుంది, కేంద్ర ప్రాయోజిత నమామి గంగే ప్రోగ్రామ్‌కు అధికారిక చిహ్నంగా ప్రకటించబడింది.

 

S22. Ans.(3)

Sol. కోల్‌కతాలోని వివేకానంద యుబా భారతి క్రిరంగన్‌లో జరిగిన ఫైనల్లో ఎఫ్‌సి గోవా 1-0తో మొహమ్మదన్ స్పోర్టింగ్‌ను ఓడించి తొలి డ్యూరాండ్ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలుచుకుంది.

 

S23. Ans.(4)

Sol. ‘ఆసిండెక్స్’: భారత్, ఆస్ట్రేలియా ద్వైవార్షిక మారిటైమ్ సిరీస్ 4వ ఎడిషన్‌లో పాల్గొంటాయి. సెప్టెంబర్ 30న భారతదేశం మరియు ఆస్ట్రేలియా ద్వైవార్షిక సముద్ర సిరీస్ ‘AUSINDEX’ యొక్క నాల్గవ పునరావృతంలో పాల్గొన్నాయి.

 

S24. Ans.(3)

Sol. ఆజాదీ@75 వేడుకల్లో భాగంగా అక్టోబర్ 05, 2021న ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో లక్నోలో జరిగిన ‘ఆజాదీ@75 – న్యూ అర్బన్ ఇండియా: ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్‌స్కేప్’ కాన్ఫరెన్స్-కమ్-ఎక్స్‌పోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. మూడు రోజుల ఈవెంట్ యొక్క నేపధ్యం “న్యూ అర్బన్ ఇండియా”.

 

S25. Ans.(1)

Sol. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. ఋతుస్రావంతో ముడిపడి ఉన్న కళంకాన్ని పరిష్కరించడానికి, స్త్రీల వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు సమాచారానికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడానికి జగన్ మోహన్ రెడ్డి ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

 

S26. Ans.(3)

Sol. 2021 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని బెంజమిన్ లిస్ట్ (జర్మనీ) మరియు డేవిడ్ మాక్‌మిలన్ (USA) లకు సంయుక్తంగా అందించారు.

 

S27. Ans.(4)

Sol. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22లో భారతదేశం యొక్క నిజమైన స్థూల దేశీయోత్పత్తి (GDP) దక్షిణాసియాకు సంబంధించిన తాజా ఆర్థిక నవీకరణలో 8.3% పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

 

S28. Ans.(4)

Sol. గ్లోబల్ టెక్స్‌టైల్స్ మ్యాప్‌లో భారతదేశాన్ని పటిష్టంగా ఉంచడానికి మరియు ఆర్థిక వ్యవస్థలో టెక్స్‌టైల్ రంగం వృద్ధికి సహాయపడే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కులు లేదా PM మిత్రా పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఐదేళ్లకు ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.4,445 కోట్లుగా నిర్ణయించారు.

 

S29. Ans.(4)

Sol. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) RTS,S/AS01 (RTS,S) మలేరియా వ్యాక్సిన్‌ని ఉప-సహారా ఆఫ్రికాలోని పిల్లలలో మరియు మితమైన మరియు అధిక P. ఫాల్సిపరం మలేరియా వ్యాప్తి ఉన్న ఇతర ప్రాంతాలలో విస్తృతంగా ఉపయోగించాలని సిఫార్సు చేస్తోంది.

 

S30. Ans.(4)

Sol. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కొండల్లో పండే ప్రత్యేకమైన లవంగం మసాలాకు ‘కన్యాకుమారి లవంగం’గా భౌగోళిక సూచిక (GI) లభించింది.

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,26 March 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

AP State GK MCQs Questions And Answers in Telugu ,26 March 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer
Download Adda247 App

Sharing is caring!