AP Medtech Zone in Visakhapatnam Will Organise International Congress | విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ అంతర్జాతీయ కాంగ్రెస్ను నిర్వహించనుంది
విశాఖపట్నం లో ఉన్న ఏపి మెడ్ టెక్ జోన్ లో ఇండియా ఎక్స్ పో అనే ఎగ్జిబిషన్ ను కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా విస్తీర్ణం గల ఎగ్జిబిషన్ ను నిర్మించి రికార్డు సృష్టించింది. 2023 జూన్ నెలలో ప్రారంభమైన ఈ పనులు నవంబర్ 9న పూర్తయ్యాయి. ఈ ఎక్స్పో సిటీ లో నాలుగు కాన్ఫరెన్స్ హాల్లు, బోర్డు రూమ్లు ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైన తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మ్యానేజ్మెంట్ కాంగ్రెస్ (ICEHTMC) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది ఈ సదస్సుని అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ (AAMI) మరియు గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలయెన్స (GCEA) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సుకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరవ్వనున్నారు, అలాగే వైద్య పరికరాల వినియోగం, అత్యాధునిక టెక్నాలజీ, హెల్త్ మ్యానేజ్మెంట్ వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ కాంగ్రెస్ లో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 14నుంచి 16 వరకు ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా నిర్వహిస్తుంది అని రాబర్ట్ బరోస్ తెలిపారు. దీనికి 80కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవ్వుతారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |