AP CM inaugurated Handri Neeva pump house in Kurnool | కర్నూలులో హంద్రీనీవా పంప్హౌస్ను ప్రారంభించిన ఏపీ సీఎం
కరువు పీడిత ప్రాంతాలైన డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం ప్రాంతాల్లోని 77 చెరువుల్లోకి నీటిని పంపింగ్ చేసి, సుమారు 150 గ్రామాల తాగు, సాగు అవసరాలను తీర్చేందుకు హంద్రీనీవా ఎత్తిపోతల పథకం కింద రూ.253 కోట్లతో చేపట్టిన లక్కాసాగరం పంప్ హౌస్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 19 న ప్రారంభించారు.
ఈ సందర్భంగా డోన్లో జరిగిన బహిరంగ సభలో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లపై ముఖ్యమంత్రి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని బీడు ప్రాంతాలకు నీరందిస్తామని ఆయన వివరించారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు గతం లో రూ.13 కోట్లు మాత్రమే విడుదల చేశారని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.6 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.
ప్రభుత్వం 2019లో రాయలసీమ ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించిందని, వెలిగొండ ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, రెండో టన్నెల్ పూర్తయి వచ్చే నెలలో ప్రాజెక్టును ప్రారంభిస్తామని వెల్లడించారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************